రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు
చిలకలూరిపేట :- జనసేన, టిడిపి, బిజెపి ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఇప్పటికే కార్యకర్తలు భారీ ఎత్తున సభ స్థలానికి చేరుకున్నారు. కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే అల్పాహారం, మజ్జిగ, మంచినీళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా పోలీస్ వారి కనుసైగల్లో భారీ బందోబస్తు నడుమ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుండి కూడా పట్టణంలోని లాడ్జ్ అండ్ హోటల్స్ అన్ని ముందుగానే బుక్ అయిపోవడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న విఐపి లకు వసతి సదుపాయానికి ఇక్కట్లు తప్పడం లేదు. అయినప్పటికీ పట్టణంలోని పెద్దపెద్ద హోటల్స్, టిఫిన్ సెంటర్లు జనాలతో కిరిసిపోయాయి. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడటం వలన జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్రతను కొంతవరకు తగ్గించగలిగారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు సాయంత్రం అయినప్పటికీ కూడా ప్రజలు ఇప్పటినుండే సభ స్థలానికి బారులు తీరారు. సభా ప్రాంగణానికి విఐపి పాసులు ఉంటేనే కార్లకు అనుమతిస్తున్నారు. చిలకలూరిపేట నుండి బొప్పూడి వరకు రోడ్లన్నీ టిడిపి, జనసేన, బిజెపి జెండాలతో నిండిపోయాయి. ఇప్పటికే పలు ప్రధాన కూడలిలలో కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
సంబంధించిన వీడియో చూడటం కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.