శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మల్లెల రాజేష్
చిలకలూరిపేట:- పట్టణంలోని పెదనందిపాడు మారుతీ నగర్ నందు వేంచేసి ఉన్న జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ వేడుకలుకు వైయస్సార్సీపి నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సిపి పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షులు పఠాన్ తలహాఖాన్, వైయస్సార్సీపీ నాయకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, పంగులూరి వెంగళ రాయుడు, బేరింగ్ మౌలాలి, గుంజి వీరాంజనేయులు, దేవాలయ కమిటీ సభ్యులు తోకల నాగరాజు దాసరి శివకోటయ్య, పాలపర్తి అంజమ్మ, పాలపర్తి విమలమ్మ, దేవరకొండ ఏడుకొండలు, దేవరకొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.