చిలకలూరిపేట- మానుకొండవారిపాలెం,ఏలూరు గ్రామ ప్రజల ధర్నా- కొంత సేపు ట్రఫిక్ అంతరాయం, MLA రజని చొరవతో అంతా సర్దుబాటు
ఏలూరు- మానుకొండవారిపాలెం గ్రామస్థులు ధర్నా - వివరాలలోకి వెళ్తే గణపవరం లోని ప్రముఖ కంపెనీ,స్పిన్నింగ్ మిల్లుల నుండి వచ్చే వ్యర్ధాలను గణపవరం గ్రామం మీదుగా వచ్చే కుప్పగంజి వాగు లోకి కలుపుతున్నారు. అందువలన వాగులో నీరు కాలుష్యం ఎర్పడి రంగు మరి , అందులో ఉండే జలచరాలు చేపలు,కప్పలు భారీగా చనిపోతున్నాయి, అంతేకాకుండా ఆ వాగు నుండి వచ్చే నీరును మానుకొండవారిపాలెం , ఏలూరు ప్రజలు పంటల సేద్యానికి వాడుతుంటారు, కొందరు త్రాగునీరుగా వాడుతుంటారు. అయితే అక్కడి గ్రామ ప్రజలు ఈ కాలుష్యానికి అడ్డుకట్ట వేయటానికి నిరసనగా ధర్నా చేపట్టారు. దాని వలన రోడ్లు పైన ట్రాఫిక్ అంతరాయం ఎర్పడింది. విషయం తెలుసుకున్న MLA రజని గారు హుటా హుటిన అక్కడికి చేరుకొని వాగుని పరిశీలించారు.
దీనిపైనా స్పందించిన రజని ఈ కాలుష్యానికి కారణం అయిన కంపెనీల పైన తగు చర్యలు తీసుకుంటాని హామీ ఇచ్చారు. అలాగే ఆయా నీటిని శాంపిల్ తెలుసుకొని ల్యాబ్ కి పంపాలి అని ఆదేశించారు, రైతులకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని , ఏ కంపెనీ నుండి వ్యర్ధాలు నీటిలో కలవకూడదు అని , నీటిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపైనా ఉన్నది అని, MLA రజని తో పాటుగా పోలీస్,పొల్యూషన్ అధికారులని, తహశీల్ధార్ సుజాత గారు,అక్కడికి చేరుకున్నారు.
పొల్యూషన్ అధికారి AE శ్రీనివాసరావు మాట్లాడుతూ శాంపిళ్లను విజయవాడ ల్యాబ్ లకు పంపారు అని, ఒక వారం రోజులలో రిపోర్ట్స్ వస్తాయి అని, అప్పుడు ఆయా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటాం అని అవసరం అయితే మూసివేస్తాం అని హామీ ఇచ్చారు. అప్పటికిగాని గ్రామ ప్రజలు శాంతించారు. ఈ ధర్నాలో గ్రామా పెద్దలు , గ్రామ సర్పంచ్ లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు .