ప్రజా ప్రతినిధిగా నిలబెట్టిన లోకేష్ చంద్రబాబుకి ధన్యవాదాలు అంటూ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన కేశినేని శ్వేత
విజయవాడ :- గత కొంతకాలంగా విజయవాడ రాజకీయాల్లో చర్చినియాంసమైన కేశినేని బ్రదర్స్ వార్ లో భాగంగా ఈరోజు కేశినేని శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏమీ తెలియని తనను ప్రజా ప్రతినిధిని చేసి విజయవాడ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అంటూ, తన వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తన తండ్రికి జరిగిన అవమాన దృశ్యం గౌరవం లేని చోట పనిచేయలేమని ఆమె తెలిపారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో రాజకీయాలకు వచ్చినట్లు ఆమె తెలిపారు. అలాగే విజయవాడ మరియు 11వ డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని అభిమానులు డైలమాలో పడ్డారు. నిన్న జరిగిన రా కదలిరా అనే చంద్రబాబు బహిరంగ సభకు కేశినేని చిన్ని అధ్యక్షత వహించటంతో కేశినేని నాని అభిమానులు అసహనానికి గురైనట్లు నాని వర్గీయులు తెలియజేశారు.