మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp
Showing posts with label గుంటూరు జిల్లా. Show all posts
Showing posts with label గుంటూరు జిల్లా. Show all posts

చిలకలూరిపేట - జాబ్ క్యాలెండర్ వ్యతిరేకంగా మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన బీజేపీ జిల్లా జనరల్ సెకరేటరీ పులుగుజ్జు మహేష్ ముందస్తు అరెస్ట్

 చిలకలూరిపేట - జాబ్ క్యాలెండర్ వ్యతిరేకంగా మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన బీజేపీ జిల్లా జనరల్ సెకరేటరీ పులుగుజ్జు మహేష్ ముందస్తు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట -  రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండరు కు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు కేతినేని సురేంద్ర మోహన్ ఆదేశానుసారం రాష్ట్రంలోని మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి పులుపునిచ్చారు. అయితే మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన జిల్లా జనరల్ సేకరేటరీ పులుగుజ్జు మహేష్ తో పాటుగా, చిలకలూరిపేట టౌన్ ప్రెసిడెంట్ నందిగం రాజుని చిలకలూరిపేట పోలీస్ వారు ఆదివారం రాత్రి సమయంలో వారి ఇంటి వద్ద అరెస్ట్ చేసి నిర్బంధించారు. పులుగుజ్జు మహేష్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండరును రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్లో 2,40,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చెయ్యాలి అని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోయాయి ఇంకొకరిపైనా ఆధారపడి జీవిస్తున్నారు అని, జగన్ ప్రభుత్వం నిరుద్యోగుల యువకులలో విశ్వసనీయత కోల్పోతుంది అని తెలిపారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/


https://chilakaluripetspeednews.blogspot.com/























Share:

జాబ్ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులని మోసం చేసారు - బీజేపీ ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్

జాబ్ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులని మోసం చేసారు -  బీజేపీ ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

2021-2022 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం మొత్తం 10,143 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండరు పేరుతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ చూసిన నిరుద్యోగుల యువత తీవ్ర అసహనానికి గురి అయ్యారు. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్ ను నిరసిస్తూ బీజేపీ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సురేంద్రమోహన్ గారి ఆదేశాలతో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ నందు నిరసన దీక్ష చేపట్టారు. తక్షణమే ఈ జాబ్ క్యాలెండరు రద్దు చేస్తూ త్వరలో నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగా ఖాళీగా ఉన్న 2,40,000 ఉద్యోగాల భర్తీ చేసే విధంగా కొత్త జాబ్ క్యాలెండరు రిలీజ్ చెయ్యాలి అని నరసరావుపేట ఆర్టీఓ ఆఫీస్ నందు ఆర్టీఓ గారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్, జిల్లా నాయకులు నెమలికంటి బ్రహ్మం, వంశీ ,మురళి,నరేష్,జిల్లా ఉపాధ్యక్షుడు కాళ్ళ కోటేశ్వరావు, కామినేని హనుమంతురావు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/






























Share:

గుంటూరు జిల్లా - యుద్ధనికి అంతా సిద్ధం - కరోనా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదురుకుంటాం - డియంహెచ్ఓ

గుంటూరు జిల్లా - యుద్ధనికి అంతా సిద్ధం - కరోనా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదురుకుంటాం - డియంహెచ్ఓ 

https://chilakaluripetspeednews.blogspot.com/


కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రంగం అంతా సిద్ధంగా ఉన్నారు అని డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆర్గనైజషన్ అధికారి యాస్మిన్ తెలిపారు. థర్డ్ వేవ్ వస్తుంది అని ఎవరు భయపడవద్దు. ఈ లోపు చాల వరకు వ్యాక్సిన్ పూర్తి చేసేస్తాం. చాలా వరకు కంట్రోల్ అవుతుంది.వ్యాక్సిన్ తీసుకోవటం వలన కరోనా నుండి సేఫ్ గా బయటపడవచ్చు. థర్డ్ వేవ్ కు 186 ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయి. అందులో 35 ఆసుపత్రులు చిన్నపిల్లల కోసం సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని సామాజిక ఆరోగ్యకేంద్రాలలో 10 పడకలకు ఆక్సిజన్ సప్లై ఉన్నాయి అని ఆమె తెలిపారు. 







































Share:

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత 

https://chilakaluripetspeednews.blogspot.com/q


చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగి మన తెలుగు వారి స్థాయిని దేశం నలుమూలలా చాటి చెప్పే విధంగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలలో తన ఆలోచనలతో చాకచక్యంగా వాటిని అధిగమించిన మన IAS మైలవరపు కృష్ణ తేజ  మరో అరుదైన  ఘనత సాధించారు. కృష్ణ తేజకు ప్రతిష్ఠాత్మకం అయిన బుక్ ఆఫ్ అఛీవర్స్ నందు చోటు దక్కటం కృష్ణ తేజ కీర్తిని మరో స్థాయికి తీసుకువెళ్ళింది అని చెప్పాలి.  ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో IAS గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 ఆగష్టు నెలలో కేరళలో వచ్చిన వరదలలో మన కృష్ణ తేజ తన ఆలోచనలతో ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ నిర్వహించిన ఆపరేషన్ కుట్టనాడు ఆ రాష్ట్రం చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ సమయంలో కేరళలో కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను తన భుజాల పైన వేసుకొని ఎంతో చాకచక్యంగా ఆ ఆపరేషన్ పూర్తి చేసారు.లక్షల మంది జీవితాల గురించి అలోచించి నిర్ణయం తీసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. అంతటి క్రిటికల్ పరిస్థితులలో ఒక్క తప్పిదం జరిగినా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే వారు కానీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆనాడు చేపట్టిన ఆపరేషన్ కుట్టనాడు కి గాను బుక్ అఫ్ అఛీవర్స్ నందు మన కృష్ణ తేజకు చోటు దక్కింది. బుక్ అఫ్ అఛీవర్స్ అంటే అసాధ్యాన్ని సాధించిన అరుదైన వ్యక్తుల గురించి అందులో పంచుకుంటారు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన మన చిలకలూరిపేట ముద్దు బిడ్డ IAS మైలవరపు కృష్ణ తేజకు అభినందనలు తెలుపుకుంటున్నాము.  
అలాగే కరోనా వీరవిజృభిస్తున్న సమయంలో కూడా కేరళ ప్రభుత్వం మన కృష్ణ తేజ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి కరోనా కట్టడికి కృషి చేసారు. ఆ కమిటీకి పూర్తి బాధ్యత వ్యవహిరిస్తు తన ఆలోచనలతో నిర్ణయాలతో కరోనా తీవ్రతని తగ్గించారు. 

Book of Achievers 


కేరళలోని మన కృష్ణ తేజ ఆఫీస్ నందు పని చేసే ఉద్యోగి అయన గురించి ఏమి అన్నారో అయన మాటలలోనే 

మనం నిత్యం ఎంతో మంది అధికారుల అవినీతి గురించి వింటూనే వుంటాం.డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉద్యోగాల్లో చేరేవారు కొంతమంది అయితే, ప్రజలకు సేవచేయాలని వచ్చేవారు మరికొంతమంది. అలాంటి ఒక వ్యక్తి గురించి నేను విన్నది, చూసింది...........
  
    జీవితంలో కొంతమందిని కలసినందుకు గర్వ పడుతుంటాం.అలాంటి ఒక వ్యక్తి గురించి, ఈయన పేరు కృష్ణతేజ మైలవరపు.కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి.ప్రస్తుతం అల్లెప్పే సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.నేను అనుకోకుండా ఒక రోజు ఎన్నికల విధుల్లో బాగంగా అల్లెప్పేకి వెళ్ళటం జరిగింది.అప్పుడే ఈయన్ని కలిసే అదృష్టం దక్కింది.

    అదృష్టం అని ఎందుకు అంటున్నానంటే....

 🔹ప్రజలకు ఏదోకటి చేయాలనే సంకల్పం.
 🔹ఒక అధికారిగా పాలనలో తనదైన ముద్ర చూపించాలనే ఉత్సాహం.
 🔹 ఎదుటి మనిషితో నేను ఒక అధికారిని అనే గర్వం లేకుండా మాట్లాడే మనస్తత్వం, ఎదుటి               వారికి ఇచ్చే గౌరవం.
 🔹 సర్వీసులో చేరిన ముడేళ్లకే దేశ వ్యాప్తి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి.

         ఆయన గురించి అక్కడి ప్రజలు,అధికారులు చెప్పిన కొన్ని విషయాలు...........

