ఆదివారం నాడు చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ కౌన్సిల్ సభ్యులు వైస్సార్సీపీ పట్టణంలో చేస్తున్న చర్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.57 సంవత్సరాల చరిత్ర ఉన్న చిలకలూరిపేట మునిసిపాలిటీ ఆస్తులను బ్యాంకులకు తాకట్టుపెట్టాన్ని వైస్సార్సీపీ చేతకాని తనంగా అభివర్ణించారు. అలాగే గాంధీ పార్కు మరియు పార్కు బయటఉన్న మునిసిపల్ కాంప్లెక్స్ లను తాకట్టు పెట్టటం సిగ్గు చేటు అని తెలిపారు. పార్క్ మరియు కంప్లెక్సలను బ్యాంకులో 50 కోట్లకి తాకట్టు పెడదాం అని అడిగితే దానికి సదరు బ్యాంకు అధికారులు వ్యాల్యూవేషన్ వేసి 30 కోట్లు మాత్రమే ఇస్తాము అని తెలపగా 30 కోట్ల రూపాయలకి తాకట్టు మాకు సమ్మతమే అని తెలిపారు అని విశ్వసనీయత సమాచారం అని తెలిపారు.పట్టణంలో ఎంత మంది MLA , మినిస్టర్ అయిన కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు సమీకరించారు కానీ ఇలా ఆస్తులను తాకట్టు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని అన్నారు.మునిసిపల్ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాని చెట్టు క్రింద నిర్వహించామని అన్నారు. అలా మునిస్పల్ ఆస్తులన్నీ అమ్మిన తరువాత మనుషులను కూడా తాకట్టు పెట్టండి అని అన్నారు. అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తూ ఇలా మునిసిపల్ ఆస్తులన్నీ తాకట్టు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే ఎలాంటి కార్యకలాపాలన్నీ విరమించుకోవాలి. లేదు అంటే ఉద్యమం చేసి ఆస్తులను కాపాడుకుంటాం అని తెలిపారు.ఈ సమావేశంలో 8 మంది టీడీపీ కౌన్సిలర్లు,టీడీపీ నాయకులూ పాల్గొన్నారు.
Home »
» చిలకలూరిపేట - 30కోట్ల రూపాయలకు గాంధీపార్కు తాకట్టు పెట్టటం ఏంటి ! - మునిసిపల్ కౌన్సిల్ హాలును కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాలను చెట్ల క్రింద నిర్వహించండి - టీడీపీ కౌన్సిలర్లు
చిలకలూరిపేట - 30కోట్ల రూపాయలకు గాంధీపార్కు తాకట్టు పెట్టటం ఏంటి ! - మునిసిపల్ కౌన్సిల్ హాలును కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాలను చెట్ల క్రింద నిర్వహించండి - టీడీపీ కౌన్సిలర్లు
చిలకలూరిపేట - 30కోట్ల రూపాయలకు గాంధీపార్కు తాకట్టు పెట్టటం ఏంటి ! - మునిసిపల్ కౌన్సిల్ హాలును కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాలను చెట్ల క్రింద నిర్వహించండి - టీడీపీ కౌన్సిలర్లు
No comments:
Post a Comment