నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ వైసిపికి రాజీనామా
పల్నాడు జిల్లా :- నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయ వైసిపి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈరోజు ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్న పనులు గురించి ఆయన వివరించారు. పార్టీలో నెలకొన్న అనిచ్చితి వల్ల తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని బీసీలకు ఇవ్వడానికి వైసిపి అధిష్టానం నిర్ణయించుకుంది. అందువలన ఎంపీ లావు శ్రీ కిష్ణదేవరాయని గుంటూరు నుంచి పోటీ చేయమని అధిష్టానం ఆదేశించగా, ఆయన దానికి ససేమిరా అన్నారు. ఇప్పటికే నరసరావుపేట పార్లమెంట్ ప్రాంతంలో తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్న ఆయన మరో స్థానంలో పోటీ చేయడానికి నిరాకరించారు. తనకు అండగా నిలిచిన పార్టీ పెద్దలు మరియు ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.