ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా వీలులేదా? - TNSF విద్యార్థి సంఘాలు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను రాష్ట్రంలో శాశ్వతంగా లేకుండా చేయడానికి జారీ చేసిన జీవో నెం.50,51 నిరసిస్తూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నప్పటికీ,రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఏకపక్ష ధోరణితో ఎయిడెడ్ పాఠశాలల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ ల వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేయు కార్యక్రమాన్ని తలపెడితే, అప్రజాస్వామికంగా విద్యార్థి సంఘాల నేతలను కనీసం శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా అనుమతించకుండా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. రాష్ట్రాని నడపడానికి అప్పులు దొరకని తరుణంలో ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల భూముల్ని స్వాధీనం చేసుకుని వాటితో అప్పులు తెచ్చుకోవాలని చూడండం దారుణం అన్నారు. నాడు అమ్మఒడి ఇస్తామని అధికారంలోకి వచ్చి నేడు అమ్మకానికి బడిని పెట్టడం సిగ్గుచేటు అన్నారు. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల భూములు స్వాధీనం చేసుకోవాలని తీసుకువచ్చిన జీవో నెం.50, 51లను రద్దు చేయకపోతే విద్యార్థులుతో మరియు యువజన సంఘలుతో కలిసి ఈ నెల 18న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చెప్పడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర TNSF కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్, గుంటూరు పార్లమెంట్ TNSF అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ, నరసరావుపేట పార్లమెంట్ TNSF అధ్యక్షులు కూరపాటి హనుమంతరావు మరియు పలు TNSF విద్యార్థి సంఘాలు పాల్గొనడం తదితరులు జరిగింది.