చిలకలూరిపేట సెంట్రల్ బ్యాంకు ఖాతా దారులలో ఆందోళన !!!
చిలకలూరిపేట సెంట్రల్ బ్యాంకు ఖాతా దారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 2వ తారీఖున పలువురు బ్యాంకు సిబ్బంది కరోనా రావటంతో 3వ తరుకు నుండి బ్యాంకు మూసివేశారు . అప్పటినుండి మధ్యలో 1,2 రోజులు ఓపెన్ చేసినా బ్యాంకు పనుల నిమిత్తం ఖాతా దారులకు అనుమతి లేకుండా బ్యాంకు పనులు చూసుకొని మళ్లీ మూసివేశారు. ఇప్పటికే 15 రోజుల అవుతున్న కారణంగా వ్యాపారలావాదేవీలు కోసం వ్యాపారస్తులు, అత్యవసర లావాదేవీలు జరపటానికి బ్యాంకు మూసి ఉండటంతో బ్యాంకు ఖాతా దారులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బ్యాంకు ఓపెన్ చేసి అత్యవసర లావాదేవీలకు అనుమతించాలి అని కోరుతున్నారు
భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సేఫ్టీ పౌడర్ను ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆఫీసులకు అందజేసారు.
భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సేఫ్టీ పౌడర్ను ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆఫీసులకు అందజేసారు.
చిలకలూరిపేట పట్టణంలోని భగవత్ గీతా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా సేఫ్టీ కొరకు ప్రత్యేకంగా తాయారు చేయించిన పొడిని ఫ్రంట్ లైన్ వర్కర్స్ (మునిసిపాలిటీ ఆఫీస్, పోలీస్టేషన్, హాస్పిటల్స్ ) ఆఫీసు నందు అందజేశారు. ఈ పౌడర్ని ఏడు రకాల సుగంధ ద్రవ్యాలతో( జాజికాయ, జాపత్రి జాజిపువ్వు, అనాసపువ్వు, యాలుకాయలు, లవంగాలు, పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం ) తాయారు చేసారు. ట్రస్ట్ అధ్యక్షులు గుడిపల్లి నాగభూషణం గారు వీటి వలన కరోనా బాక్టీరియా గాలిలో విస్తరించకుండా కొంత వరకు కాపాడుతుంది అని తెలిపారు.కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం ప్రత్యేకంగా తాయారు చేయించారు అని తెలిపారు. ట్రస్ట్ సభ్యులు వీటిని మునిసిపల్ చైర్మన్ రఫ్ఫాని గారికి, అర్బన్ CI బిలాలుద్దీన్ గారికి, రూరల్ CI సుబ్బారావు గారికి, కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ కి అందించారు. ఈ కార్యక్రమంలో వడాల భాస్కర్, కందుల రవికుమార్, నాయుడు ఫణి, ఇతర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట కరోనా మృతిదేహాలు తరలింపుకు ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పురపాలకసంఘం
CHILAKALURI PET SPEED NEWSTuesday, May 18, 2021కరోనా న్యూస్, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్
No comments
చిలకలూరిపేట కరోనా మృతిదేహాలు తరలింపుకు ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పురపాలకసంఘం
చిలకలూరిపేట పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున కరోనా మృతి దేహాలను తరలించటానికి ఉచిత వాహనాన్ని ఏర్పాటు చేసారు.
కరోనా కారణంగా పట్టణంలో చాలామంది చనిపోయారు. హాస్పిటల్ ట్రాట్మెంట్ కోసం లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తూ చివరికి చాల మంది ఆక్సిజన్ అంధక, వ్యాధి తీవ్రతని ముందుగా గ్రహించలేక చివరకి చాలామంది మృతిదేహాలతో బయటకి వస్తున్నారు. అప్పటికే లక్షల రూపాయల ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీకి గురి అయిన మృతి చెందిన కుటుంబానికి ఆ మృతుదేహాలను ఖననం కొరకు శ్మశానం వరకు తరలించటానికి ఎవరు సహకరించక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తు మళ్లీ అక్కడ ఇంకో 50 వేలు వరకు దోపిడీకి గురి అవుతున్న నేపథ్యంలో, అలాంటి వాటి అన్నింటికీ తెర దించుతూ పట్టణంలోని మునిసిపాలిటీ పురపాలకసంఘం ఆధ్వర్యంలో ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మెన్ షేక్ రఫాని గారు, మునిసిపల్ కమిషనర్ ఫణి కుమార్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రఫాని గారు ,మాట్లాడుతూ ఎవరైనా కరొనతో మృతు చెందిన వారికీ ఈ వాహనం సేవలు ఉపయోగించుకోవాలి అని తెలియజేశారు.
ఉచిత వాహనం కొరకు రవికుమార్ :- 9948923050 , మస్తాన్ రెడ్డి :- 9951079006 ఈ నంబర్లకు కాల్ చేసి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు, తలహఖాన్ గారు , దరియావాలి గారు పాల్గొన్నారు.