చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు వీరే ...
చిలకలూరిపేట నేడు నారా లోకి సమక్షంలో వైసిపి నుండి భారీ ఎత్తున ముఖ్య నాయకులు టిడిపిలో చేరారు. ఐదు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నా కూడా అనేక సమస్యలు ఇబ్బందులకు గురి చేశారని వారు వాపోయారు. టిడిపి చేరిన ముఖ్య నాయకుల వివరాలు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మాజీ డైరెక్టర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగి అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న మల్లెల రాజేష్నాయుడుగారు వైకాపాను వీడి శుక్రవారం తెదేపా తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి వర్యులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావుగారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సమక్షంలో మల్లెల రాజేష్నాయుడుగారు తెదేపాలో చేరారు. నారా లోకేష్ గారు రాజేష్నాయుడుగారికి పార్టీ కండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజేష్గారితోపాటు 25 మంది చిలకలూరిపేట నియోజకవర్గ కీలకనేతలు వైకాపాకు రాజీనామా చేసి తెదేపా కండువాలు కప్పుకున్నారు. తెదేపాలో చేరినవారిలో యడ్లపాడు మండల జడ్పీటీసీ సభ్యులు ముక్తా వాసు, చిలకలూరిపేట మునిసిపల్ వైస్ ఛైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, మునిసిపల్ కౌన్సిలర్లు తులం సుధాకర్, చెమిటిగంటి పార్వతిదేవి, బిట్రా రాజేంద్రప్రసాద్, షేక్ జమీలా, జాలాది సుబ్బారావు, కౌన్సిలర్, వైసీపీ మైనార్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేరింగ్ మౌలాలి, ఎస్సీసెల్ రాష్ట్ర నాయకులు పంగులూరి వెంగళరాయుడు, వైకాపా సీనియర్ నాయకులు గాలి బుచ్చయ్య, బీసీసెల్ పట్టణ అధ్యక్షుడు, వైసీపీ ముఖ్య నాయకుడు ఎం.వి.రత్నారెడ్డి, మహిళావిభాగం పట్టణ అధ్యక్షురాలు యాదాల సుజాత, బుక్కాపురం సర్పంచ్ అల్లం ఆంజనేయులు, విద్యార్ధి విభాగం నాయకులు నాగూర్, ఇక్భాల్, గౌస్లు, సీనియర్ నాయకులు రామిశెట్టి తాండవేశ్వరరావు, తోట సీతయ్య, కోట నాగపూర్ణచంద్రరావు, గుంజి బాజిలతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు TDP లో చేరారు.
క్రింది లింక్ పై క్లిక్ చేయండి మరిన్ని వార్తలు పొందండి
https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY