రోడ్డు ప్రమాదం - మూడుకి పెరిగిన మృతుల సంఖ్య - చిలకలూరిపేట
చిలకలూరిపేట :- నిన్న అనగా శుక్రవారం ఉదయం చిలకలూరిపేట - నరసరావుపేట రోడ్డులోని లింగంగుంట్ల చెక్ పోస్ట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు .దీంతో మృతుల సంఖ్య మూడుకి చేరింది. ఘటనా స్థలంలోనే అక్కడికక్కడ హనుమాయమ్మ (60) మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివ పార్వతి (58), హాజరత్ వలి (70) మృతి చెందారు. వీరంతా వేలూరు గ్రామానికి చెందిన వారు అవటంతో, ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరంతా వేలూరు గ్రామం నుండి గణపవరం డొంక మీదగా అప్పాపురంలో మిర్చి కోతలకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు చిలకలూరిపేట రూరల్ ఎస్సై తెలిపారు.