చిలకలూరిపేట - కుప్పగంజివాగులో గల్లంతు కాబోయిన వ్యక్తిని కాపాడిన పోలీస్,ఫైర్ సిబ్బంది
చిలకలూరిపేట మండల గ్రామాలైన మానుకొండవారిపాలెం & ఏలూరు గ్రామాల మధ్యలో ప్రవహించే కుప్పగంజి వాగు ఎగువున కురిసిన వర్షానికి భారీగా వరద నీరు చేరింది.అయితే వేలూరు గ్రామానికి చెందిన దాసు అనే వ్యక్తి ద్విచక్ర వాహనం పైన వరద దాటానికి ట్రై చేసాడు. వరద ఉధృతికి బైకుతో సహా దాసు కూడా వరదలో కొట్టుకొని వెళ్ళబోయి అక్కడ ఉన్న చెట్టుకొమ్మకి చిక్కుకొని ఆగిపోయాడు. అంతలో అప్రమత్తం అయిన గ్రామస్థులు MLA రజని ని సంప్రదించగా ఆమె వెంటనే స్పందించి సదరు వ్యక్తిని కాపాడలిని అధికారులను ఆదేశించారు. వెంటనే అప్రమత్తం అయిన ఫైర్,పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని దాసు ను కాపాడారు. మునిసిపల్ ఛైర్మెన్ రఫాని హుటా హుటిన అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రురల్ SI భాస్కర్,ఫైర్ ఆఫీసర్ సునీల్ తోపాటు గ్రామ సర్పంచ్ తిరుపతయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు దౌలతాఖాన్ ఆధ్వర్యంలో దాసుని ప్రాణాలతో రక్షించారు. అయితే వాహనం మాత్రం వరద ఉధృతిలో కొట్టుకుపోయింది.