మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp
Showing posts with label చిలకలూరిపేట న్యూస్. Show all posts
Showing posts with label చిలకలూరిపేట న్యూస్. Show all posts

చిలకలూరిపేట: దీపావళి టపాసుల హోల్ సేల్ షాపులలో తనిఖీలు - రాత్రి 10 లోపు మాత్రమే బాణసంచా కాల్చలి - DSP

చిలకలూరిపేట: దీపావళి టపాసుల హోల్ సేల్ షాపులలో తనిఖీలు - రాత్రి 10 లోపు మాత్రమే బాణసంచా కాల్చలి - DSP

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణ పరిధిలోని దీపావళి బాణాసంచా హోల్ సేల్ దుకాణాలలో డి.ఎస్.పి విజయ భాస్కర్ తనిఖీలు నిర్వహించారు. వీటితో పాటు రూరల్ సీఐ సుబ్బారావు పాల్గొన్నారు. హోల్ సేల్ దుకాణాలలో తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా ! షాపు లైసెన్సులు, అత్యవసర అగ్నిమాపక సహాయక చర్యలను పరిశీలించారు. దుకాణదారులకు షాపులు చుట్టుపక్కల ఫైర్ యాక్టివిటీలు, ధూమపానం చేయకుండా చర్యలు తీసుకోవాలని అని ఆయన తెలిపారు. అలాగే దీపావళి బాణాసంచా కాల్చె సమయంలో చిన్నపిల్లలను జాగ్రత్తగా కలుసుకోవాలని, రాత్రి 10 గంటల లోపు మాత్రమే బాణసంచా కాల్చాలని ఆయన తెలిపారు.



Share:

లండన్ లో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మన తెలుగు కృష్ణ తేజం

లండన్ లో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మన తెలుగు కృష్ణ తేజం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన IAS మైలవరపు కృష్ణ తేజ అవార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా లండన్ హై స్పీడ్ డైవర్సిటీ కార్యక్రమంలో  మన కృష్ణతేజకు అవార్డుని అందజేశారు. ప్రస్తుతం కేరళ టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. కేరళలో "అయమానం" గ్రామీణ పర్యాటక ప్రాజెక్టుకు (WTM) 'వరల్డ్ ట్రావెల్ మార్కెట్' అవార్డు లభించింది. కేరళ లో పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి ఈ మిషన్ అయమనం ప్రాజెక్టుకు అవార్డు దక్కడంతో కేరళ పర్యాటక శాఖ అధికారి మహమ్మద్ రియాజ్ ఆనందం వ్యక్తం చేశారు. కోవిడ్ తర్వాత పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ఈ అవార్డు తమ రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అలాగే కృష్ణ తేజ పదునైన ఆలోచనలను అవలంబించడం వలన ఇలాంటి అవార్డులు తమకు దక్కాయని వారు తెలిపారు. కృష్ణ తేజ తనకు అప్పగించిన బాధ్యతలను తన ఆలోచనలను కలుపుకొని సంపూర్ణంగా నిర్వహించడం వలన ఈ యొక్క అవార్డే కాదు గతంలోనూ పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. కేరళలో వరదలు మొదలుకొని & కోవిడ్ నియంత్రణను చర్యలను చేపట్టడంలో మైలవరపు కృష్ణ తేజ తనకు తానే సాటి అని - ఈనాడు లండన్లో ఈ అవార్డును అందుకోవడంతో మరోసారి మన తెలుగువారి ఘనతను విదేశాల్లో కూడా చాటిచెప్పారు. ఇలాంటి అవార్డులు మరెన్నో పొంది తెలుగువారి కీర్తిని దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల తెలియజేయాలని కోరుకుంటూ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



Share:

MLA ఆధ్వర్యంలో వైద్యులకు సత్కారం - కరోన మృతుల కుటుంబాలకు 50,000 - ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం - కలెక్టర్ వివేక్ యాదవ్

MLA ఆధ్వర్యంలో వైద్యులకు సత్కారం - కరోన మృతుల కుటుంబాలకు 50,000 - ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం - కలెక్టర్ వివేక్ యాదవ్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు కరోన విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కోవిడ్ రోగులకు చికిత్స అందించిన డాక్టర్లకు  MLA విడుదల రజిని ఆధ్వర్యంలో ఘన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ :-

కోవిడ్ సమయంలో ఎనలేని సేవలందించిన డాక్టర్లకు సత్కారం చేయటం మంచి ఆలోచన అని ముఖ్యంగా సెకండ్ వేవ్ నందు కొత్త వైద్య సిబ్బందిని, తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు ఏర్పాటు చేశామని. అలాగే ప్రభుత్వం కోవిడ్ రోగులకు ఉచితంగా వైద్య సదుపాయాలను అందించిందని. అలాగే కోవిడ్ టీకాలను అందించామని ఆయన తెలిపారు. కోవిడ్ వలన చనిపోయిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయలను అందించమని వెంటనే మీ సమీప ANMలను సంప్రదించాలని అని ఆయన తెలిపారు. కోవిడ్ వలన చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఇంకొక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఆదేశించారని ఆయన తెలిపారు.

MLA మాట్లాడుతూ :-

MLA విడుదల రజనీ మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ & కొరత బెడ్లు కొరత లేకుండా చేశామని -  క్లిష్ట సమయాల్లో కలెక్టర్ గారిని సంప్రదించగా వెంటనే అన్ని సమకూర్చారని ఆమె తెలిపారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఉచితంగా బియ్యం & ఆర్థిక సాయం అందజేశామని ఆమె గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా మన రాష్ట్రంలో ప్రవేటు ఆసుపత్రులకు దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ పని చేశాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేషిరెడ్డి, క‌మిష‌న‌ర్ ర‌వీంద్ర‌,తహసీల్దార్ సుజాత,సురేష్ నాయక్,డిప్యూటీ డి.యం.హెచ్.ఓ,వైద్యులు గోపినాయ‌క్,లక్ష్మ నాయక్,సోమల నాయక్,కీర్తి,రాజేష్,శ్యాంసోన్. ప్రియాంక,భాగ్యలక్ష్మి,సీనియర్ డాక్టర్స్ కొల్లా అమర్,కొమ్మినేని వీరశంకరరావు, మక్కెన వంశీ, గరికపాటి వరలక్ష్మి,కందిమల్ల వాసు, వెల్లటూరి పెద్దబ్బాయి,రామకృష్ణ,మునిసిపల్ చైర్మన్ షేక్ రఫాని,వైస్ చైర్మన్లు కొలిశెట్టి శ్రీనివాసరావు, వలేటి వెంకటేశ్వర్లు,మార్కెట్ యార్డ్ చైర్మన్ మద్దిరాల విశ్వనాధం,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్, ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు, జడ్పీటీసీలు కాట్రగడ్డ మస్తాన్ రావు,ముక్తా వాసు,కోడె సుధారాణి,ఎంపీపీ లు దేవినేని శంకరరావు, పిడతల ఘాన్సీ,తలతోటి రాణి,నాదెండ్ల మండల అధ్యక్షుడు గొంటు శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి,విడదల గోపి, తులం సుధాకర్,పిల్లి సాగర్,షేక్ ఆదం వలి, చేమిటిగంటి పార్వతి,చింతపల్లి విల్సన్,షేక్ మీరాబి, షేక్ జమీలా, పుల్లగూర అనురాధ,నాయబ్ సైదాబి,షేక్ నసీమా బేగం,చెంబేటీ భారతి,అన్నపురెడ్డి శ్రీలక్ష్మి,ములకలూరి బాజి మున్నీ,యూసుబ్, షేక్ ఖాజా భాను,కొచ్చెర్ల విజయలక్ష్మి, బిట్రా రాజేంద్ర,వడితే కోట నాయక్,రమణి బాయ్, కో ఆప్షన్ సభ్యులు పొలిశెట్టి మస్తాన్,బక్షు మేస్ట్రీ,మరియు పలువురు ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,మరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



Share:

చిలకలూరిపేట:- లారీ బోల్తా - ఇద్దరికి తీవ్రగాయాలు

చిలకలూరిపేట:- లారీ బోల్తా - ఇద్దరికి తీవ్రగాయాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- చిలకలూరిపేట మండలం పరిధిలోని లింగంగుంట్ల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం - ఇద్దరికి గాయాలయ్యాయ.

వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి గుంటూరు ప్రత్తి లోడుతో లారీ వస్తోంది.  లారీ డ్రైవర్ విశ్రాంతి తీసుకోవడంతో.... ఆ  సమయంలో క్లీనర్ డ్రైవ్ చేస్తూ ఉండగా అదుపుతప్పి బోల్తా పడింది. లారీ డ్రైవర్ నాగిరెడ్డి తలకుతీవ్ర గాయాలు అయ్యాయి. ఇతనిది కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్ద పాసపుల్ల గ్రామం. లారీ క్లీనర్ జమాల్ బాషాకు స్వల్పగాయాలయ్యాయి. ఇతనిది కడప జిల్లా జమ్మలమడుగు. తెల్లవారు జాము 4 గంటల 30 నిమిషాల సమయంలో ఈ సంఘటన జరిగింది.. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం లారీ డ్రైవర్ నాగిరెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు.



Share:

చిలకలూరిపేట :- బైక్ పై నుండి లారీ క్రింద పడి మహిళ మృతి

చిలకలూరిపేట :- బైక్ పై నుండి లారీ క్రింద పడి మహిళ మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిల‌క‌లూరిపేట - కోట‌ప్ప‌కొండ మార్గంలో శ‌నివారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళ మృతి చెందింది. సేక‌రించిన వివ‌రాల మేర‌కు చిల‌క‌లూరిపేట మండ‌లంలోని క‌ట్టుబ‌డివారిపాలెం యూటీకి చెందిన కామ‌కూరి అనంత‌ల‌క్ష్మి(50) త‌న కుమార్తె విజ‌య‌దుర్గ‌కు ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో ప్ర‌త్తిపాడు మండ‌లం య‌న‌మ‌ద‌ల‌లోని కుమార్తె వ‌ద్ద ఉంటోంది. శ‌నివారం డ్వాక్రా ప‌ని ఉండ‌టంతో అల్లుడు భ‌లే వెంక‌టేశ్వ‌ర్లు ద్విచ‌క్ర‌వాహ‌నంపై యూటీ వ‌స్తోంది. పురుషోత్త‌మ‌ప‌ట్నం బొడ్డురాయి వ‌ద్ద  ముందు వెళుతున్న లారీని క్రాస్ చేయ‌బోతున్న స‌మ‌యంలో అనంత‌ల‌క్ష్మి ద్విచ‌క్ర‌వాహ‌నం పై నుంచి జారి లారీ కింద ప‌డింది. దీనితో ఆమె అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. అనంత‌ల‌క్ష్మి పుట్టిన ఊరు పురుషోత్త‌మ‌ప‌ట్నం. యూటీకి చెందిన అచ్చిబాబుతో ఆమె వివాహం జ‌రిగింది. పుట్టిన ఊరులోనే రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో రెండు గ్రామాల‌లోని ఆమె కుటుంబ స‌భ్యుల ఇళ్ల‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.


Share:

చిలకలూరిపేట:- భార్య పుట్టింటికి వెళ్ళింది అని మనస్తాపంతో భర్త ఆత్మహత్య

చిలకలూరిపేట:- భార్య పుట్టింటికి వెళ్ళింది అని మనస్తాపంతో భర్త ఆత్మహత్య

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి గ్రామం నందు భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది అన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య - వివరాల్లోకి వెళితే బొప్పూడి గ్రామంలోని ఖాదర్ మస్తాన్ అనే వ్యక్తి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతను మద్యానికి బానిసై ప్రతిరోజు భార్యతో గోడవ పడుతూ కొట్లాటలు జరుగుతుంటాయి. వేధింపులకు భరించలేని భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురైన ఖాదర్ మస్తాన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడకు చేరుకొని మస్తాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి చేయి దాటడంతో వారు గుంటూరు ఆస్పత్రికి తరలించారు చివరికి చికిత్స పొందుతూ గురువారం నాడు మృతి చెందాడు.



Share:

చిలకలూరిపేట - పట్టణంలో ఆపరేషన్ జీరో వేస్టేజ్ - ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ / డ్రై డే - ఫ్రైడే

