మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp
Showing posts with label భారత్. Show all posts
Showing posts with label భారత్. Show all posts

గుడ్ న్యూస్ - భారత ప్రభుత్వం భారీగా తగ్గించిన పెట్రోల్ డీజిల్ ధరలు రేపటి (దీపావళి రోజు) నుండి అమల్లోకి

గుడ్ న్యూస్ - భారత ప్రభుత్వం భారీగా తగ్గించిన పెట్రోల్ డీజిల్ ధరలు రేపటి (దీపావళి రోజు) నుండి అమల్లోకి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయి. తాజాగా భారత ప్రభుత్వం దీపావళి సందర్భంగా పౌరులకు రేపటి నుండి అనగా దీపావళి పండుగ నుండి పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల ఎక్సైజ్ సుంకం తగ్గించినట్లు ప్రకటించింది. తగ్గిన ఇంధన ధరలు రేపటి నుండి ధరలు అమలులోకి వస్తాయి. ఈ ఒక్క పూట ఆగి రేపు ఉదయం మీ వాహనాలకు పెట్రోల్, డీజిల్ గుర్తించుకోండి.



Share:

లండన్ లో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మన తెలుగు కృష్ణ తేజం

లండన్ లో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మన తెలుగు కృష్ణ తేజం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన IAS మైలవరపు కృష్ణ తేజ అవార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా లండన్ హై స్పీడ్ డైవర్సిటీ కార్యక్రమంలో  మన కృష్ణతేజకు అవార్డుని అందజేశారు. ప్రస్తుతం కేరళ టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. కేరళలో "అయమానం" గ్రామీణ పర్యాటక ప్రాజెక్టుకు (WTM) 'వరల్డ్ ట్రావెల్ మార్కెట్' అవార్డు లభించింది. కేరళ లో పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి ఈ మిషన్ అయమనం ప్రాజెక్టుకు అవార్డు దక్కడంతో కేరళ పర్యాటక శాఖ అధికారి మహమ్మద్ రియాజ్ ఆనందం వ్యక్తం చేశారు. కోవిడ్ తర్వాత పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ఈ అవార్డు తమ రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అలాగే కృష్ణ తేజ పదునైన ఆలోచనలను అవలంబించడం వలన ఇలాంటి అవార్డులు తమకు దక్కాయని వారు తెలిపారు. కృష్ణ తేజ తనకు అప్పగించిన బాధ్యతలను తన ఆలోచనలను కలుపుకొని సంపూర్ణంగా నిర్వహించడం వలన ఈ యొక్క అవార్డే కాదు గతంలోనూ పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. కేరళలో వరదలు మొదలుకొని & కోవిడ్ నియంత్రణను చర్యలను చేపట్టడంలో మైలవరపు కృష్ణ తేజ తనకు తానే సాటి అని - ఈనాడు లండన్లో ఈ అవార్డును అందుకోవడంతో మరోసారి మన తెలుగువారి ఘనతను విదేశాల్లో కూడా చాటిచెప్పారు. ఇలాంటి అవార్డులు మరెన్నో పొంది తెలుగువారి కీర్తిని దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల తెలియజేయాలని కోరుకుంటూ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



Share:

రోజు పెరిగే పెట్రోల్ రేటు కన్నా ఈరోజు రికార్డు స్థాయిలో పెరుగుదల - ఎంత అంటే ?

రోజు పెరిగే పెట్రోల్ రేటు కన్నా ఈరోజు రికార్డు స్థాయిలో పెరుగుదల - ఎంత అంటే ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


గత కొంత కాలంగా ఇంధన ధరలకు రెక్కలొచ్చి ఆకాశంలో వీర విహారంగా ఎగిరిపోతున్నాయి. ప్రతిరోజు 30 నుండి 35 పైసల వరకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగేవి. అలాంటివి మొట్టమొదటిసారిగా 40 పైసల పైకి ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా సోమవారం నాడు పెట్రోల్ పై 41 పైసా డీజిల్ పై 42 పైసలు పెరిగాయి. పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో మెట్రో నగరాల్లో వాహనదారులు ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.



Share:

కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ - మూడు రోజులపాటు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, షాపులు స్వచ్ఛందంగా బంద్

కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ  - మూడు రోజులపాటు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, షాపులు స్వచ్ఛందంగా బంద్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

నాటి కన్నడ సినిమా ఇండస్ట్రీని, రాజకీయాలను కనుసైగలతో శాసించిన కంఠీరవ రాజ్ కుమార్ మూడవ కుమారుడు కన్నడ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్‌కుమార్ అకస్మాత్తుగా నిన్న మరణించడంతో యావత్ కర్ణాటక రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. సాధారణంగా ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తులు చాలా యాటిట్యూడ్, రిచ్నెస్ మెయిటింగ్ చేస్తూ ఉంటారు. అయితే అది ఏమీ తనకు వంట పట్టించుకోకుండా చాలా సింపుల్ గా జీవితం సాగిస్తూ కన్నడ మరియు దక్షిణ భారతదేశం ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే తన మరణ వార్త విన్న భారతదేశం చిత్ర పరిశ్రమ అతనితో ఉన్నా అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అలాగే తమిళం, తెలుగు లో ఉన్న స్టార్ హీరోలతో మంచి సంబంధాలను ఏర్పరుచుకున్నారు. అయితే ఈరోజు నందమూరి బాలకృష్ణ పునీత్ పార్థివ దేహాన్ని చూడటానికి బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి చేరుకున్నారు. అయితే అక్కడ విగతజీవిగా ఉన్న పునీత్ ను చూసి ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. సాయంత్రానికి తెలుగు పరిశ్రమ నుండి ఎన్టీఆర్, చిరంజీవి,రాణా లాంటి ప్రముఖులు పునీత్ అంతిమయాత్ర లో పాల్గొననున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, మోహన్ బాబు మరియు చాలామంది ఇది సినీ ప్రముఖులు పునీత్ మృతి పట్ల సంఘీభావం తెలిపారు.

ఆయన మృతి పట్ల కన్నడ రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛందంగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, బెంగళూరు వ్యాప్తంగా వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ మూడు రోజుల పాటు బంద్ ప్రకటించారు. పునీత్ కుమార్తె అమెరికాలో చదువుతున్న కారణంగా ఆమె ఈరోజు సాయంత్రానికి బెంగళూరు చేరుకొన్నది. నిన్నటి సాయంత్రం నుండి కంఠీరవ స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసి పోయింది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సినీ ప్రముఖులు అన్ని పార్టీలకు సంబంధించిన ప్రముఖులు పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.







Share:

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ఖరారు చేశారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు వైద్యులు.. పునీత్ రాజ్ కుమార్ జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని తెలపడంతో ఆయన్ను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ ఆరోగ్య పరిస్థితిపై కన్నడ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నాలుగు గంటల క్రితమే పునీత్ రాజ్ కుమార్ బజరంగీ-2 సినిమా సూపర్ హిట్ అయినందుకు చిత్రయూనిట్‏కు శుభాకాంక్షలు తెలిపారు. పునీత్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా విక్రమ్ ఆసుపత్రికి చేరుకోవడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.. సీనియర్ పోలీస్ అధికారులు ఆసుపత్రిని సందర్శిస్తున్నారు.. అలాగే పునీత్ రాజ్ కుమార్ నివాసానికి సైతం భద్రత కల్పించారు.. పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్ కుమార్తె నివేదిత.. పునీత్ కుటుంబ సభ్యులు.. క్రేజీ స్టార్ రవిచంద్రన్, నిర్మాతలు జయన్న, కేపీ శ్రీకాంత్ ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆసుపత్రికి చేరుకుని పునీత్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

పునీత్ రాజ్ కుమార్ వయస్సు 46 ఏళ్లు.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్.. యువరత్న సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పునీత్.



Share:

దేశ చరిత్రలో మొట్టమొదటిసారి పెట్రోల్ పై 7రూ , డీజిల్ పై 8రూ‌ ల బాదుడు

దేశ చరిత్రలో మొట్టమొదటిసారి పెట్రోల్ పై 7రూ , డీజిల్ పై 8రూ‌ ల బాదుడు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా ఫస్ట్ లాక్ డౌన్ తరువాత నుండి దేశంలో ఇంధనం రేట్లు ఆకాశానికి వెళ్తున్నాయి. అయితే గత నెల సెప్టెంబర్ 28 నుండి ఈనెల అక్టోబర్ 28 వరకు మొత్తం 24 సార్లు ఇంధనం రేట్లు పెరిగాయి. అందులో పెట్రోల్ పైన 7.11రూ  డీజల్ పైన 8.43రూ పెరిగాయి. దేశంలో ఒక్క నెలలో ఇన్ని సార్లు ఇంత మొత్తంలో ఇంధనం రేట్లు పెరగటం ఇదే మొదటిసారి. చమురు రేట్లు ఈ విధంగా పెరగటంతో నిత్యావసర ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇంధనం రేట్లకి అడ్డుకట్ట ఎప్పుడు వేస్తారు అని సామాన్యులు లబోదిబో మంటున్నారు.



