భారత్ ను తాకిన కొత్త ఒమిక్రాన్ వేరియంట్ - ఎన్ని కేసులు నమోదయ్యాయి అంటే ? - వచ్చిన వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే ?
కోవిడ్ తీవ్రత తగ్గుతుంది అనుకొనే సమయంలో సడన్ గా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ప్రజలను భయపెడుతుంది. గత వేరియంట్ లతో పోలిస్తే ఇది త్వరగా వ్యాపిస్తుందని హడావిడి ఎక్కువైంది. అయితే గత కొన్ని రోజుల క్రితం నుండి విదేశాల నుండి భారత్ కి వచ్చిన వారిని పరీక్షించగా తాజాగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ ఉన్నట్లుగా ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వీరి కర్ణాటక బెంగళూరు ప్రాంతంగా తెలుస్తోంది. అయితే వీరిలో లక్షణాలు మాత్రమే ఉన్నాయని ప్రజలందరూ అప్రమత్తమై ఈ వేరియంట్ వ్యాప్తి చెందకుండా ఉండాలని అధికారులు తెలిపారు. విదేశాల నుండి వచ్చేవారికి కచ్చితంగా ఆర్ టి పి సి ఆర్ చేయాలని ఒకవేళ పాజిటివ్గా నిర్ధారణ అయితే ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తామని వారు తెలిపారు. ఏది ఏమైనా నా గత రెండు వేరియంట్లలో వలన జనజీవనం అస్తవ్యస్తమైన మాట వాస్తవం. దానిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ మాస్కులు ధరించి కొత్త వేరియంట్ కట్టడికి సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.