చిలకలూరిపేట - పట్టణంలో ఆపరేషన్ జీరో వేస్టేజ్ - ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ / డ్రై డే - ఫ్రైడే 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ మరియు చైర్పర్సన్ ఆదేశాల మేరకు స్వచ్ఛ చిలకలూరిపేట సాధించాలని ప్రతిరోజు ఒక వార్డుని ఎంచుకొని వార్డు పరిసరాలలో చెత్తాచెదారం, పాడుబడ్డ బావులు, డ్రైనేజీ కాలువలు, మురికి కాల్వలను, క్లీన్ చేయడం కోసం ప్రత్యేక డ్రైవ్ ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలోని ప్రజలందరూ కచ్చితంగా డ్రై డే - ఫ్రైడే పాటించాలని కోరారు. ఇళ్లల్లో నీరు నిల్వ ఉంచే ప్రదేశాలను వారానికి ఒకరోజు పొడిగా ఉంచాలని వారు కోరారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం కోసం ఇల్లల్లో ఉండే చెత్తను పరిసరాలలో వేయకుండా మున్సిపాలిటీ చెత్త వాహనాలను ఉపయోగించుకోవాలని అని కోరారు. అలాగే డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పుర ప్రజలందరూ సహకరించాలని కోరారు. వార్డులోని పాడుపడ్డ బావులను శుభ్రపరిచి అందులో గంబూష చేపలను ఏర్పాటు చేసి దోమల బెడద లేకుండా చేస్తామని అని వారు తెలిపారు. ఈ చేపల వలన దోమల లార్వా ను (గుడ్డు) అది తిని వేస్తుందని. తద్వారా దోమల వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చని వారు తెలిపారు.

             * VIDEO*



Share:

చిలకలూరిపేట పట్టణంలో వ్యభిచారం గుట్టురట్టు

చిలకలూరిపేట పట్టణంలో వ్యభిచారం గుట్టురట్టు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్యతోటలోని సచివాయం ప్రక్కనే అనుకోని ఉన్నఇంట్లో వ్యభిచారం జరుగుతుంది అనే సమాచారంతో టౌన్ SI నరసదాసు వ్యభిచారం గుట్టు రట్టు చేసారు. పోలీసులు రంగప్రవేశం చెయ్యటంతో ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు విషయం తెలుసుకుకొని అవాక్కయ్యారు. చిలకలూరిపేటలోనే సుబ్బయ్యతోటలో ఇలాంటి సంఘటనలు జరగటం గతం ఎప్పుడు ఇలా జరగలేదు అని వాపోయారు. ప్రశాంతంగా ఎటువంటి హడావిడి లేకుండా ఫ్యామిలీస్ ఉంటే ఇలాంటి ప్రాంతంలో ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు వారు ఎటువంటి వారో తెలుసుకొని ఇవ్వాలి అని ఆ ప్రాంతం వాసులు చర్చించుకుంటున్నారు. పోలీస్ వారు అరెస్ట్ చేసిన వారిలో నలుగురు పురుషులు, నిర్వాహకురాలితో కలిపి 3 మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. మహిళలలో ఇద్దరిది చిలకలూరిపేట కాగా ఒక మహిళది గుంటూరు, అలాగే నలుగురి పురుషులలో ముగ్గురిది చిలకలూరిపేట కాగా మరొకరిది నరసరావుపేట గా గుర్తించారు.   


































Share:

చిలకలూరిపేట - జాబ్ క్యాలెండర్ వ్యతిరేకంగా మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన బీజేపీ జిల్లా జనరల్ సెకరేటరీ పులుగుజ్జు మహేష్ ముందస్తు అరెస్ట్

 చిలకలూరిపేట - జాబ్ క్యాలెండర్ వ్యతిరేకంగా మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన బీజేపీ జిల్లా జనరల్ సెకరేటరీ పులుగుజ్జు మహేష్ ముందస్తు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట -  రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండరు కు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు కేతినేని సురేంద్ర మోహన్ ఆదేశానుసారం రాష్ట్రంలోని మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి పులుపునిచ్చారు. అయితే మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన జిల్లా జనరల్ సేకరేటరీ పులుగుజ్జు మహేష్ తో పాటుగా, చిలకలూరిపేట టౌన్ ప్రెసిడెంట్ నందిగం రాజుని చిలకలూరిపేట పోలీస్ వారు ఆదివారం రాత్రి సమయంలో వారి ఇంటి వద్ద అరెస్ట్ చేసి నిర్బంధించారు. పులుగుజ్జు మహేష్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండరును రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్లో 2,40,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చెయ్యాలి అని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోయాయి ఇంకొకరిపైనా ఆధారపడి జీవిస్తున్నారు అని, జగన్ ప్రభుత్వం నిరుద్యోగుల యువకులలో విశ్వసనీయత కోల్పోతుంది అని తెలిపారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/


https://chilakaluripetspeednews.blogspot.com/























Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 27-06-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 27-06-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 3 కేసులు నమోదు అయ్యాయి 

NRT సెంటర్లో - 1

గండిపేట లో - 1

వెంకటరెడ్డి నగర్ లో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి 

వేలూరు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి. 







































Share:

చిలకలూరిపేట మార్కెట్ సెంటర్లో పూల వ్యాపారం చేసుకునే వ్యక్తి శానిటైజర్ తాగి మృతి

చిలకలూరిపేట మార్కెట్ సెంటర్లో పూల వ్యాపారం చేసుకునే వ్యక్తి  శానిటైజర్ తాగి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - శానిటైజర్ తాగి మృతి చెందిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలో బెల్లంకొండ వాసు అనే యువకుడు మార్కెట్ సెంటర్లోని మైదానంలో పూలు అమ్ముకుంటూ బాబుగారి తోటలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. సదరు యువకుడు దీర్ఘకాళికా వ్యాధితో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసైన ఆ యువకుడి భార్య అతనిని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎవరు పట్టించుకునే వారు లేక సరిగ్గా ఇంటికి రాకుండా పూర్తిగా మద్యానికి బానిసై 21వ తారీఖున సాయంత్రం సమయంలో మద్యం కొనుక్కోవడానికి డబ్బులు లేక శానిటైజర్ కొనుక్కొని తాగాడు. సదరు యువకుడు తీవ్ర అస్వస్తతకు గురి అవ్వటంతో అతనిని గుంటూరు GGH కి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. 





































Share:

చిలకలూరిపేటలో గత వారం రోజులలో 9.2 % పాజిటివిటీ రేటు - చిలకలూరిపేటను రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాం - కమిష్నర్

చిలకలూరిపేటలో గత వారం రోజులలో 9.2 % పాజిటివిటీ రేటు - చిలకలూరిపేటను రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాం - కమిష్నర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో శనివారం రోజున మునిసిపల్ కౌన్సిల్ హాలు నందు  శానిటరీ మేస్త్రులు, సేకరేటరీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మునిసిపల్ కమిష్నర్ రవీంద్ర గారు మాట్లాడుతూ పట్టణంలో గత వారం రోజుల కరోనా రిపోట్స్ చూసుకునట్లు అయితే పోజిటివిటీ రేట్ 9.2 % మించి ఉండటంతో పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాము అని అయన తెలిపారు. అలాగే పట్టణంలోని వర్తక వ్యాపారాలు, చిల్లరకొట్టు వ్యాపారాలు కరోనా టెస్టులు చేపించుకునేలా చర్యలు తీసుకోవాలి అని. అలాగే సాయంత్రం 6 గంటల తరవాత వ్యాపారాలు పూర్తిగా ఆపివెయ్యాలి అని,లేనిచో అపరాధ రుసుము వసూళ్లు చెయ్యాలి అని అయన తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్క్ లు తప్పని సరిగా వాడాలి అని అయన తెలిపారు. 































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 26-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 26-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 



చిలకలూరిపేట పట్టణంలో 4 కేసులు నమవుదు అయ్యాయి.


సుబ్బయ్యతోట లో - 1

మార్కండేయ నగర్ లో - 2

కుమ్మరి కాలనీ లో - 1 గా నమోదు అయ్యాయి 


చిలకలూరిపేట మండల గ్రామాలలో 5 కేసులు నమోదు అయ్యాయి. 



మనుకొండవారిపాలెం గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 


















































Share:

జాబ్ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులని మోసం చేసారు - బీజేపీ ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్

జాబ్ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులని మోసం చేసారు -  బీజేపీ ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

2021-2022 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం మొత్తం 10,143 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండరు పేరుతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ చూసిన నిరుద్యోగుల యువత తీవ్ర అసహనానికి గురి అయ్యారు. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్ ను నిరసిస్తూ బీజేపీ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సురేంద్రమోహన్ గారి ఆదేశాలతో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ నందు నిరసన దీక్ష చేపట్టారు. తక్షణమే ఈ జాబ్ క్యాలెండరు రద్దు చేస్తూ త్వరలో నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగా ఖాళీగా ఉన్న 2,40,000 ఉద్యోగాల భర్తీ చేసే విధంగా కొత్త జాబ్ క్యాలెండరు రిలీజ్ చెయ్యాలి అని నరసరావుపేట ఆర్టీఓ ఆఫీస్ నందు ఆర్టీఓ గారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్, జిల్లా నాయకులు నెమలికంటి బ్రహ్మం, వంశీ ,మురళి,నరేష్,జిల్లా ఉపాధ్యక్షుడు కాళ్ళ కోటేశ్వరావు, కామినేని హనుమంతురావు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/






























Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 25-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 25-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 12 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి. 

సుధావరిపాలెం లో - 1

సుభాని నగర్ లో - 1

పురుషోత్తమపట్నం లో - 1

సాంబశివ నగర్ లో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 8 కేసులు నమోదు అయ్యాయి. 

గోవిందపురం గ్రామంలో - 1

పసుమర్రు గ్రామంలో - 1

కమ్మవారిపాలెం గ్రామంలో - 2

మురికిపూడి గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 





















































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

పండరీపురం లో - 2 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 5 కేసులు నమోదు అయ్యాయి. 

పసుమర్రు గ్రామంలో - 1

బొప్పూడి గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 



















































Share:

చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ వర్తకసంఘం ఆధర్యంలో ఘనంగా MLA పుట్టినరోజు వేడుకలు - 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి

చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ వర్తకసంఘం ఆధర్యంలో ఘనంగా MLA పుట్టినరోజు వేడుకలు - 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట కూరగాయల వర్తకసంఘం ఆధ్వర్యంలో MLA విడదల రజిని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విడదల గోపి, మునిసిపల్ చెర్మన్ రఫాని, యార్డ్ చెర్మన్ బొల్లెద్దు చిన్న ముఖ్య అతిధులుగా విచ్చేసి 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి చేసారు. కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కరోనా విజృంభిస్తున్న సమయంలో మునిసిపల్ సిబ్బంది చేసిన సేవలు వెలకట్టలేనివి అని మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు.పట్టణంలో ఇలాంటి ఇబ్బంది పరిస్థితులు వచ్చిన చిలకలూరిపేట కూరగాయల వర్తకసంఘం తరుపున తమ వంతు కృషి చేసాము, చేస్తూనే ఉంటాము అని తెలిపారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. 











































Share:

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత 

https://chilakaluripetspeednews.blogspot.com/q


చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగి మన తెలుగు వారి స్థాయిని దేశం నలుమూలలా చాటి చెప్పే విధంగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలలో తన ఆలోచనలతో చాకచక్యంగా వాటిని అధిగమించిన మన IAS మైలవరపు కృష్ణ తేజ  మరో అరుదైన  ఘనత సాధించారు. కృష్ణ తేజకు ప్రతిష్ఠాత్మకం అయిన బుక్ ఆఫ్ అఛీవర్స్ నందు చోటు దక్కటం కృష్ణ తేజ కీర్తిని మరో స్థాయికి తీసుకువెళ్ళింది అని చెప్పాలి.  ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో IAS గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 ఆగష్టు నెలలో కేరళలో వచ్చిన వరదలలో మన కృష్ణ తేజ తన ఆలోచనలతో ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ నిర్వహించిన ఆపరేషన్ కుట్టనాడు ఆ రాష్ట్రం చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ సమయంలో కేరళలో కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను తన భుజాల పైన వేసుకొని ఎంతో చాకచక్యంగా ఆ ఆపరేషన్ పూర్తి చేసారు.లక్షల మంది జీవితాల గురించి అలోచించి నిర్ణయం తీసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. అంతటి క్రిటికల్ పరిస్థితులలో ఒక్క తప్పిదం జరిగినా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే వారు కానీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆనాడు చేపట్టిన ఆపరేషన్ కుట్టనాడు కి గాను బుక్ అఫ్ అఛీవర్స్ నందు మన కృష్ణ తేజకు చోటు దక్కింది. బుక్ అఫ్ అఛీవర్స్ అంటే అసాధ్యాన్ని సాధించిన అరుదైన వ్యక్తుల గురించి అందులో పంచుకుంటారు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన మన చిలకలూరిపేట ముద్దు బిడ్డ IAS మైలవరపు కృష్ణ తేజకు అభినందనలు తెలుపుకుంటున్నాము.  
అలాగే కరోనా వీరవిజృభిస్తున్న సమయంలో కూడా కేరళ ప్రభుత్వం మన కృష్ణ తేజ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి కరోనా కట్టడికి కృషి చేసారు. ఆ కమిటీకి పూర్తి బాధ్యత వ్యవహిరిస్తు తన ఆలోచనలతో నిర్ణయాలతో కరోనా తీవ్రతని తగ్గించారు. 

Book of Achievers 


కేరళలోని మన కృష్ణ తేజ ఆఫీస్ నందు పని చేసే ఉద్యోగి అయన గురించి ఏమి అన్నారో అయన మాటలలోనే 

మనం నిత్యం ఎంతో మంది అధికారుల అవినీతి గురించి వింటూనే వుంటాం.డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉద్యోగాల్లో చేరేవారు కొంతమంది అయితే, ప్రజలకు సేవచేయాలని వచ్చేవారు మరికొంతమంది. అలాంటి ఒక వ్యక్తి గురించి నేను విన్నది, చూసింది...........
  
    జీవితంలో కొంతమందిని కలసినందుకు గర్వ పడుతుంటాం.అలాంటి ఒక వ్యక్తి గురించి, ఈయన పేరు కృష్ణతేజ మైలవరపు.కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి.ప్రస్తుతం అల్లెప్పే సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.నేను అనుకోకుండా ఒక రోజు ఎన్నికల విధుల్లో బాగంగా అల్లెప్పేకి వెళ్ళటం జరిగింది.అప్పుడే ఈయన్ని కలిసే అదృష్టం దక్కింది.

    అదృష్టం అని ఎందుకు అంటున్నానంటే....

 🔹ప్రజలకు ఏదోకటి చేయాలనే సంకల్పం.
 🔹ఒక అధికారిగా పాలనలో తనదైన ముద్ర చూపించాలనే ఉత్సాహం.
 🔹 ఎదుటి మనిషితో నేను ఒక అధికారిని అనే గర్వం లేకుండా మాట్లాడే మనస్తత్వం, ఎదుటి               వారికి ఇచ్చే గౌరవం.
 🔹 సర్వీసులో చేరిన ముడేళ్లకే దేశ వ్యాప్తి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి.

         ఆయన గురించి అక్కడి ప్రజలు,అధికారులు చెప్పిన కొన్ని విషయాలు...........

 🔹 గతంలో వరదలు వచ్చిన సమయంలో కుట్టు నాడు ప్రాంతంలో వరద భీభత్సాన్నీ                            ముందుగానే ఊహించి ఆయన చేపట్టిన రేస్కూ ఆపరేషన్.
 🔹 కేవలం 48 గంటల్లో రెండున్నర లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం.
 🔹సమర్దవంతంగా శిబిరాల నిర్వహణ.
 🔹 తరువాత తిరిగి వారిని స్వస్థలాలకు తరలించంటం.
 🔹వరదల అనంతరం ఆయన చేపట్టిన  I AM FOR ALLEPPEY అనే కార్యక్రమం.
 🔹వరదల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు తిరిగి కొత్త ఇళ్లు ఇవ్వటం.
 🔹పిల్లల బడుల ఆధునికీకరణ, రక్షిత త్రాగునీరు ఏర్పాటు.
 🔹 ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి ఉపాధి కల్పించడం.
 🔹I AM FOR ALLEPPEY ద్వారా ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది.
 🔹 ఇంకా ఇటువంటివి మరెన్నో........... 

అంటూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. 










































Share:

చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు.

చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలో ఈ రోజు 24-06-2021 MLA విడదల రజిని పుట్టినరోజు వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. పట్టణంలోని పలు సెంటర్లలో MLA ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలు వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే మోడ్రన్ మాల్ వద్ద భారీ ఎత్తున రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు. కూరగాయల మార్కెట్ వర్తక సంఘం తరుపున నిరు పేదలకు   బట్టలు పంచారు. ఎరువుల కొట్ల బజారులో కూడా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వాడ వాడల ఈ రోజు రజిని పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారు. వార్డు స్థాయి వ్యక్తుల నుండి పార్టీ సీనియర్ నాయకులు వరకు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. MLA పుట్టిన రోజుతో పట్టణం అంతా పండుగ వాతావరం అలుముకుంది. 
























































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో 9 కేసులు నమోదు అయ్యాయి 

సి ఆర్ కాలనీ లో - 1

సుభాని నగర్ లో - 3

మార్కండేయ నగర్ లో - 2

సాంబశివ నగర్ లో - 1

వెంగళరెడ్డి కాలనీ - 2 గా నమోదు అయ్యాయి 

చిలకలూరిపేట మండల గ్రామంలో 6 కేసులు నమోదు అయ్యాయి 

బొప్పూడి గ్రామంలో - 1

కట్టుబడివారిపాలెం గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 1

గోవిందపురం గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 

























































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.