చిలకలూరిపేట నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB) కరొనతో మృతి చెందారు
చిలకలూరిపేటలోని నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB ) (35) కరొనతో ఈ రోజు మృతి చెందారు. పట్టణములోని సుబ్బయ్యతోటలో నివాసం ఉంటున్న విజయ్ కుమార్ 20 రోజులుగా కరొనతో పోరాడుతూ ఈ రోజు విజయవాడలోని ప్రముఖ హాస్పిటల్ లో మృతి చెందారు. చిన్న వయసులోనే మృతి చెందటం ఆ ప్రాంత ప్రజలని కలచివేసింది. ఎన్నో సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, ఎంతో మందికి ఆర్ధికంగా ఆదుకున్న వ్యక్తి ఈ రోజు లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం సాయంత్రం విజయ్ మృతి దేహాన్ని తీసుకువచ్చి కరోనా కారణంగా త్వరగా అంతక్రియలు నిర్వహించారు. విజయ్ మృతి కారణంగా ఆ ప్రాంతం అంతా మూగబోయింది.
మీ అకాలమృతికి సంతాపం తెలుపుతూ CHILAKALURIPETA SPEED NEWS, Bad Boy's Youth