చిలకలూరిపేట :- బైక్ పై నుండి లారీ క్రింద పడి మహిళ మృతి
చిలకలూరిపేట - కోటప్పకొండ మార్గంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. సేకరించిన వివరాల మేరకు చిలకలూరిపేట మండలంలోని కట్టుబడివారిపాలెం యూటీకి చెందిన కామకూరి అనంతలక్ష్మి(50) తన కుమార్తె విజయదుర్గకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రత్తిపాడు మండలం యనమదలలోని కుమార్తె వద్ద ఉంటోంది. శనివారం డ్వాక్రా పని ఉండటంతో అల్లుడు భలే వెంకటేశ్వర్లు ద్విచక్రవాహనంపై యూటీ వస్తోంది. పురుషోత్తమపట్నం బొడ్డురాయి వద్ద ముందు వెళుతున్న లారీని క్రాస్ చేయబోతున్న సమయంలో అనంతలక్ష్మి ద్విచక్రవాహనం పై నుంచి జారి లారీ కింద పడింది. దీనితో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతలక్ష్మి పుట్టిన ఊరు పురుషోత్తమపట్నం. యూటీకి చెందిన అచ్చిబాబుతో ఆమె వివాహం జరిగింది. పుట్టిన ఊరులోనే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రెండు గ్రామాలలోని ఆమె కుటుంబ సభ్యుల ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి.