మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

నరసరావుపేట బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

నరసరావుపేట బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

నరసరావుపేట బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్


పల్నాడు జిల్లా :- భారీ ర్యాలీతో చిలకలూరిపేట మీదుగా కోటప్పకొండను చేరుకొని ప్రత్యేక పూజలు అనంతరం నరసరావుపేట చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్న మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ..

నా నియోజకవర్గం వదిలి పెట్టి వస్తున్నప్పుడు బాధ వేసింది. పల్నాడు గడ్డపై అడుగుపెట్టిన వెంటనే గర్వంగా ఫీల్ అయ్యా. జగనన్న నన్ను సరైన చోటుకు పంపించాడనుకున్నాను. నా జీవితంలో అనేక కష్టాలు, బాధలున్నాయి. నాకు మీసం తిప్పాలని ఉంది. మా నెల్లూరులో మీసం తిప్పితే రౌడీ అంటారని రాజకీయ నాయకులు చెప్పారు, కాని పల్నాడు వచ్చిన తర్వాత మీసం తిప్పుతా, పంచె కట్టుకుంటా  నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటా. జగనన్న కోసం తల తెగుతుందన్నా ముందుకే వెడతా. రాష్ట్రంలో ఎక్కడైనా ఓడి పోయే సీటు ఉంటే అక్కడికి వెళ్ళమన్నా వెళతాను. నెల్లూరు నాకు సెట్ అవ్వదు అంటారు. నా మనస్తత్వానికి దగ్గరగా ఉన్న పల్నాడుకే నన్ను పంపించారు. గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చారని టిడిపి వాళ్ళు అన్నారు. మా గొర్రెల, బర్రెల పాలు అమ్ముకునే వేల కోట్లు సంపాదించిన విషయం భువనేశ్వరి గుర్తుపెట్టుకోవాలి. నేను గొర్రెలు కాసిన వారసత్వం నుండే వచ్చానని గర్వంగా చెప్పుకుంటాను. నన్ను పెంచుతారో తెంచుతారో మీ చేతుల్లో ఉంది. నా రాజకీయ భవిష్యత్ మీ చేతిలో పెడుతున్నాను. నేను వదిలి పెట్టిన సీటును మైనార్టీకి ఇచ్చారు. నెల్లూరు చరిత్రలో మైనార్టీకి సీటు ఇచ్చిన దాఖలాలు లేవు అని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ సమావేశంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..

తిరిగి సిఎంగా జగన్ చూసే వరకూ అందరి కలిసి పని చేయాలని, టిడిపి ఎన్ని కుయుక్తులు పన్నినా రాబోయే అరవై రోజుల్లో తేల్చుకుందామని ఆయన తెలిపారు. అలాగే రానున్న ఎన్నికల్లో ఎంపి తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తాం అని జోస్యం చెప్పారు.

 ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి, సత్తనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ...

సింహపురి నుండి నూతన ఉత్సాహం నర్సరావుపేటకు వచ్చిందని, జలవనరుల శాఖ సీటును రాంబాబుకు వదిలి పెట్టు అని జగన్మోహన్ రెడ్డి అంటే  వదిలి పెట్టిన విశ్వాస పాత్రుడు అనిల్ అని ఆయనను కొనియాడారు, అలాగే ఇక్కడ సీటు వదిలి పెట్టి గుంటూరు వెళ్ళు అంటే పార్టీనే వదిలి పెట్టిన విశ్వాస ఘాతకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అని ధ్వజమెత్తారు. నరసరావుపేట లోక్ సభ లో ఏ అభ్యర్థికి రానంత మెజారిటీ తో అనిల్ ను గెలిపించాలి అని పిలుపునిచ్చారు. బిసి లకు సీటు ఇస్తామంటే పార్టీ మారిన ద్రోహులకు బిసిల ఓటు అడిగే హక్కు లేదు అని, ఏడు రథాలను నడిపించిగల శ్రీ కృష్ణుడు అనిల్ అని, ఈ రథం కింద అందరూ నలిగిపోవాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు.

పల్నాడు జిల్లా ఇంచార్జి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ....

"చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా బిసిలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారా. మహిళలు గడప దాటకుండానే అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం అందించింది అని ఆయన గుర్తు చేశారు. అలాగే జిల్లా లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడు అసెంబ్లీ అభ్యర్థులతో పాటు లోక్ సభ అభ్యర్థి అనిల్  ను గెలిపించాలి అని ఆయన పిలుపునిచ్చారు.

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ...

చంద్రబాబుకి అనిల్ కుమార్ పంపి జగన్ కౌంటర్ ఇచ్చారని, తానా తందానా అయిపోయిందయ్య కృష్ణయ్య. అనిల్ కుమార్ యాదవ్ తో కాదు నాతో పెట్టుకో చాలు కృష్ణ అంటూ ఎంపీ లావు కృష్ణ పై కామెంట్స్ చేశారు. అలాగే తోలు తీస్తాం అంటూనారు ఎవరికి తీస్తారు తాట.35 మంది కాపులకు టికెట్స్ జగన్ ఇచ్చారు గుర్తుపెట్టుకో పవన్. నువ్వు 35 టికెట్స్ తెచ్చుకోకపోతే పవన్ కల్యాణ్ కు కాపులు తోలు వలుస్తారు అటు ఆయన ధ్వజమెత్తారు.

Share:

చిలకలూరిపేట - పెళ్లిలో సెల్ ఫోన్లు చోరీ - పట్టుకొని దేహశుద్ధి చేసిన మహిళలు

చిలకలూరిపేట - పెళ్లిలో సెల్ ఫోన్లు చోరీ - పట్టుకొని దేహశుద్ధి చేసిన మహిళలు

చిలకలూరిపేట - పెళ్లిలో సెల్ ఫోన్లు చోరీ - పట్టుకొని దేహశుద్ధి చేసిన మహిళలు

చిలకలూరిపేట టౌన్:-  సెల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోయిన దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన చిలకలూరిపేటలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే గణపవరం చెందిన మాధవి తన కుటుంబంతో కలసి చిలకలూరిపేట పట్టణంలోని గ్రాండ్ వెంకటేశా కళ్యాణ మండపంలో వివాహ శుభకార్యానికి హాజరయ్యారు. వివాహం జరుగుతుండగా తమ సెల్ఫ్ ఫోన్ చోరీకి గురయ్యాయని గమనించిన వారు పెళ్లికి హాజరైన బంధువులతో విషయాన్ని పంచుకున్నారు. పెళ్లికి హాజరైన వారిలో మొత్తం ఐదు సెల్ ఫోన్లు దొంగిలించబడినట్లు సమాచారం. సదరు మహిళా సెల్ ఫోన్ చోరీకి గురైందని బాధతో రాత్రి 11 గంటలకు సమయంలో కుటుంబంతో కలిసి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. చిలకలూరిపేట, గణపవరం మధ్య ఉన్న కుప్ప గంజి వాగు సమీపంలో ఇద్దరి యువకులు అనుమానాస్పదంతో ఉండటంతో గమనించి సోదా చేయగా వారి వద్ద దొంగిలించిన సెల్ ఫోన్లు గుర్తించారు. విషయాన్ని గమనించిన ఒక దొంగ వారిని నెట్టివేసి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పారిపోయాడు. మిగిలిన ఇంకొక దొంగని కాళ్లు చేతులు కట్టివేసి దేహశుద్ధి చేసి ఆరా తీయగా నరసరావుపేటకు చెందిన రామూగా తెలిపాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు దొంగని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. రాత్రి సమయంలో దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మహిళలను స్థానికులు అభినందించారు. రాత్రి సమయంలో మహిళ అని అధైర్యం పడకుండా ధైర్యంగా దొంగలను ఎదిరించి పట్టుకున్నారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.