లావు శ్రీకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరికపై - అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన ఎంపీ కార్యాలయం
పలనాడు జిల్లా :- ఎప్పుడు ఎప్పుడు పార్టీలో చేరుతారా అని నరసరావుపేట పార్లమెంట్ టిడిపి కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు లావు శ్రీకృష్ణ TDP లో చేరిక తేదీ ఖరారు చేశారు. మార్చి 2వ తేదీన గురజాల నియోజకవర్గం, దాచేపల్లిలో జరగబోయే 'రా కదలి రా ' సభలో టిడిపిలోకి చేరుతున్నట్లు లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు. సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ, అభివృద్ధిని సాధించుటకే తన ప్రతి అడుగు, ఆలోచన ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో సాధించుకున్న వాటిని పూర్తి చేసుకోవటంతో పాటుగా రానున్న కాలంలో ఇంకొన్ని మన పల్నాడులో అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవాలని, వాటికి కట్టుబడి సదా తోడుగా ఉంటానని మరలా ఆశీర్వదించాలని శ్రీ కృష్ణ దేవరాయలు పల్నాడు ప్రజనీకాన్ని కోరారు.
- లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారి కార్యాలయం