Share:

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత 

https://chilakaluripetspeednews.blogspot.com/q


చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగి మన తెలుగు వారి స్థాయిని దేశం నలుమూలలా చాటి చెప్పే విధంగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలలో తన ఆలోచనలతో చాకచక్యంగా వాటిని అధిగమించిన మన IAS మైలవరపు కృష్ణ తేజ  మరో అరుదైన  ఘనత సాధించారు. కృష్ణ తేజకు ప్రతిష్ఠాత్మకం అయిన బుక్ ఆఫ్ అఛీవర్స్ నందు చోటు దక్కటం కృష్ణ తేజ కీర్తిని మరో స్థాయికి తీసుకువెళ్ళింది అని చెప్పాలి.  ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో IAS గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 ఆగష్టు నెలలో కేరళలో వచ్చిన వరదలలో మన కృష్ణ తేజ తన ఆలోచనలతో ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ నిర్వహించిన ఆపరేషన్ కుట్టనాడు ఆ రాష్ట్రం చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ సమయంలో కేరళలో కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను తన భుజాల పైన వేసుకొని ఎంతో చాకచక్యంగా ఆ ఆపరేషన్ పూర్తి చేసారు.లక్షల మంది జీవితాల గురించి అలోచించి నిర్ణయం తీసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. అంతటి క్రిటికల్ పరిస్థితులలో ఒక్క తప్పిదం జరిగినా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే వారు కానీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆనాడు చేపట్టిన ఆపరేషన్ కుట్టనాడు కి గాను బుక్ అఫ్ అఛీవర్స్ నందు మన కృష్ణ తేజకు చోటు దక్కింది. బుక్ అఫ్ అఛీవర్స్ అంటే అసాధ్యాన్ని సాధించిన అరుదైన వ్యక్తుల గురించి అందులో పంచుకుంటారు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన మన చిలకలూరిపేట ముద్దు బిడ్డ IAS మైలవరపు కృష్ణ తేజకు అభినందనలు తెలుపుకుంటున్నాము.  
అలాగే కరోనా వీరవిజృభిస్తున్న సమయంలో కూడా కేరళ ప్రభుత్వం మన కృష్ణ తేజ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి కరోనా కట్టడికి కృషి చేసారు. ఆ కమిటీకి పూర్తి బాధ్యత వ్యవహిరిస్తు తన ఆలోచనలతో నిర్ణయాలతో కరోనా తీవ్రతని తగ్గించారు. 

Book of Achievers 


కేరళలోని మన కృష్ణ తేజ ఆఫీస్ నందు పని చేసే ఉద్యోగి అయన గురించి ఏమి అన్నారో అయన మాటలలోనే 

మనం నిత్యం ఎంతో మంది అధికారుల అవినీతి గురించి వింటూనే వుంటాం.డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉద్యోగాల్లో చేరేవారు కొంతమంది అయితే, ప్రజలకు సేవచేయాలని వచ్చేవారు మరికొంతమంది. అలాంటి ఒక వ్యక్తి గురించి నేను విన్నది, చూసింది...........
  
    జీవితంలో కొంతమందిని కలసినందుకు గర్వ పడుతుంటాం.అలాంటి ఒక వ్యక్తి గురించి, ఈయన పేరు కృష్ణతేజ మైలవరపు.కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి.ప్రస్తుతం అల్లెప్పే సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.నేను అనుకోకుండా ఒక రోజు ఎన్నికల విధుల్లో బాగంగా అల్లెప్పేకి వెళ్ళటం జరిగింది.అప్పుడే ఈయన్ని కలిసే అదృష్టం దక్కింది.

    అదృష్టం అని ఎందుకు అంటున్నానంటే....

