చిలకలూరిపేట - లాడ్జి గదిలో అస్థిపంజరం - షాక్ లో లాడ్జి నిర్వాహకుడు
చిలకలూరిపేట పట్టణంలోని ఎన్.ఆర్.టి సెంటర్ నందు శ్రీనివాస లాడ్జి నందు ఆస్థి పంజరం కలకలం సృష్టించింది. లాడ్జి మరమ్మతుల కొరకు నిర్వాహకులు పరిశీలించగా 3వ అంతస్థులో
ఒక గది లోపల లాక్ చేసి ఉండటాన్ని గమనించారు. అయితే సదరు మేస్త్రి తలుపులు పగలోగొట్టగా గది లోపల మరుగుదొడ్డి నందు కూడా లాక్ చేసి ఉంది. దాని తలుపులు కూడా పగలగొట్టగా లోపల అస్థిపంజరం టవల్ తో వేలాడుతూ కనపడి ఉంది. దీనితో షాక్ కి గురి అయిన సదరు నిర్వాహకుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అస్థిపంజరానికి T - షర్ట్ ఉండటంతో పురుషుడిగా నిర్ధారించారు. కరోనా లాక్ డౌన్ వలన రూమ్ తక్కువగా వినియోగిస్తున్నాం అని అందువలన గుర్తించలేకపొయ్యాం అని నిర్వాహకులు తెలిపారు.