చిలకలూరిపేట D R N S C V S డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకటరాయలు గారు మృతి చెందారు
చిలకలూరిపేట D R N S C V S డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకటరాయలు గారు మృతి చెందారు
పట్టణంలోని డి ఆర్ ఎన్ ఎస్ సి వి ఎస్ డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ అయిన శ్రీ తోటకూర వెంకటరాయులుగారు బెంగళూర్ లోని ఒక ప్రముఖ వైద్యశాలలో ఈరోజు మృతి చెందారు. వెంకటరాయులుగారి మృతికి DNRNSCVS పూర్వ విద్యార్థులు సంతాపం తెలిపారు. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం సాయంత్రానికి పండరీపురం 5వ లైన్ లోని నివాసానికి తీసుకువస్తారు అని సమాచారం.
జల శక్తీ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న MLA రజని గారు , విశ్వంలో ప్రతి జీవి మనుగడకు నీరు అవసరం -- MLA రజని
విశ్వంలో ప్రతి జీవి మనుగడకు నీరు అవసరం -- MLA రజని
జల శక్తీ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న MLA రజని గారు
సోమవారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా యడ్లపాడు గ్రామములో ఎర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ జల శక్తీ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు MLA రజని గారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జల రక్షణ మన అందరి బాధ్యత అని , నీటి నిల్వలు పెంచాలి అని , ఇది అందరి బాధ్యత అని తెలిపారు. నీరు అనేది విశ్వ0 లో ప్రతి జీవికి అవసరం అందువలన నీటి నిల్వలను పెంచి భూగర్భ జలాలను కాపాడాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA రజని గారితో పాటు జిల్లా పంచాయితీ అధికారి కేశవరెడ్డి,పీడీ శ్రీనివాసరావుగారు,జేసీ ప్రశాంతి గారు మరియు ముఖ్య నాయకులూ పాల్గొన్నారు
చిలకలూరిపేట తహశీల్ధార్ శ్రీమతి జి సుజాత పైన కోర్టు ధిక్కరణ కేసు నమోదు
చిలకలూరిపేట తహశీల్ధార్ శ్రీమతి జి సుజాత పైన కోర్టు ధిక్కరణ కేసు నమోదు :--
బొప్పూడి రైతులకు సంబంధించిన భూముల విషయం లో హైకోర్టు చిలకలూరిపేట తహసీల్దార్ గారు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించాలి అని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయినప్పటికీ వాటిని ఉల్లంగిస్తూ రైతులపైన తహసీల్దారు గారు పోలీసులకి ఫిర్యాదు చేసారు. .చిలకలూరిపేట రురల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రైతులపైనా కేసు నమోదు అయినందువలన , సి సుబ్బాయమ్మ అనే మహిళా రైతు హైకోర్టు నందు తహశీల్ధార్ సుజాత గారి పైన కోర్టు ధిక్కరణ కేసు వేశారు.
ఈ సందర్భంగా నవతరం పార్టీ జాతీయ అధినేత రావు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతు బొప్పూడి, రాజాపేట, మురికిపూడి, రైతులకు మద్దతుగా ఉంటాను అని, ధిక్కరణ కేసు కాపీ ని ముఖ్యమంత్రికి, గవర్నర్, మైనింగ్ శాఖ మంత్రులకి రైతులతో కలిసి అందచేస్తాం అని పేదలకి అండగా వుంటాను అని తెలిపారు.