చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది !!! ???
చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది !!! ???
అయితే చిలకలూరిపేట కు రెండవ వైస్ ఛైర్మెన్ గా ఎవరిని ఎన్నుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు పాలకవర్గం . రిజర్వేషన్ ఖరారు అయితే ఎవరికీ దక్కుతుందో చెప్పలేము. మొన్న జరిగిన ఎన్నికలలో అత్యధికంగా మహిళా కౌన్సిలర్లు గెలిచారు . అయితే ఈసారికి రెండవ వైస్ ఛైర్మెన్ పదవి మహిళలకి దక్కవచ్చు.
26-03-2021 భారత్ బంద్ కు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేసింది
26-03-2021 భారత్ బంద్ కు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేసింది :--
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలిపు మేరకు 26-03-2021 న జరిగే భారత్ బంద్ కి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షడు అయిన శ్రీ కొనకళ్ల విద్యాధరావు లేఖ విడుదల చేసారు. కనుక దుకాణాలు&వ్యాపార సంస్థలు మూసివేసి భారత్ బంద్ కి సహకరించవల్సినదిగా కోరుతున్నారు. ఇప్పటికే టీడీపీ , వైస్సార్సీపీ,కాంగ్రెస్ మద్దతు తెలిపాయి.
దేశంలో రెండవరోజు కూడా స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో రెండవరోజు కూడా స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు :--
చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య
చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య
చిలకలూరిపేట పసుమర్రులో సూర్యనారాయణ అనే వ్యక్తి ఆత్మహత్య. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చిమటావారిపాలెం కి చెందిన సూర్యనారాయణ (61) అనే వ్యక్తి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం పైన పసుమర్రు వెళ్ళాడు. పసుమర్రు శివారుల్లో రహదారి పక్కనే ఉన్న సిమెంట్ బల్లపై గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ గా తెలుస్తుంది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వలన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వారు ప్రాధమిక నివేదికలో తేలిచ్చారు. మృతుడు కొంతకాలంగా చిలకలూరిపేట లో నివాసం ఉంటున్నాడు. చిలకలూరిపేట అర్బన్ పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు.