మళ్లీ నవతరం పార్టీకే గాజు గ్లాస్ గుర్తు - నాడు తిరుపతి & నేడు బద్వేల్
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఆవిర్భవించినప్పుడు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీ గుర్తుగా నిర్ణయించారు. అయితే గడిచిన అసెంబ్లీ ఎలక్షన్స్లో జనసేన పార్టీకి తగినన్ని సీట్లు దక్కపోవడంతో ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చారు. మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం జాతీయ పార్టీ అయిన నవతరం పార్టీకి కేటాయించింది. మళ్లీ ఈ నాడు బద్వేల్ ఉప ఎన్నికలకు కూడా గాజు గ్లాస్ గుర్తును నవతరం పార్టీకే ఎన్నికల సంఘం కేటాయించారు. ఈ విషయాన్ని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ తరఫున డాక్టర్ గోదా రమేష్ బాబు పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో తో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తమ గాజు గ్లాస్ గుర్తు వేరే పార్టీకి కేటాయించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.