 🔹 గతంలో వరదలు వచ్చిన సమయంలో కుట్టు నాడు ప్రాంతంలో వరద భీభత్సాన్నీ                            ముందుగానే ఊహించి ఆయన చేపట్టిన రేస్కూ ఆపరేషన్.
 🔹 కేవలం 48 గంటల్లో రెండున్నర లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం.
 🔹సమర్దవంతంగా శిబిరాల నిర్వహణ.
 🔹 తరువాత తిరిగి వారిని స్వస్థలాలకు తరలించంటం.
 🔹వరదల అనంతరం ఆయన చేపట్టిన  I AM FOR ALLEPPEY అనే కార్యక్రమం.
 🔹వరదల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు తిరిగి కొత్త ఇళ్లు ఇవ్వటం.
 🔹పిల్లల బడుల ఆధునికీకరణ, రక్షిత త్రాగునీరు ఏర్పాటు.
 🔹 ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి ఉపాధి కల్పించడం.
 🔹I AM FOR ALLEPPEY ద్వారా ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది.
 🔹 ఇంకా ఇటువంటివి మరెన్నో........... 

అంటూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. 










































Share:

చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు.

చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలో ఈ రోజు 24-06-2021 MLA విడదల రజిని పుట్టినరోజు వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. పట్టణంలోని పలు సెంటర్లలో MLA ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలు వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే మోడ్రన్ మాల్ వద్ద భారీ ఎత్తున రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు. కూరగాయల మార్కెట్ వర్తక సంఘం తరుపున నిరు పేదలకు   బట్టలు పంచారు. ఎరువుల కొట్ల బజారులో కూడా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వాడ వాడల ఈ రోజు రజిని పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారు. వార్డు స్థాయి వ్యక్తుల నుండి పార్టీ సీనియర్ నాయకులు వరకు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. MLA పుట్టిన రోజుతో పట్టణం అంతా పండుగ వాతావరం అలుముకుంది. 
























































Share:

చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ సమీపంలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ సమీపంలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ అతి సమీపంలో పేకాట నిర్వహిస్తునట్లు వచ్చిన సమాచారంతో టౌన్ SI అజయ్ బాబు దాడులు నిర్వహించారు. హనుమయ్యమ్మ సత్రం పక్కనే ఉన్న విగ్నేశ్వరా కారు ట్రావెల్స్ వద్ద ఈ పేకాట నిర్వహిస్తున్నారు. ఈ దాడులలో ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 7 మొబైల్స్, 3500 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే వారి పైన కేసు నమోదు చేసారు.  

























Share:

చిలకలూరిపేటలో సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరావు గారి పర్యటన

చిలకలూరిపేటలో సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరావు గారి పర్యటన 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం నాడు సుప్రీం కోర్టు జెడ్జి లావు నాగేశ్వరావు గారు పర్యటించారు. పట్టణంలోని సుభాని నగర్ నందు ఉన్న లాహిరి పిల్లల హాస్పిటల్ నందు తేళ్ల సుబ్బారావు గారు ఏర్పాటు చేసిన చిన్న వేడుకలలో అయన పాల్గొన్నారు. లావు నాగేశ్వరావు గారి స్వగ్రామం పెదనందిపాడు కావటంతో చిలకలూరిపేటతో ఉన్న సంబంధాన్ని పంచుకున్నారు.నాగేశ్వరావు గారి పర్యటనతో ఆ ప్రాంతం అంతా పోలీస్ బందోబస్తుతో నిండిపోయింది. 
























































































Share:

అక్రమాలకు అడ్డాగా చిలకలూరిపేట - స్థానిక నేత దళిత భూములు పైన ఎందుకు మౌనంగా ఉన్నారు - ప్రత్తిపాటి పుల్లారావు

అక్రమాలకు అడ్డాగా చిలకలూరిపేట -  స్థానిక నేత దళిత భూములు పైన ఎందుకు మౌనంగా ఉన్నారు - ప్రత్తిపాటి పుల్లారావు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - మాజీ మినిష్టర్ ప్రత్తిపాటి పుల్లారావు ఏంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో నేను అధికారంలో ఉన్నపుడు ఎన్నిక ప్రచారంలో దళిత భూముల విషయంలో తన పైన విమర్శలు చేసిన జగన్ మోహనరెడ్డి  ఈ రోజు అధికారంలో ఉండి అదే దళిత భూములను ప్రభుత్వం ఏ విధంగా స్వాధీనం చేసుకుంటుంది అని ప్రశ్నించారు. స్థానిక నాయకులు నేతలు కూడా దీని పైనా మౌనం వహించటం ఏంటని, అలాగే దీని పైనా జగన్ మోహన రెడ్డి స్పష్టత ఇవ్వాలి అని అన్నారు. దళితులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని దిని పైనా పోరాటం చేస్తాం అని తెలిపారు. అలాగే చిలకలూరిపేట అధికారం అడ్డం పెట్టుకొని అక్రమ దందా సాగిస్తున్నారు అని 175 నియోజకవర్గాలలో ఎక్కడ లేని విధంగా అక్రమ మద్యం,పేకాట, గుట్కా వ్యాపారాలకు కేరాఫ్ గా మార్చారు, ఎక్కడో పక్క జిల్లా పోలీసులు ఇక్కడ అక్రమ గుట్కాలు పట్టుకునే వరకు ఎక్కడ పొలిసువారు ఎందుకు పట్టించుకోలేదు అని ప్రశ్నించారు. 

సెంట్రల్ గవర్నమెంట్ జర్నలిస్ట్ లను ఫరంట్ లైన్ వర్కర్లుగా గుర్తించినా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు అని , మరణించిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు 50 లక్షల ఆర్ధిక నష్టం చెలించాలి అని డిమాండ్ చేసారు.  












































Share:

చిలకలూరిపేట - డబ్బులు డిమాండ్ చేసిన వార్డు లేడీ వాలంటరీ తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ - మూడు వార్డు అడ్మిన్లను బదిలీ

చిలకలూరిపేట - డబ్బులు డిమాండ్ చేసిన వార్డు లేడీ వాలంటరీ తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ - మూడు వార్డు అడ్మిన్లను బదిలీ 

https://chilakaluripetspeednews.blogspot.com/

గత రెండు రోజులుగా పట్టణంలోని 27వ వార్డు వాలంటరీ లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేసిన విషయం సామాజిక మాధ్యమాలలో, పట్టణ, రాష్ట్ర మీడియా ఛానళ్లలో కోడై కూసింది. వీడియో లో వాలంటరీ చెప్పినట్లుగా తాను ఒక్క రూపాయి కూడా తీసుకోను అంతా ఫై అధికారులకు వెళ్తుంది అని చెపింది. దీని పైనా సీరియస్ అయిన మునిసిపల్ కమిష్నర్ ఘటన తెలిసిన వెంటనే ఆయా వాలంటరీని విధుల నుండి తప్పించారు. అలాగే తాజాగా ఆమె పైన ఉన్న అడ్మిన్లను బదిలీ చేస్తూ మునిసిపల్ కమిష్నర్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేసారు. 9,27,29 వార్డు అడ్మిన్లను బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. 9 వ వార్డు అడ్మిన్ సిద్దాబత్తుని రాజేష్ ను 27 వ వార్డుకి , 29 వ వార్డు అడ్మిన్ కరిష్మాను 9 వ వార్డుకి, 27 వ వార్డు అడ్మిన్ గడ్డం మురళి కృష్ణ ను 29 వ వార్డుకి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.  






























Share:

అక్రమ మద్యం, అక్రమ గుట్కాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా చిలకలూరిపేట - తాజాగా 735 మద్యం బాటిల్స్ సీజ్

అక్రమ మద్యం, అక్రమ గుట్కాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా చిలకలూరిపేట - తాజాగా 735 మద్యం బాటిల్స్ సీజ్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

గత కొంతకాలంగా చిలకలూరిపేట అక్రమ, నిషేదిత మత్తు పదార్ధాల హోల్ సేల్ మార్కెట్ గా తయారవుతుంది. చిలకలూరిపేట చుట్టుపక్క గ్రామాలలో, మండలాలలో మందుబాబులు, చిన్న చిన్న గుట్కా అమ్మే షాపులను ఎవరిని అడిగినా వారి నోటు నుండి వచ్చే ఒకేఒక్క మాట చిలకలూరిపేటలో ఫలానా ఏరియాలో, ఫలానా వ్యక్తుల వద్ద దొరుకుతాయి అని చెప్తారు. ఆవిధంగా చిలకలూరిపేట లో అక్రమ వ్యాపారం కొనసాగుతుంది. 

ఏపీ మందు క్వాలిటీ తక్కువ, రేట్ ఎక్కువ అని చెప్పి, ఇతర రాష్ట్ర మద్యం తక్కువ రేట్, క్వాలిటీ ఫిల్టరింగ్ ఎక్కువ అని చెప్పి యధేచ్చగా మద్యం విక్రయిస్తున్నారు. పక్క జిల్లాలో పోలీసులు మన ఊరికి వచ్చి ఇక్కడ అమ్మేవారి గుట్టు బయట పెడుతున్నారు. ఉదాహరణకి వేటపాలెం పోలీసులు పేటలో సుమారు 60 నుండి కోటి రూపాయలు విలువ చేసే గుట్కాలు అమ్మే పెద్ద చేపని పట్టుకున్నారు. అతనికి గుట్కాలు రైల్వే గూడ్స్ ద్వారా చీరాల, అక్కడి నుండి పేటకు గుట్టు చప్పుడు కాకుండా తరలించి హోల్ సేల్ గా చుట్టుపక్కల గ్రామాలకి అందిస్తున్నారు. ఈ విషయాన్ని పక్క జిల్లా పోలీసులు ఛేదించారు. మన పేట పోలీసులు ఎం చేస్తున్నారు అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లేదా పైన అధికారుల కన్ను సైగలలో ఇది నడుస్తుందా అని అందువలన మన పోలీసులు పట్టించుకోవటం లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది ఎలా ఉంటే చిలకలూరిపేట మండలంలోని మద్దిరాల గ్రామం వద్ద ఈ రోజు అనగా శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రము నుండి తీసుకు వచ్చిన మద్యం అక్రమంగా తరలిస్తుండగా ఎక్ససైజ్ అధికారులు వారిని పట్టుకున్నారు. వీరు ఇన్నోవా కారు నుండి మద్యం ను 5 బైకులతో సర్ది అక్కడ నుండి తరలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అధికారులు 5 బైకులను, ఒక ఇన్నోవా కారు తో పాటుగా 735 మద్యం బాటిల్స్ సీజ్ చేసారు. 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 
 






































Share:

చిలకలూరిపేట పట్టణంలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన బసవతారకరామ సర్వీస్ సొసైటీ , టీడీపీ నాయకులూ

చిలకలూరిపేట పట్టణంలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన బసవతారకరామ సర్వీస్ సొసైటీ , టీడీపీ నాయకులూ

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో సినీ నటుడు,హిందుపూర్ MLA  బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బసవతారకరామ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ కేకును మాజీ మునిసిపల్ ఛైర్మెన్ అయిన గంజి చంచు కుమారి గారితో కట్ చేసి నిరుపేదలకు 100 మందికి ఆహరం అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పండు శ్రీను, కంచర్ల వెంకటేష్, గంజి మోహన్, గాలం కోటి, మద్దిబోయిన శివ, పేరయ్య, గోపిదేశి వెంకటేష్ పాల్గొన్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

అలాగే పట్టాన టీడీపీ ఆఫీస్ నందు కూడా తెలుగు యువత నాయకులూ ఏలూరి నాగేశ్వరరావు గారు భారీ కేక్ ఎర్పాటు చేసారు. ముఖ్య అతిధిగా RK హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రామకృష్ణ గారు విచ్చేసి కేక్ కట్ చేసారు. 
 ఈ రోజే జిల్లా SC  నాయకులు ఇనగంటి జగదీష్ గారి పుట్టిన రోజు కూడా కలిసి రావటంతో అయన కూడా కేక్ కట్ చేసారు. ఈ సందర్భంలో కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు గారు, మల్లి బాబు గారు, పిల్లి కోటి గారు, అజారుద్దీన్ గారు, రవి గారు, అబ్దుల్ బాషా, శ్రీన, హరి బాబు, వేణు తదితరులు టీడీపీ సీనియర్ నాయకులు, తెలుగు యువత,  పాల్గొన్నారు. 































Share:

చిలకలూరిపేటలో సూపర్ వాలంటరీ - ప్రభుత్వ పధకాల లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో లీక్

చిలకలూరిపేటలో సూపర్ వాలంటరీ - ప్రభుత్వ పధకాల లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో లీక్ 


https://chilakaluripetspeednews.blogspot.com/2021/06/27.html





చిలకలూరిపేట పట్టణంలోని 27 వార్డు కి చెందిన లేడీ వాలంటరీ నిర్వాకం బయట పడింది. ప్రభుత్వ పధకాలు నేరుగా ప్రజలకు చేరువ చెయ్యవలసిన వాలంటరీ పధకాలు రావాలి అంటే ముందు గా తమకు  డబ్బులు ఇవ్వాలి అని డిమాండ్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ప్రభుత్వ లంచగొండ్లు నుండి ప్రజలను కాపాడటానికి వాలంటరీ వ్యవస్థ ఉన్నది. అలాంటిది ఫై వీడియో చూస్తే వాలంటరీ తీరు పైన అక్కడ ఉన్న లబ్దిదారుల కుటుంబం బిత్తర పోయింది. 

ఛైర్మెన్ రఫాని ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఆయా వాలంటరీ ని విధుల నుండి తప్పిస్తునట్లు తెలిపారు. అయితే ప్రజలు మాత్రం ఆ వీడియో లో  చెప్పునట్లు గా ఆ ఫై అధికారులు ఎవరో వారిని కూడా విచారించి వారిపైన చర్యలు తీసుకోవాలి అని కోరారు.  





































Share:

ఏపీలో జులై నెల నుండి సహజ మరణం 1లక్ష, ప్రమాదశాత్తు మరణిస్తే 5 లక్షలు పధకం అమలు - సీఎం జగన్ కీలక నిర్ణయం

ఏపీలో జులై నెల నుండి సహజ మరణం 1లక్ష, ప్రమాదశాత్తు మరణిస్తే 5 లక్షలు పధకం అమలు - సీఎం జగన్ కీలక నిర్ణయం 

https://chilakaluripetspeednews.blogspot.com/


ఏపీలో వైయస్ జగన్ వైయస్సార్ బీమా పధకంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కుంటుంబంలోని వ్యక్తి ( 18 నుండి 50 వయసు లోపు ) సహజంగా మరణిస్తే 1 లక్ష రూపాయలు, అలాగే 18 నుండి 70 వయసు లోపు వారు ప్రమాదం వలన చనిపోతే 5 లక్షలు అందించాలి అని తెలిపారు. అలాగే దరఖాస్తు చేసుకున్న కుంటుంబానికి  నెలలోగా పరిహారం అందించాలి అని తెలిపారు. జులై 1 వ తరుకు నుండి ఈ వైయస్సార్ బీమా పధకానికి మార్పు చేసి అమలు చెయ్యాలి అని సూచించారు. 



































Share:

"జగనన్న తోడు" మీకు రాలేదా అయితే ఇలా చెయ్యండి - వీరు ,మాత్రమే అర్హులు

"జగనన్న తోడు" మీకు రాలేదా అయితే ఇలా చెయ్యండి - వీరు ,మాత్రమే అర్హులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


జగనన్న తోడు అనే పధకం క్రింద ఏపీ ప్రభుత్వం చిరు వ్యాపారులకు,చేతి వృత్తి కళాకారులకు 10 వేలరూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలు వారి ఖాతా లో ప్రభుత్వం జమచేస్తుంది. ఈ పథకానికి అర్హులు అయి ఉండి పేర్లు నమోదు చేసుకొని వారు గ్రామ,వార్డు వాలంటీర్లను సంప్రదించండి. వారి ద్వారా సచివాలయాలలో దరఖాస్తు చేసుకోండి. 3 నెలలో పరిశీలించి రుణాలు అందిస్తారు. మరిన్ని వివరాలకు 08912890525, 1902 కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. 

జగనన్న తోడు పధకానికి వీరు మాత్రమే అర్హులు 

* చేనేత, ఇత్తడి పని చేసేవారు. 

* కొండపల్లి బొమ్మలు తయారు చేసే వారు, కలంకారీ , తోలుబొమ్మలు, కుమ్మరి , బొబ్బిలి వీణ, ఏటి కొప్పాక , ఇతర చేతి వృత్తుల వారు 

* తోపుడు బండ్ల పైన కూరగాయలు, పండ్లు, వస్తువులు, ఆహార పదార్ధాలు అమ్మేవారు 

* గంపలలో, బుట్టలలో వస్తువులు అమ్మే వారు, 

* సైకిళ్ళు, ఆటోలలో , బైకుల పై వ్యాపారం చేసుకునే వారు

* 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత, తాత్కలిక షాపులు ఉండేవారు 
అర్హులు 
   






































Share:

చిలకలూరిపేట - నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున సందర్భంగా కావూరు,లింగంగుంట్ల గ్రామంలలో మహా రక్తదానం శిబిరం

 చిలకలూరిపేట - నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున సందర్భంగా కావూరు,లింగంగుంట్ల గ్రామంలలో మహా రక్తదానం శిబిరం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - జూన్ 10 వ తారీకున సినీనటుడు, హిందుపూర్ MLA అయిన నందమూరి బాలకృష్ణ 61వ పుట్టిన రోజు సందర్భంగా చిలకలూరిపేట మండల గ్రామాలూ అయిన కావూరు, లింగంగుంట్ల గ్రామంలోని బాలకృష్ణ ఫాన్స్ తరుపున మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తునట్లు తెలిపారు.  

కరోనా వలన రక్తం ఇచ్చే వారు లేక  బ్లడ్ బ్యాంకు నందు రక్తం నిల్వలు తగ్గిపోయిన కారణంగా అత్యవసర సమయాలలో ఉపయోగపడే ఈ రక్తం కోసం ఈ రక్తదాన శిబిరం నిర్వహించాలి అని నిర్ణయించుకున్నాం అని సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు, అభిమానులు కరోనా నియమాలు పాటిస్తూ ఈ మహా రక్తదానంలో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు.

వేదిక :- లింగంగుంట్ల, కావూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద

గమనిక :- కరోనా నియమాలు పాటిస్తూ, మాస్క్,శానిటైజేర్  వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటించవల్సిందిగా కోరుతున్నాము. 


























Share:

గుంటూరు జిల్లా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు - ఇలా అప్లై చెయ్యండి

గుంటూరు జిల్లా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు - ఇలా అప్లై చెయ్యండి 

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లా వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు చేసుకోండి. ఆరోగ్యమిత్ర, టీమ్ లీడర్,డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్తులు కలిగే ఉన్నట్లు జిల్లా DMHO యాస్మిన్ గారు తెలిపారు. 

దరఖాస్తు కోసం https://guntur.ap.gov.in/notice/recruitment-of-team-leader-and-aarogya-mithra-posts-on-outsourcing-basis-under-dr-ysr-aarogyasri-health-care-trust-in-guntur-district/ ఆ లీక్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి. 9 వ తారీకు లోపు ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త కార్యాలయంలో సమర్పించాలి అని తెలిపారు 










































 
Share:

చిలకలూరిపేటలో 33 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ - భారీగా దొరికిన నగదు

చిలకలూరిపేటలో 33 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ - భారీగా దొరికిన నగదు  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పండరీపురంలోని  ఒక అపార్టుమెంట్లో పేకాట ఆడుతున్న 33 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 13,50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తం లో డబ్బులు , ఒకే అపార్టుమెంట్లో 33 మందిని ఒకేసారి అరెస్ట్ చెయ్యటం తో ఆ ప్రాంతం అంత ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది. కుటుంబాలు నివసించే ప్రదేశాలలో ఇలాంటి కార్యాకలాపాలు చేసే వారిని కఠినంగా శిక్షించాలి అని స్థానికులు చెపుతున్నారు.అరెస్ట్ చేసిన వారిని కోర్టుకు హాజరుపరుస్తాం అని తెలిపారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది గుంటూరు, మంగళగిరి, విజయవాడ, తెనాలి, పట్టణంలోని వ్యక్తులుగా గుర్తించారు. 