 🔹ప్రజలకు ఏదోకటి చేయాలనే సంకల్పం.
 🔹ఒక అధికారిగా పాలనలో తనదైన ముద్ర చూపించాలనే ఉత్సాహం.
 🔹 ఎదుటి మనిషితో నేను ఒక అధికారిని అనే గర్వం లేకుండా మాట్లాడే మనస్తత్వం, ఎదుటి               వారికి ఇచ్చే గౌరవం.
 🔹 సర్వీసులో చేరిన ముడేళ్లకే దేశ వ్యాప్తి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి.

         ఆయన గురించి అక్కడి ప్రజలు,అధికారులు చెప్పిన కొన్ని విషయాలు...........

 🔹 గతంలో వరదలు వచ్చిన సమయంలో కుట్టు నాడు ప్రాంతంలో వరద భీభత్సాన్నీ                            ముందుగానే ఊహించి ఆయన చేపట్టిన రేస్కూ ఆపరేషన్.
 🔹 కేవలం 48 గంటల్లో రెండున్నర లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం.
 🔹సమర్దవంతంగా శిబిరాల నిర్వహణ.
 🔹 తరువాత తిరిగి వారిని స్వస్థలాలకు తరలించంటం.
 🔹వరదల అనంతరం ఆయన చేపట్టిన  I AM FOR ALLEPPEY అనే కార్యక్రమం.
 🔹వరదల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు తిరిగి కొత్త ఇళ్లు ఇవ్వటం.
 🔹పిల్లల బడుల ఆధునికీకరణ, రక్షిత త్రాగునీరు ఏర్పాటు.
 🔹 ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి ఉపాధి కల్పించడం.
 🔹I AM FOR ALLEPPEY ద్వారా ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది.
 🔹 ఇంకా ఇటువంటివి మరెన్నో........... 

అంటూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. 










































Share:

చిలకలూరిపేటలో సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరావు గారి పర్యటన

చిలకలూరిపేటలో సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరావు గారి పర్యటన 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం నాడు సుప్రీం కోర్టు జెడ్జి లావు నాగేశ్వరావు గారు పర్యటించారు. పట్టణంలోని సుభాని నగర్ నందు ఉన్న లాహిరి పిల్లల హాస్పిటల్ నందు తేళ్ల సుబ్బారావు గారు ఏర్పాటు చేసిన చిన్న వేడుకలలో అయన పాల్గొన్నారు. లావు నాగేశ్వరావు గారి స్వగ్రామం పెదనందిపాడు కావటంతో చిలకలూరిపేటతో ఉన్న సంబంధాన్ని పంచుకున్నారు.నాగేశ్వరావు గారి పర్యటనతో ఆ ప్రాంతం అంతా పోలీస్ బందోబస్తుతో నిండిపోయింది. 
























































































Share:

ఒకపక్క ఫ్రీగా ఇస్తూ మరో పక్క వీర బాదుడు బాదుతున్న కేంద్రం

ఒకపక్క ఫ్రీగా ఇస్తూ మరో పక్క వీర బాదుడు బాదుతున్న కేంద్రం 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా కబళిస్తున్న సమయంలో ఫ్రీ వ్యాక్సిన్ ఓకేంత ఊరటనిచ్చినా , సామాన్యుల నడ్డి మాత్రం  విరక్కొట్టటం తప్పేలా లేదు. లీటర్ 75 రూపాయలు ఉండే పెట్రోల్ ధర ఈ రోజు 102 రూపాయలు అంటే సుమారు 27 రూపాయల బాదుడు. అంటే వారానికి సుమారు 4 సార్లు పెట్రోల్ కొట్టించినా సుమారు 100 రూపాయలు ప్రతి సామాన్యుడి నుండి వసూళ్లు చేస్తున్నట్లు. ఈ బాదుడు కన్నా వ్యాక్సిన్ ధర డైరెక్ట్ గా మార్కెట్లోకి వదిలినా 1000 రూపాయలు  అనుకుందాం. ఆ లెక్కన సామాన్యుడి జేబు చిల్లు పడుతున్న విషయం అర్ధం కావటం లేదు. ఫ్రీ సోర్స్ కి అలవాటుపడ్డ ప్రజలు వెనక జరుగుతున్నా పరిణామాల గురించి ఆలోచించటం లేదు. 

