మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు వీరే ...

చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు వీరే ...

చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ నాయకులు వీరే ...

చిలకలూరిపేట నేడు నారా లోకి సమక్షంలో వైసిపి నుండి భారీ ఎత్తున ముఖ్య నాయకులు టిడిపిలో చేరారు. ఐదు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నా కూడా అనేక సమస్యలు ఇబ్బందులకు గురి చేశారని వారు వాపోయారు. టిడిపి చేరిన ముఖ్య నాయకుల వివరాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇండ‌స్ట్రియ‌ల్ డెవల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ మాజీ డైరెక్ట‌ర్‌, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా కొన‌సాగి అసెంబ్లీ అభ్య‌ర్ధిగా పోటీ చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకున్న మ‌ల్లెల రాజేష్‌నాయుడుగారు వైకాపాను వీడి శుక్ర‌వారం తెదేపా తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి వ‌ర్యులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్య‌క్షులు ప్ర‌త్తిపాటి పుల్లారావుగారి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ గారి స‌మ‌క్షంలో మ‌ల్లెల రాజేష్‌నాయుడుగారు తెదేపాలో చేరారు. నారా లోకేష్ గారు రాజేష్‌నాయుడుగారికి పార్టీ కండువాక‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజేష్‌గారితోపాటు 25 మంది చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ కీల‌క‌నేత‌లు వైకాపాకు రాజీనామా చేసి తెదేపా కండువాలు క‌ప్పుకున్నారు. తెదేపాలో చేరిన‌వారిలో య‌డ్ల‌పాడు మండ‌ల జ‌డ్పీటీసీ స‌భ్యులు ముక్తా వాసు, చిల‌క‌లూరిపేట మునిసిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ కొలిశెట్టి శ్రీ‌నివాస‌రావు, మునిసిప‌ల్ కౌన్సిల‌ర్‌లు తులం సుధాక‌ర్‌, చెమిటిగంటి పార్వ‌తిదేవి, బిట్రా రాజేంద్ర‌ప్ర‌సాద్, షేక్ జ‌మీలా, జాలాది సుబ్బారావు, కౌన్సిల‌ర్‌, వైసీపీ మైనార్టీసెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బేరింగ్ మౌలాలి, ఎస్సీసెల్ రాష్ట్ర నాయ‌కులు పంగులూరి వెంగ‌ళ‌రాయుడు, వైకాపా సీనియ‌ర్ నాయ‌కులు గాలి బుచ్చ‌య్య‌,  బీసీసెల్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు, వైసీపీ ముఖ్య నాయ‌కుడు ఎం.వి.ర‌త్నారెడ్డి, మ‌హిళావిభాగం ప‌ట్ట‌ణ అధ్య‌క్షురాలు యాదాల సుజాత‌, బుక్కాపురం స‌ర్పంచ్ అల్లం ఆంజ‌నేయులు, విద్యార్ధి విభాగం నాయ‌కులు నాగూర్‌, ఇక్భాల్‌, గౌస్‌లు, సీనియ‌ర్ నాయ‌కులు రామిశెట్టి తాండ‌వేశ్వ‌ర‌రావు, తోట సీత‌య్య‌, కోట నాగ‌పూర్ణ‌చంద్ర‌రావు, గుంజి బాజిల‌తోపాటు ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు TDP లో చేరారు.

క్రింది లింక్ పై క్లిక్ చేయండి మరిన్ని వార్తలు పొందండి

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY


Share:

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...


1. విజయనగరం లోక్‌సభ - అప్పలనాయుడు, 

2. ఒంగోలు లోక్‌సభ - మాగుంట శ్రీనివాసులరెడ్డి, 

3. అనంతపురం లోక్‌సభ - అంబికా లక్ష్మినారాయణ, 

4. కడప లోక్‌సభ- చదిపిరాళ్ల భూపేష్‌ రెడ్డి పేర్లు ప్రకటన.. 


1. చీపురుపల్లి అసెంబ్లీ - కళా వెంకట్రావు, 

2. భీమిలి - గంటా శ్రీనివాసరావు, 

3. పాడేరు - వెంకటరమేష్‌ నాయుడు, 

4. దర్శి – గొట్టిపాటి లక్ష్మి, 

5. రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం, 

6. ఆలూరు - వీరభద్ర గౌడ్‌, 

7. గుంతకల్లు - గుమ్మనూరు జయరాం, 

8. అనంతపురం అర్బన్‌ - దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, 

9. కదిరి - కందికుంట వెంకటప్రసాద్‌ పేర్లను ప్రకటించిన టీడీపీ

మొదట్నుంచీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును.. చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ ప్రయత్నించింది. అయితే.. భీమిలి నుంచే పోటీ చేస్తానని గంటా.. లేదు చీపురుపల్లి నుంచే పోటీచేయాలని చంద్రబాబు ఇలా సుమారు రెండు వారాలు పాటు పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. దీంతో అభ్యర్థుల ప్రకటన పెండింగ్ పడుతూ వచ్చింది. అయితే.. చివరికి గంటా అనుకున్న, కోరుకున్న నియోజకవర్గం భీమిలీని చంద్రబాబు కేటాయించారు. ఇక గంటా కోసం అనుకున్న చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. 

ఇక ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గమైన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ పెద్ద తతంగమే జరిగింది. చివరికి సుగవాసి సుబ్రమణ్యంను ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతోంది టీడీపీ అధిష్టానం..

Share:

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు

గత కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో ఏర్పడిన చీలికలకు తెరపడింది. ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేష్ నాయుడు ఈరోజు నారా లోకేష్ సమక్షంలో టిడిపి లో చేరారు. కొన్ని రోజులుగా వైసిపి పార్టీలో చిలకలూరిపేట సమన్వయకర్తగా తొలగించినప్పటినుండి తీవ్ర సంతృప్తిలో ఉన్న రాజేష్ నాయుడు నేడు వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు. అతనితోపాటు మరి కొంతమంది వార్డు మెంబర్లు టిడిపి పార్టీలో చేరారు. మంత్రి విడదల రజిని నుండి ఆర్థికపరమైన విషయాలలో తేడా రావటం వలన చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్త తొలగించినట్లు అప్పట్లో పట్టణమంతా మారుమోగింది. చిలకలూరిపేటలో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు టికెట్ ఇవ్వటంతో పట్టణంలోని కొంతమంది YSRCP కౌన్సిల్ మెంబర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. నేడు రాజేష్ నాయుడుతో పాటు తో పాటు వైసీపీ వ్యతిరేక కౌన్సిలర్లు కూడా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.


Follow below

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY


Share:

చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్

చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్


చిలకలూరిపేట :- గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిపై రగడ నడుస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేష్ నాయుడు నేడు మంగళగిరిలోని టిడిపి ఆఫీసు నందు నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరటం ఖరారు అయినట్టు సమాచారం. ఇప్పటికే సన్నిహితులతో పాటు కార్యకర్తలతో టిడిపి ఆఫీస్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన రాజేష్ నాయుడుని వైసీపీ పార్టీలో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అనుచరులు తెలిపారు. తనతో పాటు 18 మంది వైసిపి వార్డు మెంబర్ల టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. దీంతో పట్టణంలో రాబోవు ఎన్నికలకు టిడిపి గెలుపు పై కాకుండా మెజారిటీపై చర్చలు జరుపుకుంటున్నారు.

Follow below


Share:

ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా ?

ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా ?

ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా ?


2024 సాదారణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సిద్దం చేసుకోవలసిన వాటిలో ముఖ్యమైనవి.

నో డ్యూస్ సర్టిఫికెట్ :- మీ గ్రామ పంచాయితీ/మున్సిపాలిటీ నుండి తీసుకోవాలి.

కేస్ట్ సర్టిఫికెట్ :- రిజర్వుడు స్థానాల్లో పోటీ చేసే వారు తప్పనిసరిగా కొత్త కేస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి.

మిమ్మల్ని  బలపరుస్తున్నట్టు మీ నియోజక వర్గంలో 10 మంది ఓటరు కార్డు జిరాక్స్ లు.

పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ :- మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తారో ఆ స్టేషన్ నుండి పొందవచ్చు.

