లండన్ లో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మన తెలుగు కృష్ణ తేజం
గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన IAS మైలవరపు కృష్ణ తేజ అవార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా లండన్ హై స్పీడ్ డైవర్సిటీ కార్యక్రమంలో మన కృష్ణతేజకు అవార్డుని అందజేశారు. ప్రస్తుతం కేరళ టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. కేరళలో "అయమానం" గ్రామీణ పర్యాటక ప్రాజెక్టుకు (WTM) 'వరల్డ్ ట్రావెల్ మార్కెట్' అవార్డు లభించింది. కేరళ లో పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి ఈ మిషన్ అయమనం ప్రాజెక్టుకు అవార్డు దక్కడంతో కేరళ పర్యాటక శాఖ అధికారి మహమ్మద్ రియాజ్ ఆనందం వ్యక్తం చేశారు. కోవిడ్ తర్వాత పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ఈ అవార్డు తమ రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అలాగే కృష్ణ తేజ పదునైన ఆలోచనలను అవలంబించడం వలన ఇలాంటి అవార్డులు తమకు దక్కాయని వారు తెలిపారు. కృష్ణ తేజ తనకు అప్పగించిన బాధ్యతలను తన ఆలోచనలను కలుపుకొని సంపూర్ణంగా నిర్వహించడం వలన ఈ యొక్క అవార్డే కాదు గతంలోనూ పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. కేరళలో వరదలు మొదలుకొని & కోవిడ్ నియంత్రణను చర్యలను చేపట్టడంలో మైలవరపు కృష్ణ తేజ తనకు తానే సాటి అని - ఈనాడు లండన్లో ఈ అవార్డును అందుకోవడంతో మరోసారి మన తెలుగువారి ఘనతను విదేశాల్లో కూడా చాటిచెప్పారు. ఇలాంటి అవార్డులు మరెన్నో పొంది తెలుగువారి కీర్తిని దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల తెలియజేయాలని కోరుకుంటూ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్