దేశంలో ఆక్సిజెన్ నిల్వలు లేక కరోనా రోగులు చనిపోతుంటే - ఎగుమతులు శాతం మాత్రం రేటింపుగా ఉంది.
దేశంలో ఆక్సిజెన్ నిల్వలు లేక కరోనా రోగులు చనిపోతుంటే - ఎగుమతులు శాతం మాత్రం రేటింపుగా ఉంది.
భారతదేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న, ప్రజలు ఆక్సిజన్ నిల్వలు లేక రోగులకు ఆక్సిజన్ సరిపోక ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన లెక్కల ప్రకారం 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలలో ఏకంగా 9300 మెట్రిక్ టన్నుల ఆక్సిజెన్ విదేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది రెండింతలకన్నా ఎక్కువ. వీటిలో చాలా వరకు మన చుట్టుపక్క దేశాలకు ముఖ్యంగా బంగ్లాదేశ్ కు ఎగుమతి చేసినట్లు తెలిపారు. ముందు దేశ ప్రజల ఆరోగ్యం ముఖ్యం అని దేశ ప్రజలు వాపోతున్నారు.
చిలకలూరిపేటలో కరోనా వలన మరొకరు మృతి
చిలకలూరిపేటలో కరోనా వలన మరొకరు మృతి
చిలకలూరిపేటలో కరోనా కేసులు మాత్రమే కాదు మృతులు కూడా పెరుగుతున్నారు. ఈ రోజు పట్టణంలోని స్థానికంగా ఎన్ ఆర్ టి సెంటర్లోని ఒక అపార్టుమెంట్ నందు నివాసం ఉంటున్న పొన్నూరు గణపతి (61) కరొనతో మృతి చెందారు. గత కొన్ని రోజులగా కరొనా తో గుంటూరు లోని ప్రముఖ హాస్పిటల్ నందు చికిత్స తీసుకుంటూ ఈ రోజు మృతి చెందారు.
గత కొన్ని రోజులగా ఇద్దరు పాస్టర్లు, యంగ్ గోల్డ్ వ్యాపారి, ఇప్పుడు ఇంకొకరు మృతి చెందటంతో పట్టణంలో ప్రజలు బయాందోనలో ఉన్నారు.
కరోనా రాకుండా ఉండాలి అంటే 1 సరిపోదు 2 మాస్కులు వాడాలి
కరోనా రాకుండా ఉండాలి అంటే 1 సరిపోదు 2 మాస్కులు వాడాలి
దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్న క్రమంలో ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా ఆసక్తి విషయాలు పంచుకున్నారు. దేశంలో కరోనా ఉదృతి ఆపాలి అంటే మాస్క్ వాడాలి అని. అది కూడా ఒక మాస్క్ సరిపోదు అని 2 మాస్కులు వాడాలి అని తెలిపారు. క్లాత్, సర్జికల్ మాస్క్ వాడేవారు 2 ఖచ్చితంగా వాడాలి అని తెలిపారు.