మీకు ఉన్న అన్ని బ్యాంకు ఖాతాల ఫస్ట్ పేజీ జిరాక్స్ మరియు 6 నెలల స్టేట్ మెంట్ మరియు పాన్ కార్డ్ జిరాక్స్ ( భార్య/భర్త, పిల్లలు ఉంటే వారివి కూడా)

స్థిర, చర ఆస్తుల వివరాలు మరియు అప్పుల వివరాలు.

డిపాజిట్ సొమ్ము ఎంపీ అభ్యర్థికి 25000 / ఎస్సీ ఎస్టీ వారికి 12500.

ఎమ్మెల్యే అభ్యర్థికి 10000 / ఎస్సీ ఎస్టీ వారికి 5000.

Share:

ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి

ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి

ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి


ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బిజెపి అభ్యర్థుల జాబితా APలో ఆరు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను విడుదల చేసింది.

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

రాజమండ్రి- పురంధేశ్వరి, 

అనకాపల్లి- సీఎం రమేష్‌

అరకు-కొత్తపల్లి గీత, 

రాజంపేట- కిరణ్‌కుమార్‌రెడ్డి

తిరుపతి-వరప్రసాద్‌, 

నరసాపురం-శ్రీనివాసవర్మ

ఖమ్మం-తాండ్ర వినోద్‌రావు, (TS)

వరంగల్‌-ఆరూరి రమేష్‌ (TS)


18 మంది తో కూడిన జాబితా విడుదల చేసిన జనసేన...

1.పిఠాపురం : పవన్ కళ్యాణ్

2. నెల్లిమర్ల: లోకం మాధవి

3. అనకాపల్లి:కొణతాల రామకృష్ణ

4. కాకినాడ రూరల్: శ్రీ పంతం నానాజీ 

5.రాజానగరం: శ్రీ బత్తుల బలరామకృష్ణ 

6.తెనాలి: శ్రీ నాదెండ్ల మనోహర్

7.నిడదవోలు: శ్రీ కందుల దుర్గేష్ 

8.పెందుర్తి: శ్రీ పంచకర్ల రమేష్ బాబు 

9.యలమంచిలి: శ్రీ సుందరపు విజయ్ కుమార్ 

10.పి.గన్నవరం: శ్రీ గిడ్డి సత్యనారాయణ 

11.రాజోలు: శ్రీ దేవ వరప్రసాద్ 

12.తాడేపల్లిగూడెం: శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ 

13.భీమవరం: శ్రీ పులపర్తి ఆంజనేయులు 

14.నరసాపురం: శ్రీ బొమ్మిడి నాయకర్ 

15. ఉంగుటూరు: శ్రీ పత్సమట్ల ధర్మరాజు 

16.పోలవరం: శ్రీ చిర్రి బాలరాజు 

17.తిరుపతి: శ్రీ ఆరణి శ్రీనివాసులు 

18.రైల్వే కోడూరు: డా.యనమల భాస్కర రావు

పి గన్నవరం రాజేష్ మహాసేన టిడిపి అభ్యర్థిగా తప్పుకోవడంతో ఆస్థానంలో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ బరిలోకి దిగారు.

నరసాపురం ఎంపీ స్థానాన్నిలో బిజెపి శ్రీనివాస వర్మ పోటీ చేయనున్నటంతో రఘురామకృష్ణం రాజు పరిస్థితి అయోమయం అయినది. గత కొన్ని రోజులుగా కూటమిలో తనకు స్థానం ఉందని ప్రకటించుకున్న రఘురామకృష్ణంరాజు సీటు దక్కకపోవడంతో కంగు తిన్నారు.

మరోవైపు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి చేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని బిజెపి అధిష్టానం ఖరారు చేసింది.


Click on below

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

11 అసెంబ్లీ, 13 లోక్ సభ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పై క్లారిటీ...

11 అసెంబ్లీ, 13 లోక్ సభ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పై క్లారిటీ...

11 అసెంబ్లీ, 13 లోక్ సభ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పై క్లారిటీ...


టీడీపీ మూడో జాబితా విడుదల. 13 మంది లోక్‌సభ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ.

గత కొంతకాలంగా నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా రకరకాల పేర్లు పుకార్లు షికారులు చేయక వాటన్నిటికీ తరలించుతూ నేడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు టికెట్ కన్ఫామ్ చేశారు. రెండు రోజుల క్రితం కూడా రామిరెడ్డి అనే వ్యక్తి చదలవాడకు టికెట్ కోరుతూ పురుగుల మందు తాగిన విషయం అందరికీ తెలిసినదే. దీంతో నరసరావుపేటలో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. గత రెండు పర్యాయాలుగా నరసరావుపేటలోని టిడిపి క్యాడర్ను కాపాడుకుంటూ వస్తున్న చదలవాడా అనింది బాబు కాకుండా వేరే వారికి ఇస్తే పరిస్థితి దారు మారవుతుందని ఉద్దేశంతో టిడిపి పునః ఆలోచన చేసి చదలవాడకే టికెట్ కన్ఫామ్ చేసింది. ఎంపీ అభ్యర్థులుగా ఈసారి యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. పార్లమెంట్లో తమ గళాన్ని వినిపించాలంటే యువత అయితే బాగుంటుందని టిడిపి ఆలోచించినట్టు తెలుస్తుంది.

హాట్ సీట్లైనా నరసరావుపేట, విజయవాడ. విశాఖపట్నం, గుంటూరులలో సామాజిక ఆర్థికపరంగా బలంగా ఉండే వ్యక్తులను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

పొత్తులో భాగంగా టిడిపికి 17 పార్లమెంట్ స్థానాలను కేటాయించగా అందులో 13 స్థానాలను ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలలో విజయనగరం, కడప, ఒంగోలు, అనంతపురం ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు తెలియాల్సి ఉంది.

ఎంపీ అభ్యర్థులు: శ్రీకాకుళం- రామ్మోహన్‌ నాయుడు,

 విశాఖపట్నం - భరత్, 

అమలాపురం - గంటి హరీష్ మాధుర్‌, 

ఏలూరు - పుట్టా మహేష్‌ యాదవ్, 

విజయవాడ - కేశినేని చిన్ని, 

గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్‌, 

నర్సరావుపేట - లావు శ్రీకృష్ణదేవరాయలు, 

బాపట్ల - టి. కృష్ణప్రసాద్, 

నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, 

చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, 

కర్నూలు - బస్తిపాటి నాగరాజు, 

నంద్యాల - బైరెడ్డి శబరి, 

హిందూపూర్‌-బీకే పార్థసారథి


టీడీపీ మూడో జాబితా విడుదల. 13 మంది లోక్‌సభ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ.

అసెంబ్లీ అభ్యర్థులు: పలాస-గౌతు శిరీష, 

పాతపట్నం-మామిడి గోవింద్‌రావు, 

శ్రీకాకుళం-గొండు శంకర్‌, 

శృంగవరపుకోట-కోళ్ల లలితా కుమారి, 

కాకినాడ సిటీ-వెంకటేశ్వరరావు, 

అమలాపురం-అయితాబత్తుల ఆనందరావు, 

పెనమలూరు-బోడె ప్రసాద్, 

మైలవరం-వసంత వెంకట కృష్ణప్రసాద్, 

నర్సరావుపేట - చదలవాడ అరవింద్‌ బాబు, 

చీరాల - మద్దులూరి మాలకొండయ్య యాదవ్,

సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి


Follw below

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట :- పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న పెద్ద శివాలయం నందు భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లోని పెద్ద శివాలయం నిర్మాణ పనులు పూర్తిచేసుకుని ఈరోజు విగ్రహా పునజీవ ప్రతిష్ట మహోత్సవం మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం రంగ రంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం నుంచి దేవాలయంలో భక్తులు రద్దీతో కిక్కిరిసిపోయింది. చుట్టుపక్కల ఊర్ల నుండి బంధువులు లతో ఆడపడుచులతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళామందిర్ సెంటర్ నందు, చలివేంద్రం బజార్ నందు, మార్కెట్ సెంటర్ నందు వేలాది మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీతో గడియార స్తంభం, కళామందిర్ సెంటర్ నందు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది.

ధ్వజస్తంభ ప్రతిష్ట వీడియో కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://youtu.be/103d3m9wA8w




https://youtu.be/103d3m9wA8w



Follow below for More


https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం


చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం



చిలకలూరిపేట పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ప్యాసింజర్లతో వెళుతున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చెన్నై నుంచి పొగాకు లోడు తో రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న గోడౌన్ కి వెళ్తున్న సమయంలో లారీని వెనక నుండి ఒంగోలు నుండి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్సులోని ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు లోపల ఉన్న ప్యాసింజర్లకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో నేషనల్ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రోక్లైనేర ద్వారా ఘటనకు గురైన ఆర్టీసీ బస్సును పక్కకు జరిపి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.


చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం


Share:

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

చిలకలూరిపేట :- జనసేన, టిడిపి, బిజెపి ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఇప్పటికే కార్యకర్తలు భారీ ఎత్తున సభ స్థలానికి చేరుకున్నారు. కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే అల్పాహారం, మజ్జిగ, మంచినీళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా పోలీస్ వారి కనుసైగల్లో భారీ బందోబస్తు నడుమ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుండి కూడా పట్టణంలోని లాడ్జ్ అండ్ హోటల్స్ అన్ని ముందుగానే బుక్ అయిపోవడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న విఐపి లకు వసతి సదుపాయానికి ఇక్కట్లు తప్పడం లేదు. అయినప్పటికీ పట్టణంలోని పెద్దపెద్ద హోటల్స్, టిఫిన్ సెంటర్లు జనాలతో కిరిసిపోయాయి. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడటం వలన జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్రతను కొంతవరకు తగ్గించగలిగారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు సాయంత్రం అయినప్పటికీ కూడా ప్రజలు ఇప్పటినుండే సభ స్థలానికి బారులు తీరారు. సభా ప్రాంగణానికి విఐపి పాసులు ఉంటేనే కార్లకు అనుమతిస్తున్నారు. చిలకలూరిపేట నుండి బొప్పూడి వరకు రోడ్లన్నీ టిడిపి, జనసేన, బిజెపి జెండాలతో నిండిపోయాయి. ఇప్పటికే పలు ప్రధాన కూడలిలలో కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.


సంబంధించిన వీడియో చూడటం కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.


https://youtube.com/watch?v=QlCUBK4t7Tw&si=NfJQT1u7gCiZniIu

Share:

చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్

చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్

చిలకలూరిపేట :- రాజకీయ పరిణామాల దృష్ట్యా చిలకలూరిపేట పట్టణంలోని వైసిపి కేడర్ రెండుగా చీలిపోయింది. అందులో భాగంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమాలు అందుకు ఉదాహరణ. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా చిలకలూరిపేట విచ్చేసిన మనోహర్ నాయుడుకి మెజార్టీ కౌన్సిలర్ల ఆదరణ లభించలేదు. అలాగే రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సగానికి పైగా వైసిపి కౌన్సిలర్లు హాజరయ్యి స్థానికేతులకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వబోమని బహిరంగంగానే తెలియజేశారు. ఉదయం నిర్వహించిన మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలోని సభలో మంత్రి విడుదల రజనీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానికేతరులకు మద్దతు ఇచ్చి ఒకవేళ వారి ఓడిపోతే పేటను విడిచిపెట్టి వెళ్లపోతారని, స్థానికులకు టికెట్ ఇస్తే గెలుపోవటములతో సంబంధం లేకుండా కార్యకర్తల కష్టాల్లో తోడు ఉంటారని వారు తెలిపారు. దీంతో వైసీపీ క్యాడర్ లో అయోమయం పరిస్థితిలో నెలకొన్నది. చివరికి కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇస్తే చివరికి ఎవరికి వ్యతిరేకం అవుతాము అని ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే మంత్రికి అనుకూలంగా ఉన్న వర్గం మనోహర్ నాయుడు కి మద్దతు ఇచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీలోని రాష్ట్రస్థాయి నేతలు ఈ విషయంలో కలగజేసుకొని సమస్యని కొలిక్కి తీసుకురా పోతే పార్టీలో పెద్ద నష్టం జరిగిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్


Share:

చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు

చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు

చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు


టిడిపి బిజెపి జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్మిస్తున్న భారీ బహిరంగ సభకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ భారీ సభకు లక్షలాదిగా కార్యకర్తలు తరలి వస్తారని ఉద్దేశంతో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా చెన్నై - కలకత్తా కు వెళ్లే దారిని ఒంగోలు దిగమర్రు మీదుగా రేపల్లె, మచిలీపట్నం మీదుగా విశాఖపట్నం వెళ్లాలని, అలాగే చెన్నై నుండి హైదరాబాద్ కు వెళ్లే వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, అద్దంకి మీదుగా పిడుగురాళ్ల నుండి హైదరాబాద్కు వెళ్లాలని, విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్, ఒంగోలు మీదుగా చెన్నై వెళ్లాలని ట్రాఫిక్ పోలీస్ తెలిపారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ కేట్లు నిర్మించి ట్రాఫిక్ సమస్య లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.


చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు


Share:

మోగిన ఎన్నికల నగారా - నేటి నుండి ఎన్నికల కోడ్ అమలు-EC

మోగిన ఎన్నికల నగారా - నేటి నుండి ఎన్నికల కోడ్ అమలు - EC


మోగిన ఎన్నికల నగారా - నేటి నుండి ఎన్నికల కోడ్ అమలు-EC

గత కొన్ని రోజులుగా ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా ఎన్నికల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ని ప్రకటించారు.

నేటి నుండి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ప్రారంభం - EC. దేశవార్ధంగా 97 కోట్ల మంది ఓటర్లు, ఏపీ తో పాటుగా ఒడిస్సా, సిక్కిం, అరుణాచల ప్రదేశ్తో పాటుగా కాశ్మీర్లో కూడా ఎన్నికలు, జూన్ 16 లోపు అన్ని ఎన్నికలను పూర్తి చేస్తాం, దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు, కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు, ఎలక్షన్ కోసం 55 లక్షల ఈవీఎంలను ఏర్పాటు. ఈ లోకసభ ఎన్నికలు దేశంలోనే 18 ఎన్నికలుగా, 85 సంవత్సరాలు వయసు దాటిన వారికి ఇంటి (ఓట్ ఫ్రమ్ హోమ్) వద్ద నుంచి ఓటింగ్ చేసే ప్రక్రియ. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు మూడు పేపర్లో ప్రకటన ఇవ్వాలి - EC

Share:

కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం

 కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం 

కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం


చిలకలూరిపేట :- చిలకలూరిపేట పట్టణంలో కోలాటం వాతావరణ నెలకొన్నది. ఒకవైపు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు రోడ్ షో నిర్వహిస్తుండగా, మరోవైపు టిడిపి జనసేన బిజెపి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉమ్మడి భారీ సభకు ప్రముఖులు చిలకలూరిపేట క్యు కడుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఉమ్మడి కార్యకర్తలు చిలకలూరిపేటకు క్యూ కడుతున్నారు. దేశ ప్రధాని చిలకలూరిపేటకు వస్తున్న తరుణంలో సభా ప్రాంగణానికి భారీగా అభిమానులు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి అనుమతి లేనందువలన పట్టణంలోని ప్రజలు భారీగా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా చిలకలూరిపేట పట్టణానికి విచ్చేయుచున్న మనోహర్ నాయుడు కి వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. గుంటూరు నుంచి చిలకలూరిపేటకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. దీంతో పట్టణంలోని వీధులన్నీ కూడా వివిధ పార్టీ జెండాలతో కోలాహారంగా మారింది.
Share:

వైస్సార్సీపీ అభ్యర్థులు 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలు

వైస్సార్సీపీ అభ్యర్థులు 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలు

వైస్సార్సీపీ అభ్యర్థులు 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలు


1 ఇచ్ఛాపురం - శ్రీమతి పిరియా విజయ

2 పలాస - శ్రీ సీదిరి అప్పలరాజు

3 టెక్కలి - శ్రీ దువ్వాడ శ్రీనివాస్

4 పాతపట్నం - శ్రీమతి రెడ్డి శాంతి

5 శ్రీకాకుళం - శ్రీ ధర్మాన ప్రసాద రావు

6 ఆమదాలవలస - శ్రీ తమ్మినేని సీతారాం

7 ఎచ్చెర్ల - శ్రీ గొర్లె కిరణ్ కుమార్

8 నరసన్నపేట - శ్రీ ధర్మాన కృష్ణ దాస్

9 రాజాం - శ్రీ తలే రాజేష్

10 పాలకొండ - శ్రీమతి విశ్వాసరాయి కళావతి

11 కురుపాం - శ్రీమతి పుష్పశ్రీవాణి పాముల

12 పార్వతీపురం - శ్రీ అలజంగి జోగారావు

13 సాలూరు - శ్రీ పీడిక రాజన్న దొర

14 బొబ్బిలి - శ్రీ శంబంగి వెంకట చిన అప్పల నాయుడు

15 చీపురుపల్లి - శ్రీ బొత్స సత్యనారాయణ

16 గజపతినగరం - శ్రీ  బొత్స అప్పలనరసయ్య

17 నెల్లిమర్ల - శ్రీ బడ్డుకొండ అప్పల నాయుడు

18 విజయనగరం - శ్రీ వీరభద్ర స్వామి కోలగట్ల

19 శృంగవరపుకోట - శ్రీ కడుబండి శ్రీనివాసరావు

20 భీమిలి - శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు

21 విశాఖపట్నం తూర్పు - శ్రీ ఎంవివి సత్యనారాయణ

22 విశాఖపట్నం దక్షిణ - శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ 

23 విశాఖపట్నం ఉత్తరం - శ్రీ కేకే రాజు

24 విశాఖపట్నం పశ్చిమం -  

25 గాజువాక - శ్రీ గుడివాడ అమర్నాథ్

26 చోడవరం - శ్రీ కరణం ధర్మశ్రీ

27 మాడుగుల - శ్రీ బూడి ముత్యాలనాయుడు

28 అరకులోయ - శ్రీ రేగం మత్స్య లింగం

29 పాడేరు - శ్రీ మత్స్యరాస విశ్వేశ్వర రాజు 

30 అనకాపల్లి - శ్రీ మలసాల భారత్ కుమార్ 

31 పెందుర్తి - శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ్

32 ఎలమంచిలి -  ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు

33 పాయకరావుపేట - శ్రీ కంబాల జోగులు

34 నర్సీపట్నం - శ్రీ పెట్ల ఉమా శంకర గణేష్

35 తుని - శ్రీ దాడిశెట్టి రాజా

36 ప్రత్తిపాడు (కాకినాడ) - శ్రీ వరుపుల సుబ్బారావు

37 పిఠాపురం - శ్రీమతి వంగా గీత

38 కాకినాడ రూరల్ - శ్రీ కురసాల కన్నబాబు

39 పెద్దాపురం - శ్రీ దవులూరి దొరబాబు

40 అనపర్తి - శ్రీ సత్తి సూర్యనారాయణ రెడ్డి

41 కాకినాడ సిటీ - శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

42 రామచంద్రపురం-  శ్రీ పిల్లి సూర్యప్రకాష్

43 ముమ్మిడివరం - శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్

44 అమలాపురం - శ్రీ పినిపె విశ్వరూప్

45 రాజోలు - శ్రీ గొల్లపల్లి సూర్యారావు

46 గన్నవరం (కోనసీమ) - శ్రీ విప్పర్తి వేణుగోపాల్

47 కొత్తపేట - శ్రీ చిర్ల జగ్గిరెడ్డి

48 మండపేట - శ్రీ  వి.జోగేశ్వరరావు

49 రాజానగరం - శ్రీ జక్కంపూడి రాజా

50 రాజమండ్రి సిటీ - శ్రీ మార్గాని భరత్

51 రాజమండ్రి రూరల్ - శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణా

52 జగ్గంపేట - శ్రీ తోట నరసింహం

53 రంపచోడవరం - శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి

54 కొవ్వూరు - శ్రీ తలారి వెంకట్రావ్

55 నిడదవోలు - శ్రీ జి. శ్రీనివాస్ నాయుడు

56 ఆచంట - శ్రీ చెరుకువాడ శ్రీరంగనాధ రాజు

57 పాలకొల్లు - శ్రీ గుడాల శ్రీహరి గోపాలరావు

58 నరసాపురం - శ్రీ ముదునూరి ప్రసాద రాజు

59 భీమవరం -  శ్రీ గ్రంధి శ్రీనివాస్

60 ఉండి - శ్రీ పివిఎల్ నరసింహ రాజు

61 తణుకు - శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు

62 తాడేపల్లిగూడెం - శ్రీ కొట్టు సత్యనారాయణ

63 ఉంగుటూరు - శ్రీ పుప్పాల శ్రీనివాసరావు

64 దెందులూరు - శ్రీ అబ్బయ్య చౌదరి కొఠారి

65 ఏలూరు - శ్రీ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్

66 గోపాలపురం - శ్రీ తలారి వెంకట్రావు

67 పోలవరం - శ్రీ తెల్లం బాలరాజు

68 చింతలపూడి - వున్నమట్ల ఎలిజా

69 తిరువూరు - కొక్కిలిగడ్డ రక్షణ నిధి

70 నూజివీడు మేకా - వెంకట ప్రతాప్ అప్పారావు

71 గన్నవరం - శ్రీ వల్లభనేని వంశీ 

72 గుడివాడ - శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు

73 కైకలూరు - శ్రీ దూలం నాగేశ్వరరావు

74 పెడన - శ్రీ ఉప్పల రాము

75 మచిలీపట్నం - శ్రీ పేర్ని కృష్ణమూర్తి

76 అవనిగడ్డ - శ్రీ రమేష్ బాబు సింహాద్రి

77 పామర్రు - శ్రీ అనిల్ కుమార్ కైలే

78 పెనమలూరు - శ్రీ జోగి రమేష్

79 విజయవాడ వెస్ట్ - శ్రీ షేక్ అసిఫ్

80 విజయవాడ సెంట్రల్ - శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ 

81 విజయవాడ తూర్పు - శ్రీ దేవినేని అవినాష్

82 మైలవరం - శ్రీ సర్నాల తిరుపతి రావు

83 నందిగామ - శ్రీ మొండితోక జగన్ మోహన రావు

84 జగ్గయ్యపేట - శ్రీ ఉదయభాను సామినేని

85 పెదకూరపాడు - శ్రీ నంబూరు శంకరరావు

86 తాడికొండ - శ్రీమతి మేకతోటి సుచరిత

87 మంగళగిరి - శ్రీమతి కాండ్రు కమల

88 పొన్నూరు - శ్రీ అంబటి మురళి కృష్ణా

89 వేమూరు - శ్రీ వరుకూటి అశోక్ బాబు

90 రేపల్లె - శ్రీ డా.ఈవూరు గణేష్

91 తెనాలి - శ్రీ అన్నాబత్తుని శివ కుమార్

92 బాపట్ల - శ్రీ కోన రఘుపతి

93 ప్రత్తిపాడు - శ్రీ బాలసాని కిరణ్ కుమార్

94 గుంటూరు వెస్ట్ - శ్రీమతి విడదల రజిని

95 గుంటూరు తూర్పు - శ్రీమతి షాక్ నూరి ఫాతిమా

96 చిలకలూరిపేట - శ్రీ కావటి మనోహర్ నాయుడు

97 నరసరావుపేట - శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి

98 సత్తెనపల్లె - శ్రీ అంబటి రాంబాబు

99 వినుకొండ - శ్రీ బొల్లా బ్రహ్మ నాయుడు

100 గురజాల - శ్రీ కాసు మహేష్ రెడ్డి

101 మాచర్ల - శ్రీ రామకృష్ణా రెడ్డి పిన్నెల్లి

102 యర్రగొండపాలెం - శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్

103 దర్శి - శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్

104 పర్చూరు - శ్రీ యడం బాలాజీ 

105 అద్దంకి - శ్రీ పాణెం హనిమిరెడ్డి

106 చీరాల - శ్రీ ఆమంచి కృష్ణా మోహన్

107 సంతనూతలపాడు - శ్రీ మేరుగు నాగార్జున

108 ఒంగోలు - శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి

109 కందుకూరు - శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్

110 కొండపి - శ్రీ ఆదిమూలపు సురేష్

111 మార్కాపురం - శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి

112 గిద్దలూరు - శ్రీ అన్నా రాంబాబు

113 కనిగిరి - శ్రీ దద్దాల నారాయణ యాదవ్

114 కావలి - శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

115 ఆత్మకూర్ - శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి

116 కోవూరు - శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

117 నెల్లూరు సిటీ - శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్

118 నెల్లూరు రూరల్ - శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

119 సర్వేపల్లి - శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి 

120 గూడూరు -  శ్రీ మేరిగ మురళి

121 సూళ్లూరుపేట - శ్రీ కిలివేటి సంజీవయ్య

122 వెంకటగిరి - శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

123 ఉదయగిరి - శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

124 బద్వేల్ - శ్రీమతి దాసరి సుధ

125 రాజంపేట - శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 

126 కడప - శ్రీ ఎస్.బి అంజద్ బాషా

127 రైల్వే కోడూరు - శ్రీ కొరముట్ల శ్రీనివాసులు

128 రాయచోటి - శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి

129 పులివెందుల - శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి

130 కమలాపురం - శ్రీ పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

131 జమ్మలమడుగు -శ్రీ మూలే సుధీర్ రెడ్డి

132 ప్రొద్దుటూరు - శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

133 మైదుకూరు - శ్రీ రఘురామిరెడ్డి సెట్టిపల్లి

134 ఆళ్లగడ్డ - శ్రీ గంగుల బ్రిజేంద్ర రెడ్డి

135 శ్రీశైలం - శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి

136 నందికొట్కూరు - శ్రీ డా. సుధీర్ దారా 

137 కర్నూలు - శ్రీ ఎం డి ఇంతియాజ్ 

138 పాణ్యం - శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి

139 నంద్యాల - శ్రీ శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి

140 బనగానపల్లె - శ్రీ కాటసాని రామి రెడ్డి

141 డోన్ - శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్

142 పత్తికొండ - శ్రీమతి కంగాటి శ్రీదేవి

143 కోడుమూరు - శ్రీ డా. సతీష్

144 ఎమ్మిగనూరు - శ్రీమతి బుట్టా రేణుక

145 మంత్రాలయం - శ్రీ వై బాలనాగి రెడ్డి

146 ఆదోని - శ్రీ వై.సాయి ప్రసాద్ రెడ్డి

147 ఆలూరు - శ్రీ బూసినే విరుపాక్షి

148 రాయదుర్గం - శ్రీ మెట్టు గోవింద రెడ్డి

149 ఉరవకొండ - శ్రీ వై విశ్వేశ్వర రెడ్డి

150 గుంతకల్లు - శ్రీ వై.వెంకటరామ రెడ్డి

151 తాడిపత్రి - శ్రీ కె. పెద్దా రెడ్డి

152 శింగనమల - శ్రీ ఎం వీరాంజనేయులు

153 అనంతపురం అర్బన్ - శ్రీ అనంత వెంకటరామి రెడ్డి

154 కళ్యాణదుర్గం - శ్రీ తలారి రంగయ్య

155 రాప్తాడు - శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

156 మడకశిర - శ్రీ ఈర లక్కప్ప

157 హిందూపురం - శ్రీమతి టి.ఎన్ దీపిక 

158 పెనుకొండ - శ్రీమతి కె. వి. ఉషశ్రీ చరణ్

159 పుట్టపర్తి - శ్రీ దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి

160 ధర్మవరం - శ్రీ కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి

161 కదిరి - శ్రీ మక్బుల్ అహ్మద్

162 తంబళ్లపల్లె - శ్రీ పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి

163 పీలేరు - శ్రీ చింతల రామచంద్రా రెడ్డి

164 మదనపల్లె - శ్రీ నిస్సార్ అహ్మద్

165 పుంగనూరు - శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

166 చంద్రగిరి - శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

167 తిరుపతి - శ్రీ భూమన అభినయ్ రెడ్డి

168 శ్రీకాళహస్తి - శ్రీ బియ్యపు మధుసూధన్ రెడ్డి

169 సత్యవేడు - శ్రీ నూకతోటి రాజేష్

170 నగరి - శ్రీమతి ఆర్.కె రోజా

171 గంగాధర నెల్లూరు - శ్రీ ఎం రెడ్డెప్ప

172 చిత్తూరు - శ్రీ ఎం విజయానంద రెడ్డి

173 పూతలపట్టు - శ్రీ డా. సునీల్ కుమార్

174 పలమనేరు - శ్రీ ఎన్. వెంకటే గౌడ

175 కుప్పం - శ్రీ కే ఆర్ జే భరత్

Share:

చిలకలూరిపేట - గుంటూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

 చిలకలూరిపేట - గుంటూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

చిలకలూరిపేట - గుంటూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

గుంటూరు - చిలకలూరిపేట నేషనల్ హైవే మధ్యలో ఆటో ప్రైవేటు బస్సుని ఢీకొనడంతో ఆటోలో ఉన్న వ్యక్తితో పాటు డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఈనాడు ఆఫీస్ సమీపంలో రాత్రి ఒంటిగంట సమయంలో విజయవాడ నుండి కడప వెళ్తున్న జగన్ ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సును ఆటో ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఆటోలో డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తి ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఆటోని రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చి బస్సును ఢీకొన్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ఆటోలో ఉన్న వ్యక్తులు మధ్య మధ్యలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆటోలోని వ్యక్తులు కోండ్రుపాడుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన అనంతరం రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో హుటాహుటిన ట్రాఫిక్ పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుని ప్రారంభించారు.

Follow below

Share:

34 మందితో రెండో జాబితా విడుదల చేసిన TDP - అభ్యర్థుల వివరాలు - నరసరావుపేటను పోత్తులో త్యాగం చేస్తారా ?

34 మందితో రెండో జాబితా విడుదల చేసిన TDP - అభ్యర్థుల వివరాలు -  నరసరావుపేటను పోత్తులో త్యాగం చేస్తారా ?

34 మందితో రెండో జాబితా విడుదల చేసిన TDP - అభ్యర్థుల వివరాలు -  నరసరావుపేటను పోత్తులో త్యాగం చేస్తారా ?


34 మందితో టిడిపి రెండో జాబితాను విడుదల చేసింది.

నరసన్నపేట తెదేపా అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి

గాజువాక తెదేపా అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు

చోడవరం తెదేపా అభ్యర్థిగా కె.ఎస్.ఎన్‌.ఎస్‌. రాజు

మాడుగుల తెదేపా అభ్యర్థిగా పైలా ప్రసాద్‌

ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ

రామచంద్రపురం తెదేపా అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్‌

రాజమండ్రి రూరల్ తెదేపా అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రంపచోడవరం తెదేపా అభ్యర్థిగా మిర్యాల శిరిష

కొవ్వూరు తెదేపా అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు

దెందులూరు తెదేపా అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్‌

గోపాలపురం తెదేపా అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు

పెదకూరపాడు తెదేపా అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్‌

గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా పిడురాళ్ల మాధవీ

గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థిగా మహ్మద్‌ నజీర్‌

గురజాల తెదేపా అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు

కందకూరు తెదేపా అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు

మార్కాపురం తెదేపా అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి

గిద్దలూరు తెదేపా అభ్యర్థిగా ముత్తుముళ్ల అశోక్‌ రెడ్డి

ఆత్మకూరు తెదేపా అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి

కోవూరు తెదేపా అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

వెంకటగిరి తెదేపా అభ్యర్థిగా కురుగొండ్ల లక్ష్మిప్రియ

కమలాపురం తెదేపా అభ్యర్థిగా పుత్తా చైతన్యరెడ్డి

ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్థిగా వరదరాజులురెడ్డి

నందికొట్కూరు తెదేపా అభ్యర్థిగా గిత్తా జయసూర్య

కదిరి - కందికుంట యశోదా దేవి

పుట్టపర్తి - పల్లె సింధూరా రెడ్డి

మంత్రాలయం - రాఘవేంద్ర రెడ్డి

ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి

పూతలపట్టు - డాక్టర్ కలికిరి మురళీమోహన్‌

సత్యవేడు - కోనేటి ఆదిమూలం 

శ్రీకాళహస్తి - బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి

చంద్రగిరి - పులివర్తి వెంకట మణి ప్రసాద్‌

పుంగనూరు - చల్లా రామచంద్రారెడ్డి 

మదనపల్లి - షాజహాన్‌ బాషా

పల్నాడులో నరసరావుపేట అభ్యర్థిని తప్ప మిగతా అభ్యర్థులందరిని ప్రకటించిన టిడిపి. ఇప్పటికే అరవింద బాబు పై పలు ‌సర్వేలు నిర్వహించినప్పటికీ ఇంకా టికెట్ ఖరారు కాలేదు. గతంలో 2014 ఎన్నికల సమయంలో నరసరావుపేట టికెట్ బిజెపికి అప్పగించిన సంగతి తెలిసిందే. మళ్లీ 2024 లో రిపీట్ అవుతుందేమో చూడాలి.


Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

ఈ చిలకలూరిపేట సభ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అతిపెద్ద భారీ సభ అవుతుంది - ప్రతిపాటి, సభ ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న అచ్చన్న, నారా లోకేష్

ఈ చిలకలూరిపేట సభ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అతిపెద్ద భారీ సభ అవుతుంది - ప్రతిపాటి, సభ ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న అచ్చన్న, నారా లోకేష్

ఈ చిలకలూరిపేట సభ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అతిపెద్ద భారీ సభ అవుతుంది - ప్రతిపాటి, సభ ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న అచ్చన్న, నారా లోకేష్


చిలకలూరిపేట :- టిడిపి జనసేన బిజెపి ఆధ్వర్యంలో 17వ తారీకు అనగా ఆదివారం నాడు నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నిన్నటి నుండి పనులని చకచగా కార్యరూపం దాల్చడంతో సభ నిర్వహించేందుకు నేడు భూమి పూజ నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చం నాయుడు, బిజెపి పార్టీ నుండి నాగభూషణం, జనసేన పార్టీ నుండి గాదె వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ చిలకలూరిపేట తోట రాజా రమేష్ మరియు టిడిపి, జనసేన ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ నెల 17న జరగబోయే చిలకలూరిపేట సభతో చరిత్ర సృష్టిస్తామన్నారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఈ సభ వైపు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందన్నారు. ఎన్డీఏలో చేరిన తర్వాత తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఆధ్వర్యంలో జరగబోతున్న తొలి ఉమ్మడి మేనిఫెస్టో సభ నభూతో నభవిష్యతీ అన్నట్టుగా ఉంటుందన్నారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకే తెలుగుదేశం తిరిగి ఎన్డీఏలో భాగస్వామ్యమైందని అభిప్రాయపడ్డారు. మూడు పార్టీలు కూటమిగా పోటీ చేయడం రాష్ట్రాభివృద్ధికి కొత్తబాటలు వేస్తాయన్నారు. కేంద్ర సహకారం లేనిదే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని... రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలంటే తెలుగుదేశం-జనసేన-బీజేపీ పార్టీలు కలవాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించారని వివరించారు. ఈ నెల 17న జరిగే ఉమ్మడి మేనిఫెస్టో సభకు బొప్పూడి వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భూమిపూజ చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, తెలుగుదేశం, జనసేన, బీజేపి ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం పుల్లారావుతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో లోకేష్‌ ప్రత్యేకంగా భేటీ అయి ఏర్పాట్లపై చర్చించారు. లక్షలాదిగా ప్రజలు రానున్న సందర్భంగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. సభా ప్రాంగణం వద్ద ప్రారంభమైన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భాజపాతో పొత్తు కుదిరిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు సుమారు 15లక్షల మంది జనసమీకరణకు ప్రణాళికలు రచించారు. పైగా ప్రధాని మోదీ పాల్గొంటున్న తొలి సభ చిలకలూరిపేట కావటంతో ప్రత్తిపాటి పుల్లారావుపై బాధ్యతలు పెరిగాయని లోకేష్‌ వ్యాఖ్యానించారు. లోకేష్‌తో భేటీ తర్వాత పుల్లారావు మీడియాలో మాట్లాడుతూ 17న జరిగే సభతోనే జగన్‌ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతుందని, తర్వాత ఈ అరాచక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో కూల్చివేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీటింగ్‌లో 175 నియోజకవర్గాల నుంచి మూడు పార్టీల శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనబోతున్నారని వెల్లడించారు. లక్షలాది మందితో జరిగే ఈ సభ దేశంలోనే అతిపెద్ద బహిరంగ సభ కాబోతుందన్నారు. దేశానికి మోదీ ఒక దశ దిశ అయితే.. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేదానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ దశ దిశ అన్నారు. ఈ బహిరంగ సభ వేదికగా దేశానికి ఒక సందేశం ఇవ్వబోతున్నారని వివరించారు. దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపడానికి, ప్రజలను కష్టాల నుంచి బయటపడటానికి, రైతులు సంతోషం, ఆడబిడ్డలు క్షేమం, యువతకు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ బహిరంగ సభ దిక్సూచిలా ఉంటుందని తెలిపారు.


Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

చిలకలూరిపేటలో ఉద్రిక్తత - వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట - డౌన్ డౌన్ రజిని అంటూ పట్టణ వీధుల్లో ర్యాలీని నిర్వహించిన వైసీపీ శ్రేణులు

చిలకలూరిపేటలో ఉద్రిక్తత - వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట - డౌన్ డౌన్ రజిని అంటూ పట్టణ వీధుల్లో ర్యాలీని నిర్వహించిన వైసీపీ శ్రేణులు

చిలకలూరిపేటలో ఉద్రిక్తత - వైసీపీ కార్యకర్తలు టిడిపి పోలీసుల మధ్య తోపులాట - డౌన్ డౌన్ రజిని అంటూ పట్టణ వీధుల్లో ర్యాలీని నిర్వహించిన వైసీపీ శ్రేణులు

చిలకలూరిపేట పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. కావటి మనోహర్ నాయుడును చిలకలూరిపేట ysrcp అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడంతో పట్టణంలోని వైసీపీ శ్రేణులు స్థానికేతరులకు టికెట్ ఇవ్వటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానికేతులలోకి టికెట్ ఇవ్వటంపై నిరసనగా ఈరోజు మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీస్ వారు కార్యకర్తలను అడ్డుకోవడంతో వారి మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఒకానొక సమయంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి లాఠీచార్జ్ జరిగే పరిస్థితి వచ్చింది. కానీ పోలీసు వారు సమయం పాటించి పరిస్థితిని అదుపులోకి తీసుకొని. చిలకలూరిపేట లో ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి కారణం మంత్రి విడుదల రజిని అని కార్యకర్తలు వాపోతున్నారు. స్థానికేతరులకు టికెట్ ఇవ్వటం వలన పార్టీ పట్టును కోల్పోతుందని ఆ విధంగా వ్యక్తం చేశారు. డౌన్ డౌన్ విడదల రజిని అంటూ పట్టణ వీధుల్లో వైసిపి కార్యకర్తలు బైక్ ర్యాలీని నిర్వహించారు. తమ చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తులకు అసెంబ్లీ టికెట్ ఇప్పించాలని ఉద్దేశంతో మంత్రి రజిని ఉన్నారని కార్యకర్తలు తెలియజేశారు.

Follow 


Share:

నరసరావుపేటలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్

నరసరావుపేటలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్

నరసరావుపేటలో టిడిపి, వైఎస్ఆర్సిపి కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్

నరసరావుపేట :- 2024 ఎలక్షన్ పల్నాడు జిల్లాలో చాలా రసవంతంగా జరిగేలా ఉన్నాయి. పొద్దున వరకు హాట్ టాపిక్ గా నిలిచిన చిలకలూరిపేట రాజకీయం, ఉన్నట్టుండి ఒక్కసారిగా నరసరావుపేటలో కూడా రాజకీయాలు వేడెక్కాయి.

వివరాల్లోకి వెళితే నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు పార్టీ కార్యక్రమంలో భాగంగా ఐదో వార్డ్ క్రిస్టియన్ పాలెం లో ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఒకరినొకరు బాహబాహీ కి దిగారు. అది కాస్త ముదిరి సీసాలు రాళ్లతో దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనల్లో టిడిపి కార్యకర్తలకు గాయాలు అవ్వగా వారిని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ఈ ఘటనకు నిరసనగా టిడిపి శ్రేణులు భారీ ఎత్తున గడియార స్తంభం సెంటర్ వద్ద భారీ ర్యాలీని చేపట్టారు. దీంతో నరసరావుపేటలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


Follow this link:

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp



Share:

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు

 చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు


చిలకలూరిపేట :- చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడుని ప్రకటించిన వైసీపీ అధిష్టానం. ఇవాళ ఉదయం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో గందరగోళం నెలకొన్నది. పార్టీలోని ముఖ్య నేతలు అంతా చర్చించుకుని లోకల్ లో బలమైన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్టానాన్ని కోరారు. అయినప్పటికీ గుంటూరు మేయర్ గా పనిచేస్తున్నటువంటి కావటి మనోహర్ నాయుడుని చిలకలూరిపేట అభ్యర్థిగా ఖరారు చేశారు. స్థానిక వ్యక్తులను కాకుండా బయట వారికి అవకాశం ఇస్తే 30 మంది వైసిపి కౌన్సిలర్లు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. 
మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే మనోహర్ నాయుడు గుంటూరులోనే ఉన్న విడదల రజిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.


Follow 


Share:

చిలకలూరిపేట :- మల్లెల రాజేష్ టికెట్ విషయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిరసన తెలిపిన వైసీపీ కార్యకర్తలు

చిలకలూరిపేట :- మల్లెల రాజేష్ టికెట్ విషయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిరసన తెలిపిన వైసీపీ కార్యకర్తలు

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp


చిలకలూరిపేట :- పట్టణంలోని బ్యాంకు కాలనీ నందు ఉన్న వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా మల్లెల రాజేష్ నాయుడు అసెంబ్లీ రేసు నుంచి తప్పిస్తున్నారు అన్న పరిణామాలకు మనస్థాపానికి గురైన ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని నిరసనను తెలియజేశారు. రాజేష్ నాయుడు కి టికెట్ ఇవ్వకపోతే తాము పెట్రోల్ పోసుకొని ఆత్మహతికి పాల్పడతామని వారు తెలిపారు. మల్లెల రాజేష్ మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమయమనం పాటించాలని ఇలాంటి అవాంతర ఘటనకు పాల్పడవద్దని టికెట్టు తనకు దక్కిన దక్కకపోయినా చిలకలూరిపేట నుంచి ఎవరు నుంచున్న కూడా కార్యకర్తలందరూ వైసిపి గెలుపుకి పనిచేయాలని ఆయన తెలిపారు.


Follow 

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

దమ్ముంటే విడదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు

దమ్ముంటే విడదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు

దమ్ముంటే విడుదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు

చిలకలూరిపేట :- నియోజకవర్గంలోని రాజకీయం వేడెక్కింది. మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ నందు ఆయన తన ఆవేదనను వెలగక్కారు. 2019 నుండి పార్టీకి కొమ్ము కాసి పనిచేస్తున్న వైసిపి కుటుంబ సభ్యులను అన్యాయం చేస్తున్నారని.. నాడు మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానంటే తాము అందరం కష్టపడి పని చేశామని. పార్టీ గెలిచిన తర్వాత మంత్రి రజిని వల్ల మర్రి రాజశేఖర్ కు మొండి చేయి మిగిలిందని. కార్యకర్తలందరం వరుసలు పెట్టి పిలుచుకునేంత సన్నిహితంగా ఉంటామని కానీ ఈరోజు ఎక్కడో గుంటూరు విజయవాడ నుండి వ్యక్తులను తీసుకొచ్చి చిలకలూరిపేట నియోజకవర్గంలో నిలబెడతామంటే తాము ఒప్పుకోమని ఆయన తెలిపారు. పార్టీ నాకు కాకపోయినా చిలకలూరిపేటలో ఉండే బలమైన వ్యక్తికి టికెట్ ఇస్తే తాము అందరం కలిసి గెలిచి చూపిస్తామని ఆయన తెలిపారు. మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే తన తరఫునుంచి 20 కోట్ల రూపాయలు పార్టీకి ఖర్చు పెడతానని ఆయన తెలియజేశారు. కాబట్టి మనోహర్ నాయుడు గుంటూరు నుండి దమ్ముంటే విడుదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేసి గెలవాలని ఆయన సవాలు విసిరారు. తనకు రజిని వద్ద నుండి 6 కోట్ల రూపాయలు డబ్బు రావాల్సి ఉంటే దాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి తో మాట్లాడితే డబ్బులు ఇస్తుందో ఇవ్వదో వదిలేసేయ్ అని అన్నారని వాపోయారు.

Follow

Share:

చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం

చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం

చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం

చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి పార్టీలో రోజుకు కొత్త రంగు పులుముకుంటుంది. ఇప్పటికే చిలకలూరిపేట సమన్వయకర్తగా ఉన్నటువంటి మల్లెల రాజేష్ నాయుడు పోటీపై భిన్నభిప్రాయాలు చర్చిలు జరుగుతూ ఉండటం దీనికి కారణం. సమన్వయకర్తగా రాజేష్ నాయుడు పేరు ప్రకటించినప్పటి నుండి కూడా వారానికి 10 రోజులకు ఒకసారి పోటీ చేసే వ్యక్తిపై భిన్నభిప్రాయాలు వ్యక్తం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పుకార్లను షికారులుగా చేసేది ప్రత్యథి పార్టీ అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదేమో... సొంత పార్టీలోని నేతలు, క్యాడర్ పోటీ చేసే వ్యక్తి మారుతారని మొదటి నుంచి ప్రచారం చేయడంతో 2019 ఎలక్షన్ తర్వాత బలంగా ఉన్న క్యాడర్ ఏ వర్గం వైపు ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. తాజాగా నేడు వైయస్ఆర్సీపీ 14 ఆవిర్భావ వేడుకలలో సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు వ్యాఖ్యలు చర్చనీయాంసంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "కొత్తవారు వస్తుంటారు పోతుంటారు, నేను లోకల్ గెలిచినా ఓడినా నేను మీతోనే ఉంటాను" అని ఎలాగైనా సరే వైసిపి తరఫున తాను పోటీ చేసి తీరుతానని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో టికెట్ ఖరారు పై ఇంకా స్పష్టత రాలేదని పోటీ చేసే అభ్యర్థిని మారుస్తున్నారని ఉదయం నుంచి ఈ వార్త ధారాళంగా పట్టణ ప్రధాన సెంటర్లలో మారుమోగుతుంది. కొన్ని రోజుల క్రితం అంబటి రాంబాబు తీసుకువస్తారని ఇప్పుడు తాజాగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు నీ చిలకలూరిపేట వైపు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని బోగొట్ట. ఏది ఏమైనా ఈ పరిణామాలతో వైసిపి కేడర్ గందరగోళం లో పడిందని చర్చించుకుంటున్నారు. మర్రి రాజశేఖర్, జాన్ సైదా, మల్లెల రాజేష్ నాయుడు కొంతమంది బలమైన లీడర్స్ ఉండగా బయట నుండి వ్యక్తులను తీసుకురావడం సబబేనా అని పార్టీలోని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.


Follow this link to join my WhatsApp group:

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

ఈశ్వర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ హత్యని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి, అసలు హత్యకు దారి తీసిన కారణం ఇదేనా ?

ఈశ్వర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ హత్యని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి, అసలు హత్యకు దారి తీసిన కారణం ఇదేనా ?

ఈశ్వర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ హత్యని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి, అసలు హత్యకు కారణం ఇదేనా ?


మేనల్లుడే కాలయముడయ్యాడు. వ్యక్తిగత కక్షతో సొంత మామను కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. మాజీ ప్రిన్సిపాల్‌ మూర్తిరావు హత్య కేసు.. అనంతను ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈలోపు మరో విషాదం చోటు చేసుకుంది. భర్త మృతి తట్టుకోలేక.. ఆయన భార్య శోభ సైతం గుండెపోటుతో కన్నుమూశారు.

పోలీసులు తెలిపిన సమాచారం మేరకు… అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్‌టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ పనిచేశారు. ఐదారు నెలలుగా కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు.

భార్య కళ్లెదుటే దారుణం..

జేఎన్‌టీయూ ప్రధాన ద్వారం ఎదురుగా మూర్తిరావుకు షాపింగ్‌ కాంప్లెక్స్‌తో పాటు సొంతిల్లు ఉంది. అన్నింటినీ అద్దెకు ఇచ్చేసి నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబసభ్యులతో కలసి ఉంటున్నారు. ఈ క్రమంలో తన ఇంట్లో నివాసముంటున్న మణికంఠ ఇల్లు ఖాళీ చేసి ఆదివారం మూర్తిరావుకు ఫోన్‌ చేశాడు. వచ్చి ఇంటిని పరిశీలించుకుని తాళం తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో తన భార్య శోభాతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు.

అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు (58) గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా… నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు.

హతుడి పక్కనే కూర్చొని..

మూర్తిరావును హతమార్చిన అనంతరం నేరుగా ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్‌కు ఆదిత్య వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, నేరుగా మూర్తిరావు మృతదేహం వద్దకు చేరుకుని పక్కనే కూర్చొని ఉండిపోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్‌లర్‌లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌లైన్‌ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.

వివాదరహితుడు

మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్‌టీయూఏలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బీటెక్‌, ఎంటెక్‌ పూర్తి చేసి పీహెచ్‌డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్‌ ఇంజినీరింగ్‌లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్‌టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ… శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్‌లో బ్యాంక్‌ ఉద్యోగిగా స్థిరపడ్డారు.


Follow this link to join my WhatsApp group:

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య

ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య


ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య


చిలకలూరిపేట - నరసరావుపేట మధ్య ఉన్న ఏకైక ఇంజనీరింగ్ కళాశాల ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల. గతంలో ఈశ్వర్ కాలేజీ నందు ప్రిన్సిపల్ గా పనిచేసిన మూర్తి రావు గోకలే దారుణ హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే కొన్ని సంవత్సరాల క్రితం ఈశ్వర్ కాలేజ్ లో ప్రిన్సిపాల్ గా పనిచేసిన మూర్తి రావు గోకలే ప్రస్తుతానికి జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం నాడు అనంతపురం జేఎన్టీయూ ముఖ ద్వారం వద్ద కాలేజీకి సంబంధించిన విద్యార్థులే బ్లేడుతో గొంతు కోసి దారుణ హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రిన్సిపల్ డెడ్ బాడీని చూసి సమీపంలోనే ఉన్న వారంతా షాక్ కు అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఈశ్వర్ కాలేజ్ పూర్వ విద్యార్థులు ప్రిన్సిపాల్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కింది లింకుపై క్లిక్ చేయండి

Share:

చిలకలూరిపేట - కరెంట్ షాక్ తో బాలుడు మృతి

చిలకలూరిపేట - కరెంట్ షాక్ తో బాలుడు మృతి

చిలకలూరిపేట - కరెంట్ షాక్ తో బాలుడు మృతి

చిలకలూరిపేట :- డైక్మెన్ కాలనీకి చెందిన భవాని అనే బాలుడు మృతి చెందిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే మార్టూరు సీతయ్య కుమారుడు భవాని (11) వేద స్కూల్ నందు నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంటి సమీపము నందు కరెంట్ ఆఫీస్ రోడ్డు లో నిర్మాణంలో ఉన్న ఇంటి డాబాపై ఆడుకుంటుండగా పక్కనే ఉన్న కరెంటు లైన్ వైర్లు తగిలి విద్యుత్ ఖాతానికి గురయ్యాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన గాయపడ్డ భవానీని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ఆసుపత్రి సిబ్బంది కాలిన గాయాలు ఎక్కువగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సిఫారసు చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తెల్లవారుజామున మృతి మృతి చెందాడు. ఈ ఘటనతో కాలనీవాసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అధికారులు కరెంటు వైర్లకు ప్లాస్టిక్ పైపులు వేసి తగిన చర్యలు తీసుకుంటే నిండు ప్రాణం బలి అయ్యి ఉండేది కాదని వారి ఆవేదన వ్యక్తం చేశారు.


Follow this link to join my WhatsApp group:



Share:

మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆదాయం ఎంతంటే ?

మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆదాయం ఎంతంటే ?

మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆదాయం ఎంతంటే ?


పల్నాడు జిల్లా :-  గడిచిన మహాశివరాత్రి రోజున లక్షలాదిమంది భక్తులు కోటప్పకొండకు చేరుకొని ఆ త్రికోటేశ్వరునికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రి రోజున తెల్లవారుజాము నుండి భక్తులు మూలవిరాట్ దర్శనానికై కిలోమీటర్ల మేర బారులు తిరిగి దర్శనం చేసుకున్నారు. అలాగే కోటప్పకొండకు కాలినడకన వెళ్లిన భక్తులకు ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉంటాయని ప్రతిదీ. చాలామంది భక్తులు జనసంద్రోహాన్ని దాటుకొని ఆ దక్షిణామూర్తి దర్శనాన్ని చేసుకోలేని వారు కూడా ఉన్నారు. అయినా కూడా శివరాత్రి రోజున 1కోటి 63 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి జి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వచ్చిన హుండీ ఆదాయాన్ని శనివారం నాడు లెక్కించినట్లు ఆయన తెలిపారు. ప్రసాదాల ద్వారా 3,592,950రూ||, పూజా సామాగ్రి అమ్మడం ద్వారా 5,499,638 రూ||, మిగిలిన 7,255,639రూ|| హూండీల ద్వారా వచ్చినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలను వేగంగా పొందడం కోసం క్రింది లింకు పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g


Share:

చిలకలూరిపేటకు ప్రధాని నరేంద్ర మోడీ ! ఎప్పుడు వస్తున్నారు అంటే ?

చిలకలూరిపేటకు ప్రధాని నరేంద్ర మోడీ ! ఎప్పుడు వస్తున్నారు అంటే ?

చిలకలూరిపేటకు ప్రధాని నరేంద్ర మోడీ ! ఎప్పుడు వస్తున్నారు అంటే ?


చిలకలూరిపేట :- ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజుకొక మలుపులు తీసుకుంటుంది. ఇప్పటికే పార్టీలలో ముఖ్య నేతలు తమకు సీటు దక్కపోవటంతో మరో పార్టీలోకి జంపింగ్లు జరిగిపోయాయి. మరికొందరు టిడిపి - జనసేన - బిజెపి పొత్తు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏ పార్టీలో టికెట్ దక్కకపోతే బిజెపి  పోటీ చేసి గెలవాలని ఉద్దేశంతో వారు ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పొత్తు ఉంటుందని తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు బిజెపితో పొత్తు ఫిక్సయినట్లు టిడిపి ముఖ్య నేతలకు సమాచారం అందించారు దానితోపాటు ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తున్నట్లు టిడిపి నేతలకు చంద్రబాబు తెలియజేశారు. చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది కార్యకర్తలు, అభిమానులు వస్తారని అందుకోసం అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
ఈనెల 17న చిలకలూరిపేటలో జరగబోయే అతిపెద్ద భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. బిజెపి జనసేనకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీక్రెట్ కేటాయించినట్లు. టిడిపికి 145 ఎమ్మెల్యే, 17 ఎంపీ పోత్తులో భాగంగా టిడిపికి దక్కినట్లు తెలుస్తుంది.
Share:

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం


చిలకలూరిపేట :- నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు నేషనల్ హైవే పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే భద్రాచలానికి చెందిన ఒక క్యాటరింగ్ బృందం కోటప్పకొండ తిరునాళ్ళకి వచ్చి తిరుగు ప్రయాణం అవుతుండగా ఎడ్లపాడు సమీపంలో నేషనల్ హైవే డివైడర్ కు తగిలి బొలెరో బోల్తా పడింది. దీంతో వాహనం వెనుక తలుపులు తెరుచుకొని వాహనంలో ప్రయాణిస్తున్న బుజ్జి అనే మహిళ రోడ్డు మీద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మిగిలిన ముగ్గురు(తులసి, లక్ష్మి, చిన్నమ్మాయి) మహిళలు పాటుగా ఉన్న డ్రైవరు, క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్ర మత్తు కారణం వల్ల ఘటన జరిగి ఉండవచ్చునని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన అక్కడికి చేరుకున్న అంబులెన్స్ గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp:

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.