చిలకలూరిపేట - ప్రభుత్వం గ్యారెంటీ ఉంటూ లోను చెల్లిస్తుంది - పురప్రజల పై ఎటువంటి భారం పడదు - టీడీపీ కౌన్సిలర్లు అనవసరపు రాదంతం చేస్తున్నారు - ఛైర్మెన్ రఫాని
చిలకలూరిపేట - గత ప్రభుత్వంలో చేసిన అప్పులు వలన మునిసిపాలిటీ రెవిన్యూ పూర్తిగా లోటు బడ్జెట్ లోకి వెళ్ళింది అని.గత ప్రభుత్వం హయాంలో పట్టణ ప్రజల కోసం ఏర్పాటు చేసిన అమృత్ పధకంలో మునిసిపాలిటీ వాటా 82 కోట్లుగా ఉంది.ఏడాది మునిసిపాలిటీ ఆదాయం మాత్రం 8 కోట్లు మాత్రమే. అయితే MLA రజిని అమృత్ పధకం లోటు బడ్జెట్ను ముఖ్యమంత్రికి విన్నవించగా మునిసిపాలిటీలో ఉన్న ఆదాయ వనరులను చూపించి బ్యాంకులో ఋణం పొందండి. ఆయా నిధులకు సంబంధించిన లోనును మునిసిపాలిటీ ప్రజలపైన ఈ భారం పడకుండా ప్రభుత్వమే చెలిస్తుంది అని తెలిపారు. ప్రజలకు త్రాగునీరు సమస్య లేకుండా పరిష్కరించాలి అని చూస్తుంటే టీడీపీ కౌన్సిలర్లు మాత్రం మా పైన బురద చల్లుతూ ప్రజలను ప్రక్కదోవ పాటిస్తున్నారు అని మునిసిపల్ ఛైర్మెన్ రఫాని తెలిపారు.
మార్కెట్ యార్డు ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక టీడీపీ కౌన్సిలర్లు తమ పైనే దుష్ప్రభావం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది - ఎంత అభివృద్ధి జరిగింది అనే దాని పైన బహిరంగ చర్చకు రావాలి అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఛైర్మెన్ రఫాని, యార్డు ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న,వైస్ ఛైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.