చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ సెస్ వసూళ్ల హక్కులు వేలంపాట భారీ ధర పలికాయి.
పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ నందు బుధవారం నాడు సెస్ వసూళ్లు చేసుకునే హక్కుల వేలం నిర్వహించారు. గతంలో చంద్రమౌళి కూరగాయ మార్కెట్ హక్కుల విలువ 7 లక్షల రూపాయలు సంవత్సరానికి , 2021 సంవత్సరానికి గాను సర్కారివారి పాట నెలకు 90,420 గా నిర్ణయించారు. విడదల శేషగిరిరావు గారు 1,12,000 రూపాయలకి దకించుకున్నారు. ఆ లెక్కన సంవత్సరానికి 13,44,000 రూపాయలు అవుతుంది గతం తో పోలిస్తే ఇది చాల ఎక్కువ . అలాగే సండ్రీ మార్కెట్, చేపల& మాంసము మార్కెట్ కు కూడా వేలం నిర్వహించారు. ( 1-04-2021 నుండి 31-03-2021 వరకు ) సండ్రీ మార్కెట్ సర్కారి వారి పాట 17,60,000 కాగా షేక్ నాసర్ వలి 17,64,000 గా , చేపల&మాంసము మార్కెట్ సర్కారు వారి పాట 1,60,000 కాగా షేక్ అబ్రహం 1,65,000 కి దక్కిన్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ముసిపల్ అధికారులు, కమిషనర్ పాల్గొన్నారు.