కమ్యూనిస్టు ఉద్యమనేత పెరుబోయిన రాము కన్నుమూత
ప్రముఖ సి.పి.ఎం.పార్టీ సీనియర్ నాయకులు,సి.ఐ. టీయూ. కార్మిక సంఘాల నాయకులు, కమ్యూనిస్టు ఉద్యమ నేత పెరుబోయిన రాములు 90 సంవత్సరాలు ఆదివారం నాడు సాయంత్రం చనిపోయారు. ఈయన జీవిత కాలం ఉద్యమాల్లోనే గడిపారు. గత 8 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతు చివరికి కన్నుముశారు. ఈయన నరసరావుపేటలోని ఇకక్కుర్తి గ్రామము నుంచి చిలకలూరిపేట వచ్చి అప్పటి కమ్యూనిస్టు నాయకుల ఉద్యమాలకు ప్రభావితులై సభ్యులుగా 1964లో చేరారు. అప్పటి నుంచి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సి.ఐ టి.యూ లో పనిచేసిన ఈయన చిలకలూరిపేట కంది మళ్ల టుబాకో కంపెనీ ఉద్యమములో ప్రముఖ పాత్ర పోషించారు.జైల్లో 2 నెల్లపాటు ఉండి లాఠీదెబ్బలు కూడ తిన్నా రు. అయిన ఉద్యమాలు వీడక ట్రేడ్ యూనియన్ తరపున పోరాడారు. అంతే కాక రిక్షా కార్మిక సంఘములోను. రైతు సంఘములోనూ ఇంకా పలు సంఘాలలో పని చేశారు. అనారోగ్యంతో పార్టీ సభ్యులుగానే ఈ రోజు వరకు కొనసాగుతున్నారు ఈయనకు భార్య 4 గురు కుమారులు,4 గురు కుమార్తెలు మనవాళ్ళు,మనవరాలు ఉన్నారు.ఈయన చనిపోవడం పార్టీకి తీరని లోటని పలువురు నాయకులు అన్నారు.