కరోనా బాధితులకు ఏ సమస్య వచ్చిన మాకు కాల్ చెయ్యండి - ఛైర్మెన్ రఫాని, యార్డు ఛైర్మెన్ చిన్న
CHILAKALURI PET SPEED NEWSThursday, May 20, 2021కరోనా న్యూస్, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
కరోనా బాధితులకు ఏ సమస్య వచ్చిన మాకు కాల్ చెయ్యండి - ఛైర్మెన్ రఫాని, యార్డు ఛైర్మెన్ చిన్న
చిలకలూరిపేట పట్టణములోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మున్సిపల్ ఛైర్మెన్ రఫాని గారు, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు పాల్గొన్నారు. నిన్న బుధవారం గవర్నమెంట్ హాస్పిటల్ నందు పర్యటించి అక్కడి రోగులతో మాట్లాడి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. అలాగే కరోనా ఓపీ, నాన్ కరోనా ఓపీ ఒకచోట ఉండటం అసహనానికి గురి అయ్యారు. వెంటనే రెండు వేరు వేరు ఓపీ విభాగాలని ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు. అలాగే కొన్ని వార్డులలో పర్యటించి మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలలో ట్యాంకర్లతో నీటిని అందించాలి అని తెలిపారు.
ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో MLA గారి పిలుపు మేరకు ఉచిత కరోనా మృతిదేహాల తరలింపుకు వాహనాని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నందు 100 పడకలుగా నిర్మాణాన్ని పరిశీలించారు అని.అలాగే కరోనా రోగులకు ఎ సమస్య వచ్చిన తమకు కాల్ చెయ్యవచు అని తెలిపారు.
మున్సిపల్ చై ర్మెన్ రఫాని గారు :- 9440479765
మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు :-9553129726
ధాతలకు ధన్యవాధాలు, ఇలాంటి విపత్కర పరిస్థితిలో కలసి కట్టుగా పని చేదాం - MP శ్రీకృష్ణదేవరాయలు
CHILAKALURI PET SPEED NEWSThursday, May 20, 2021కరోనా న్యూస్, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్
No comments
ధాతలకు ధన్యవాధాలు, ఇలాంటి విపత్కర పరిస్థితిలో కలసి కట్టుగా పని చేదాం - MP శ్రీకృష్ణదేవరాయలు
చిలకలూరిపేట- పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు గత కొన్ని రోజుల క్రితం పర్యటించిన MP లావు శ్రీకృష్ణదేవరాయలు గారు హాస్పిటల్ నందు ధాతల సహకారం అందిస్తే రోగులకు మంచి వైద్యం అందించవచ్చు అని పిలుపునిచ్చారు. MP గారి పిలుపుమేరకు హాస్పిటల్ నందు వైద్య పరికరాలు, మౌళిక సదుపాయాలు ఎర్పాటుకు చాలా మంది ధాతలు ముందుకి వచ్చారు.
మళ్ళీ బుధవారం నాడు MP పర్యటించి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు అలాగే అసిస్ట్ సంస్థకు, జోసిల్ కంపెనీ వారికీ, నాయుడు రమేష్ గారికి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఇలాగే విపత్కర పరిస్థితులలో అందరం కలిసి కట్టుగా పని చేసుకోవాలి అని తెలిపారు.
గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యురాలు భవాని గారు మాట్లాడుతూ MP, MLA గారి చొరవతో ఈ రోజు సామాన్య ప్రజలకు కరోనా వైద్యాన్ని అందజేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమానికి MP గారి అనుచరులు నాయుడు రమేష్ గార, బైర వెంకటకృష్ణ గారు , వల్లేటి శహిమంతరావు గారు,గడిపూడి దశరధ రామయ్య గారు పాల్గొన్నారు.
చిలకలూరిపేట - క్వారంటైన్ సెంటర్ నందు ఫ్రూట్స్ పంపిణి చేసిన భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్
చిలకలూరిపేట - క్వారంటైన్ సెంటర్ నందు ఫ్రూట్స్ పంపిణి చేసిన భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్
చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాలలో ఉన్న కరోనా కోరంటైన్ నందు పట్టణములోని భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా రోగులకు ఫ్రూట్స్ అందించారు ట్రస్ట్ సభ్యులు. కోరంటైన్ నందు భోజన సదుపాయాలు , మంచినీటి వసతి ఉన్న రోగులు త్వరగా కోలుకోవడానికి ఫ్రూట్స్ అందజేశారు. మందులతో పటు నాచురల్ ఫ్రూట్స్ వలన కలిగే లాభాలని తెలియజేసి వాటిని కరోనా బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వడాల భాస్కర్ , కందుల రవి, వంశీ, సాయి మురారి, నాయుడు ఫణి, కీర్తి సాయి, గుడిపల్లి యశ్వంత్ పాల్గొన్నారు.