చిలకలూరిపేట పట్టణంలోని పలు సెంటర్లలో ఉన్న అల్లూరిసీతారామరాజు,వంగవీటి విగ్రహాలకు ఘన నివాళి తెలిపిన నాయకులు.
మన్యం దొర అల్లూరి సీతారామరాజు & వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా పట్టణంలోని పలు సెంటర్లో ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు పట్టణ నాయకులు.బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెటించిన మన అల్లూరి యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చాటి చెప్పారు. ఆనాడు అల్లూరి లాంటి వారి చేసిన ప్రాణ త్యాగాలకు ఈ రోజు మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం అని తెలిపారు.అలాగే వంగవీటి మోహన రంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకోసం అయన చేసిన చర్యలను తలుచుకున్నారు. ఈ కార్యక్రమాలలో వైస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శ్రీ అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట లోని ఎన్నార్టీ సెంటర్లో ఉన్న అల్లూరి విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు చెరుకూరి కాంతయ్య గారు మరియు రోటరీ క్లబ్ సభ్యులు మరియు భగవద్గీత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుడిపల్లి నాగభూషణం గారు అల్లూరికి కి ఘన నివాళి అర్పించారు. అనంతరం బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపర్తి జయరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి తన్నీరు రామారావు, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ వంకాయలపాటి వంశీ మరియు ఇతర పార్టీ నాయకులు అల్లూరి సీతారామరాజు విగ్రహ వ్యవస్థాపకులు వేగేశ్న అంజి రాజు వివిధ స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొని నివాళులర్పించారు.