ప్రజా సంకల్పం పాదయాత్ర ప్రారంభించి నేటికీ 4 సంవత్సరాలు అయిన సందర్భంగా పేట YSRCP ఆధ్వర్యంలో వేడుకలు - అనంతరం ర్యాలీ
CM జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికీ 4 సంవత్సరాలు అయిన సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో ఎమ్మెల్యే విడుదల రజిని ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ నిర్వహించి, అనంతరం పార్టీ శ్రేణులతో ర్యాలీని నిర్వహించారు. పార్టీ కార్యకర్తలతో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రజిని హీరో షోరూం ఎదురుగా ఉన్న వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు.