శ్యామ్యూల్ ఆనంద్ |
గుంటూరు జిల్లా లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ గారు " శనివారం నుండి జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరచి ఉంచాలి అని " హెచ్చరించారు . 11 గంటల తరవాత ఎవరైనా వ్యాపారాలు కొనసాగితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ వారికీ ఆదేశాలు జారీ చేసారు . ఇప్పటికే పిడుగురాళ్ల , నరసరావుపేట పట్టణాలలో ఫుల్ లొక్డౌన్ అమలులో వుంది .