చిలకలూరిపేట - ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం గారు
చిలకలూరిపేట - నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారు పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సదుపాయాలు, మౌళిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా హాస్పిటల్ సదుపాయాలకు అందరూ సహకరించటం చాలా ఆనందకరమైన విషయం అని, ప్రైవేట్ వైద్య శాలలకు ఏ మాత్రం తీసిపోకుండా ఇక్కడ ప్రభుత్వ వైద్యం అందుతుంది అని, MP, MLA పిలుపు మేరకు ధాతల అందించిన సహకారం శుభపరిణామం అని తెలిపారు. అలాగే మౌళిక సదుపాయాలు, 4 లక్షల విలువైన మందులను అందించిన నాయుడు రమేష్ గారికి, ఆక్సిజన్ సిలిండర్ అందించిన బైరా కుటుంబ సభ్యులకు, 4 లక్షల విలువైన మాస్కలు, శానిటైజెర్లు ఇతర వైద్య సదుపాయాలకు అవసరం అయిన వాటిని అందించిన అసిస్ట్ సంస్థకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. అలాగే MLA గారి పర్యటించి ఇక్కడ రోగులకు ఉచిత భోజన సదుపాయాన్నిఎర్పాటు చేస్తాం అని చెప్పటం చాల ఆనందంగా ఉంది అని, అలాగే డాక్టర్ భవాని గారి ఆధ్వర్యంలో ఇక్కడ పని చేసే స్టాఫ్ డాక్టర్స్, నర్సులు, సిబ్బందికి అభినందించారు.
హాస్పిటల్ నందు శానిటైజ్ సిబ్బందిని ఎర్పాటు చెయ్యాలి అని, అలాగే RK హాస్పిటల్ నందు ఆక్సిజన్ వార్డులో పని చేసే సిబ్బందిని అక్కడ కరోనా ట్రీట్మెంట్ అనుమతులు నిలిచిపోవటం వలన వారిని ఎక్కడికి తీసుకువచ్చి ఆక్సిజన్ సప్లై ఇబ్బందులు లేకుండా చెయ్యాలి అని, పట్టణం నుండి NH 16 జాతీయ రహదారి కారణంగా ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల యాక్సిడెంట్ కేసులు ఇక్కడికే వస్తుంటాయి కావున ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిలో శవాగారం ఎర్పాటు చేస్తున్నారు. కానీ అత్యవసరం కొరకు కొన్ని ఐస్ బాక్ససులు ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు. ఈ సందర్భంగా నవతరం పార్టీ నాయకులూ పాల్గొన్నారు
డాక్టర్ భావాని గారు మాట్లాడుతూ మేము డాక్టర్ వృత్తిని ఎన్నికొని ఇక్కడ పని చెయ్యటం అందరికి సేవ చెయ్యటం దేవుడు మాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం అని, సిబ్బంది కరోనా లెక్క చెయ్యకుండా వారికీ సేవలు అందిస్తున్నరు అని తెలిపారు