Share:

చిలకలూరిపేటలో ఆనందయ్య మందు లాంటి మందు పంపిణి కి సిద్ధం చేస్తున్న డాక్టర్ నుండి మందును సీజ్ చేసి మందుని పోలీస్టేషన్ కు తరలింపు

చిలకలూరిపేటలో ఆనందయ్య మందు లాంటి మందు పంపిణి కి సిద్ధం చేస్తున్న డాక్టర్ నుండి మందును సీజ్ చేసి మందుని పోలీస్టేషన్ కు తరలింపు  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని అమ్మ పాలిక్లినిక్ నందు కరోనా సోకినా వారికీ,కరోనా సోకకుండా ఉండేందుకు ఆనందయ్య లాంటి మందుని పంపిణి చేస్తున్నట్లు డాక్టర్ హనీఫ్ తెలిపారు. అయితే విషయం తెలుసుకున్న చిలకలూరిపేట టౌన్ SI అనిల్ బాబు, శానిటరీ ఇన్స్పక్టర్ శ్రీనివాసరావు, మునిసిపల్ రెవెన్యూ అధికారి ఫణి కుమార్  అమ్మ పాలిక్లినిక్ కి చేరుకొని పంపిణీకి సిద్ధంగా ఉంచిన మందుని పరిశీలించి మందు పంపిణీ చెయ్యటానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని తెలిపారు. అలాగే పంపిణీకి సిద్ధం గా ఉన్న మందును సీజ్ చేసి పోలీస్టేషన్ కి తరలించారు. 








































Share:

గుంటూరు జిల్లా - కంచె చేను మేసినట్లుంది - అక్రమ మద్యం - మామూళ్లు వసూళ్లు చేస్తున్న SI లపైన వేటు

గుంటూరు జిల్లా - కంచె చేను మేసినట్లుంది -  అక్రమ మద్యం - మామూళ్లు వసూళ్లు చేస్తున్న SI లపైన వేటు 

https://chilakaluripetspeednews.blogspot.com/

కంచె చేనుని మేసినట్లు - గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం కట్టడి చెయ్యాల్సిన పోలీస్ వారే ప్రోత్సహించారు. జిల్లాలోని పలనాడు ప్రాంతం మపాళ్ళ, దుర్గి SI లు ఈ ఘటనకు పాల్పడారు. ముప్పాళ్ల SI నాగేశ్వరరావు , దుర్గి SI రామాంజనేయులు  పైనా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీస్ ఉన్నత అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో ఇరువురు SI లు ఇతర రాష్ట్రాల నుండి మద్యం తీసుకువచ్చి అమ్మే వారి దగ్గిర నుండి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు నిర్ధారణ అయినది. వెంటనే పోలీసు ఉన్నత అధికారులు ఇరువురి SI ల పైన వేటు వేశారు  







































Share:

చిలకలూరిపేట - పట్టణంలోని 23 వార్డులో మంచినీటి కోసం అవస్థలు

చిలకలూరిపేట - పట్టణంలోని 23 వార్డులో మంచినీటి కోసం అవస్థలు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని 23వ వార్డు లోని ప్రజలు మునిసిపాలిటీ వాటర్ రాకపోవటంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు. వార్డులోని ప్రజలు మాట్లాడుతూ గత 10 రోజుల నుండి వార్డులో మంచినీటి సమస్య ఉన్నది అని, ప్రతి రోజు రాత్రి సమయాలలో నిద్రలేకుండా మంచినీటి కోసం మోటర్లు వేస్తు తెల్లవారు జామున వేచి ఉన్నకాని మునిసిపాలిటీ వాటర్ రావటం లేదుఅని, పొద్దుపొద్దున్నే లేచినప్పటి నుండి మధ్యాహ్నం వరకు కూడా మంచినీరు నిత్యావసరం అని,వార్డు ప్రజలువారి బాధను వ్యక్తం చేసారు. 23వ వార్డు లోని గౌడ పాలెం , సత్రం బజార్, దర్గ బజార్, మామిడోళ్ల బజార్లోని ప్రజలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. స్థానికి వార్డు కౌన్సిలర్ కంచర్ల కరుణ గారు అధికారులతో మాట్లాడి వాటర్ ట్యాంకులతో మంచి నీటిని అందించారు. గతంలో 10 రోజుల క్రితం కూడా వార్డు ఇంచార్జి శ్రీరాం శివ పార్వతి గారు కూడా ఇలాగే వాటర్ ట్యాంకులని తెపించి మంచి నీటిని అందించారు. అయితే వార్డు ప్రజలు మాత్రం వాటర్ ట్యాంకులతో కాకుండా మంచినీటిని పైపుల ద్వారా అందించటానికి, వాటి సంబందించిన అధికారులతో మాట్లాడి  మరమ్మతులు త్వరగా పూర్తి చేయించి నీటి సమస్యని పరిష్కరించాలి అని కోరారు. 




































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.