చిలకలూరిపేట పట్టణములోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మున్సిపల్ ఛైర్మెన్ రఫాని గారు, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు పాల్గొన్నారు. నిన్న బుధవారం గవర్నమెంట్ హాస్పిటల్ నందు పర్యటించి అక్కడి రోగులతో మాట్లాడి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. అలాగే కరోనా ఓపీ, నాన్ కరోనా ఓపీ ఒకచోట ఉండటం అసహనానికి గురి అయ్యారు. వెంటనే రెండు వేరు వేరు ఓపీ విభాగాలని ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు. అలాగే కొన్ని వార్డులలో పర్యటించి మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలలో ట్యాంకర్లతో నీటిని అందించాలి అని తెలిపారు.
ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో MLA గారి పిలుపు మేరకు ఉచిత కరోనా మృతిదేహాల తరలింపుకు వాహనాని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నందు 100 పడకలుగా నిర్మాణాన్ని పరిశీలించారు అని.అలాగే కరోనా రోగులకు ఎ సమస్య వచ్చిన తమకు కాల్ చెయ్యవచు అని తెలిపారు.
మున్సిపల్ చై ర్మెన్ రఫాని గారు :- 9440479765
మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు :-9553129726
No comments:
Post a Comment