ప్రైవేట్ హాస్పిటళ్ళకు 25% వ్యాక్సిన్ ఇవ్వాలి అని మోడీ గారి నిర్ణయించుకున్నారు. ఇక్కడే ఉంది అసలు కధ చచ్చిన వారిపైన డబ్బులు ఏరుకునే ప్రైవేట్ వైద్యశాలల చేతిలో వ్యాక్సిన్ పెడితే బ్లాక్ మార్కెట్ దందా మాములుగా కొనసాగదు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో రెమిడీసీవర్ అనే ఇంజక్షన్ 2000 ఉంటే వాటి అన్నిటిని హోల్డ్ చేసి బ్లాక్ మార్కెట్ లో 40000( నలబై వేలు ) కు అమ్ముకున్న దాఖలాలు కోకొల్లలు.  అలాగే మంచి బ్రాండెడ్ వ్యాక్సీలకు రెక్కలొచ్చే టైం త్వరలోనే ఉంది. 
పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే కేవలం ఆయిల్ రేట్లు పెరిగినట్లు కాదు. ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయి , నిత్యావసరాల సరుకుల రవాణా పెరిగిపోయాయి, నిత్యావసరాల సరుకులకు రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగురుతాయి. అప్పుడు సామాన్యుడు ఆకులూ అలమలు తిని బ్రతకాలి. 


































Share:

దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న తొలి గ్రామం

దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న తొలి గ్రామం 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా వ్యాక్సిన్ అంటే ఆమడ దూరం పారిపోయే గ్రామా ప్రజలకు ఈ వార్త నిజంగా ఇన్సిప్రెషన్ అవ్వాలి. మన దేశంలోని జమ్మూకాశ్మిర్లో ఒక చిన్న గ్రామం బందిపూర్ జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేయిన్ గ్రామం. ఆ గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వెయ్యటం పూర్తి అయినది. ప్రతి రోజు వైద్య సిబ్బంది 18 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లి అందరి వ్యాక్సిన్ వెయ్యటం పూర్తి చేసారు. అలా దేశంలోనే తొలిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న ఊరుగా  వేయిన్ గ్రామం నిలిచింది 






















Share:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సతీమణి మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సతీమణి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


ఆంధ్రప్రదేశ్ - గుంటూరు జిల్లా నరసరావుపేట నుండి ముఖ్యమంత్రి మరియు కేంద్ర హోమ్ శాఖా మంత్రిగా చేసిన కాసు బ్రహ్మనందరెడ్డి సతీమణి అయిన కాసు రాఘవమ్మ (96) గారు ఆదివారం హైద్రాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె స్వస్థలం చిలకలూరిపేట నియోజవర్గం అయిన నాదెండ్ల మండలం. ఆమె మరణ వార్త తెలుసుకున్న మండల ప్రజలు ఆమెకు సంతాపం తెలిపారు. అలాగే రాజకీయ నాయకులూ, ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలిపారు 

















Share:

ఏపీ లో సెంచరి కొట్టిన పెట్రోల్ ధర

ఏపీ లో సెంచరి కొట్టిన పెట్రోల్ ధర 

https://chilakaluripetspeednews.blogspot.com/

గత కొన్ని రోజుల క్రితం దేశంలో ఎన్నికలు ముగిసిన తరువాత నుండి పెట్రోల్ రేట్ మోత మోగించటం మళ్లీ మొదలైంది. ప్రస్తుత సమాజంలో మోటార్ వెహికల్ ఉండటం సాదాసీదాగా అయిపోయింది. అయితే దిగువ మధ్య తరగతి కుటుంబాలు కూడా మినిమం టూ వీలర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ పెట్రోల్ భారం సామాన్యు ప్రజలు మోయలేనిదే అని చెప్పొచ్చు. వారి సంపాదనలో 20% &30% పెట్రోల్ ఖర్చు చేస్తే వారి జీవితం ఎలా సాగుతుందో అర్ధంకావటం లేదు. 
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పెంచటం వలన వచ్చే డబ్బులతో కరోనా ప్యాకేజీలు, టీకాలు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. అటు టీకాలు సమయానికి దొరక్క , పెట్రోల్ బాదుడు సామాన్య ప్రజలకు సర్కారు పైన  విశ్వాసం తగ్గుతుంది అని చెప్పుతున్నారు ప్రతిపక్షాలు. 

ఈ రోజు విజయవాడ పెట్రోల్ రేట్ :- 100.48 , డీజిల్ :- 94.76

డీజిల్ రేట్లు పెరిగితే రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోతున్నాయి. 
ఈ పెట్రోల్ ,డీజిల్ రేట్లు పెరుగుదలతో సామాన్యు ప్రజలు చుక్కలు చూస్తున్నారు. 




































Share:

చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు

చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ముందుగా చిలకలూరిపేట ముస్లిం సోదరులకు చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ తరుపున రంజాన్ శుభాకాంక్షలు. అలాగే పట్టణములోని ముఖ్య నాయకులూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. MLA విడదల రజని గారు, ప్రతిపక్షనేత మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.అలాగే రంజాన్ విశిష్టత తెలియజేసారు. 
ఈ రంజాన్ పండుగ నుండి కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టి ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అని అల్లా ని కోరుకుందాం. ప్రార్ధన సమయాలలో మాస్క్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం. 


































Share:

ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే

ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే  

https://chilakaluripetspeednews.blogspot.com/
గూగుల్ పే ప్రస్తుత పరిస్థితులలో డిజిటల్ పేమెంట్స్ తెలియనివారు ఉండరు. ఫోన్ పే , గూగుల్ పే బ్యాంకు ట్రాన్సక్షన్ మరింత సులభతరం చేసాయి. బ్యాంకులకు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించటం  వలన సమయము కలిసి రావడంతో ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ మొగ్గు చూపుతున్నారు. పల్లెలు, పట్టణాలు,గ్రామాలూ అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్క చోట బడ్డీ కొట్టు నుండి పెద్ద పెద్ద మాల్స్ వరకు కూడా చాలా వరకు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి.     
అయితే డిజిటల్ పేమెంట్ ఆల్ఫాబెట్ కంపెనీ కి సంబంధించిన  గూగుల్ పే ఇప్పుడొక శుభవార్త తెలిపింది. త్వరలో అంతర్జాతీయ పేమెంట్స్ కి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి అమెరికా నుండి పేమెంట్స్ పంపుకోవటానికి వీలుగా ఎర్పాట్లు చేస్తున్నాము అని , అయితే అమెరికాలో కూడా గూగుల్ పే వాడే వారికి  మాత్రమే ఈ అవకాశం అని. త్వరలోనే అన్ని దేశాలలో ఈ ఫీచర్ని తీసుకువస్తాము అని తెలిపింది. 
గూగుల్ పే తీసుకున్న నిర్ణయానికి ఫోన్ పే ఎలా రెస్పాండ్ అవుతుందో చూదాం.  







































Share:

సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు

సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో "ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్" ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షులు ఆంజనేయులు గారు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం నుండి జిల్లాలోని అన్ని వ్యాపారులు తమ దుకాణాలను ఉదయం 9 గంటల నుండి  సాయంతం 6 గంటల వరకే తెరచి ఉంచాలి అని నిర్ణయించారు. ప్రతి ఒక్క షాప్ నందు నో మాస్క్ బోర్డు పెట్టాలి అని తెలిపారు. సోమవారం నుండి కఠినంగా అమలు చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు.  
















 
Share:

చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు

చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు

https://chilakaluripetspeednews.blogspot.com/
 

రంజాన్ నెల ప్రారంభమైన సంగతి అందరికి తెలిసినదే. అయితే కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అందరూ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. రంజాన్ మాసం లో ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష పాటిస్తారు కావున వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే సందేహంలో ఉంటున్నారు. ఈ సందేహాలకు తెర దించుతూ ముస్లిం మత పెద్దలు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. వ్యాక్సిన్ పొట్టలోకి కాకుండా రక్తనాళాల్లో కి వెళ్తుంది కాబట్టి ఉపవాస దీక్ష భగ్నం కాదని నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. అందువలన మన పేట మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదరులకు ఈ విషయాన్ని చేరవేయండి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందువలన ప్రార్ధనలో పాల్గొనే ముందు మాస్క్ ధరించి, శానిటైజర్ వాడండి.   













Share:

అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!!

 అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!! 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణములో కరోనా కేసుల వివరాలు నిజమైనవేన అంటే కాదు అని చెప్పాలి. ఎందుకు అంటే ఒకప్పుడు కరోనా టెస్టులు ఎక్కడ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ లోనో లేక రజక కాలనీ లోని ఆరోగ్య కేంద్రం లోనో లేక పద్మా సాలిపేట డిస్పెన్సరీ నందు అని చెప్పేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి అసలు లేదు ఎక్కడ టెస్టులు చేస్తున్నారో కూడా సరిఅయిన ఇన్ఫర్మేషన్ లేదు. కరోనా అనుమానం ఉన్నవారు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ నందు టెస్టులు చేపించుకుంటున్నారు. అసలు అవన్నీ లెక్కలోకి వస్తాయా అంటే అదీలేదు. కానీ మనకి మాత్రం ఒక్కటి తెలుసు ఏదో ఒక న్యూస్ వెబ్సైట్స్ లో పేటలో అన్ని కేసులు, ఇన్ని కేసులకు అని లేదా ఎవరో ఒకరు ఆ న్యూస్ ని వాట్సాప్ స్టేటస్ గా   పెడితే తెలుసుకుంటున్నాం. పేట లో ఏ వీధి లో వెతికిన వీధికి ఇద్దరు చొప్పున హోమ్ కోరంటైన్ లో ఉంటున్నట్లు సమాచారం. ఇవ్వని తెలియకుండా పేటలో 9 కేసులు వచ్చాయిట , 20 వచ్చాయట అని మాస్కలు వేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతూ కరోనా వాహకాలుగా మారుతున్నారు ప్రజలు. 

ఆక్సిజెన్ అంధక చనిపోయారు పాపం, ఇంటి మొత్తానికి ఒకడే అబ్బాయి కరోనా వలన చనిపోయాడు అనే మాటలు చెప్పుకుంటూ బాధపడతాం కానీ ఎవ్వరు సరిగ్గా కరోనా నియమాలు పాటించటంలేదు.మీరు ఈ రోజు మాస్క్ లేకుండా మీరు తిరిగితే ఒకరి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. రెండు సంవత్సరాలో విద్య దూరం అయ్యారు విద్యార్థులు. సరిగ్గా జాబ్ కి వెళ్లే సమయానికి ఈ రెండు సంవత్సరాల విలువ అప్పుడు వారికీ  అర్ధం అవుతుంది వారికీ. దయచేసి మనం మన చిలకలూరిపేటని కరోనా ఫ్రీ గా మార్చుకోవటానికి కృషి చేయాలి. దేశం మొత్తం లాక్ డౌన్ పెట్టిన మన పేట లో మాత్రం కరోనా జోన్ లేని ఊరుగా తయారు చేసి బాధ్యత మన అందరిపైనా ఉంది.     









Share:

చిలకలూరిపేట పట్టణ ప్రజలకు ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు

చిలకలూరిపేట పట్టణ ప్రజలకు ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు 


https://chilakaluripetspeednews.blogspot.com/
https://chilakaluripetspeednews.blogspot.com/

ఈ రోజు కొత్త సంవత్సర శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు. నిన్న సౌదీ అరేబియా నందు రంజాన్ నెలవంక కనిపించింది. దీనితో  ముస్లింలకు పవిత్ర రంజాన్ నెల ప్రారంభం కానున్నది.




 

Share:

T20 సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ - కురాళ్ళు కుమ్మేసారు

 T20 సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ - కురాళ్ళు కుమ్మేసారు 



36 రన్స్ తో సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ . 5వ T20 లో మన భారత జట్టు చెలరేగిపోయారు . తొలుత బాటింగ్ కి దిగిన భారత్ 20 ఓవర్లకి  224 పరుగులకి 2 వికెట్స్ కోల్పోయినది . రన్స్ మిషన్ (80*) , రోహిత్ 64, పాండ్య 39*, సూర్య 32 తో చెలరేగిపోయారు . లక్షచేధనలో భాగంగా ఇంగ్లీష్ జట్టు లో బట్లర్ 52, మలన్ 68 తో  రెచ్చిపోయారు . కానీ భువి , శార్దూల్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు . చివరకు 20 ఓవర్లకు 188 రన్స్ 8 వికెట్స్ కొలిపోయి భారత్ విజయానికి చేరువ అయినది 


Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.