రేపు మంగళగిరిలో టిడిపి ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద జయహో బీసి భారీ బహిరంగ సభ
ఆంధ్రప్రదేశ్ :- బీసీలు అందని ఐక్యం చేస్తూ రేపు మంగళగిరిలో జయహో బిసి అనే పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న బీసీలకు వారి అభివృద్ధి అభ్యుదయానికి ఉపయోగపడే విధంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు TDP పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున బిసి కార్యకర్తలు, పార్టీలోని ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ సభలో చంద్రబాబు బీసీ డిక్లరేషన్ను ప్రకటించనున్నారు. పల్నాడు జిల్లా నుండి భారీగా బూత్ స్థాయి నుండి కార్యకర్తలు, ముఖ్య నేతలు, బీసీ అధికార ప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. ఈ సభ దేశంలోనే అతిపెద్ద బీసీ సభ అవుతుందని వారు తెలియజేశారు.
Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: