చిలకలూరిపేట పట్టణంలో 10 లక్షల రూపాయల నగదు చోరీ జరిగింది.వివరాలలోకి వెళ్తే పట్టణంలోని మార్కెట్ సెంటర్ నందు మణికంఠ ట్రేడర్స్ అనే బియ్యం మిల్లు యజమాని అర్వపల్లి కాశీవిశ్వేశ్వరావు అనే వ్యక్తి తన మిల్లు ఎదురుగా ఉండే బియ్యం స్టోర్ చేసుకునే గౌడాన్ నందు రైతుల వద్ద బియ్యం కొనుగోలుకు 11లక్షల 50 వేల రూపాయలను బీరువాలో దాచాడు.అయితే రైతుల వద్ద బియ్యం కొనుగోలుకు డబ్బులు కోసం అని ఆదివారం నాడు గౌడాన్ తెరవగా అందులో బీరువా పగలగొట్టి అందులోని కొంత డబ్బులు క్రింద ఉండటాన్ని గమనించిన సదరు యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన CI,SI లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గౌడాన్ వెనుక వెంటిలేషన్ తొలగించి అందులోకి ప్రవేశించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది.క్లూస్ టీమ్ పిలిపించి ఆధారాలు పరిశీలిస్తునట్లు తెలిపారు. పోలీస్ అధికారులు.
Home »
» చిలకలూరిపేట పట్టణంలో మార్కెట్ సెంటర్ నందు 10 లక్షలు చోరీ
చిలకలూరిపేట పట్టణంలో మార్కెట్ సెంటర్ నందు 10 లక్షలు చోరీ
చిలకలూరిపేట పట్టణంలో మార్కెట్ సెంటర్ నందు 10 లక్షలు చోరీ
No comments:
Post a Comment