సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు
చిలకలూరిపేటలో శుక్రవారం నాడు మాస్క్ లేని వారి పైనా అపరాధ రుసుము వసూళ్లు
చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు
చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు
రంజాన్ నెల ప్రారంభమైన సంగతి అందరికి తెలిసినదే. అయితే కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అందరూ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. రంజాన్ మాసం లో ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష పాటిస్తారు కావున వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే సందేహంలో ఉంటున్నారు. ఈ సందేహాలకు తెర దించుతూ ముస్లిం మత పెద్దలు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. వ్యాక్సిన్ పొట్టలోకి కాకుండా రక్తనాళాల్లో కి వెళ్తుంది కాబట్టి ఉపవాస దీక్ష భగ్నం కాదని నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. అందువలన మన పేట మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదరులకు ఈ విషయాన్ని చేరవేయండి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందువలన ప్రార్ధనలో పాల్గొనే ముందు మాస్క్ ధరించి, శానిటైజర్ వాడండి.
చిలకలూరిపేటలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లిన కారు
చిలకలూరిపేటలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లిన కారు
పట్టణంలో ఎన్ ఆర్ టి సెంటర్ నందు శుక్రవారం ఉదయం కారు అదుపుతప్పి రోడ్ పక్కనే వున్నా దుకాణం లోకివెళ్ళింది. వివరాలలోకి వెళ్తే పెదనందిపాడు మండలం అన్నారం గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా నరసరావుపేట వైపు నుండి వస్తూ ఎన్ ఆర్ టి సెంటర్ నందు రోడ్డు దాటుతున్న క్రమంలో ఒంగోలు వైపుగా వెళ్తున్న ఒక లారీ ఢీ కొనటంతో కారు అదుపుతప్పి సెంటర్ లోని రోడ్డు పక్కనే ఉన్న స్వాతి బిర్యాని పాయింట్ లోకి దూసుకువెళ్లింది. ఉదయం కావటంతో ఆ సమయంలో షాప్ తెరిచిలేదు కనుక ఆ సమయంలో ఎవరు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తపింది. కారు ఒక వైపు దెబ్బతిన్నది.
నిన్న ఆ ప్రదేశానికి 10 అడుగుల దూరంలో మధ్యాహ్నం సమయంలో బైక్కు మంటలు చెలరేగాయి . ఈ రోజు కారు ప్రమాదం జరిగింది అని స్థానికులు చెప్తున్నారు.
చిలకలూరిపేటలోని టిడ్కొ ఇళ్లలో 200 పడకలతో కరోనా కేర్ సెంటర్కు రంగం సిద్ధం
చిలకలూరిపేటలోని టిడ్కొ ఇళ్లలో 200 పడకలతో కరోనా కేర్ సెంటర్కు రంగం సిద్ధం
కరోనా కేసులు మళ్ళి పెరుగుతున్న క్రమంలో ఎమర్జెన్సీ సర్వీస్ కొరకు 200 పడకలతో కరోనా కేర్ సెంటర్ను మళ్ళి ప్రారంభించబోతున్నారు. పట్టణంలో ఉన్న హాస్పిటల్స్లో బెడ్లు తక్కువ ఉనందువలన ఎమర్జెన్సీ సర్వీస్ కొరకు పేటలోని టిడ్కొ ఇళ్లను కరోనా కేర్ సెంటర్లుగా మార్చనికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 200 పడకలను తరలించి ఆప్రాంతాన్ని శానిటేషన్ చేపిస్తున్నారు అధికారులు.