అచ్చెన్నాయుడి కోరిక మేరకు ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న - సీఎం జగన్
అమరావతి :- ఈరోజు 18/11/2021 బుధవారం నాడు అమరావతిలో అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సమావేశాలను ఈ ఒక్కరోజు మాత్రమే జరపాలని ముందు నిర్ణయించుకున్నారు. అయితే బీఏసి సమావేశంలో అసెంబ్లీ సమావేశం ఈ ఒక్కరోజు మాత్రమే అని స్పీకర్ తమ్మినేని సీతారాం అనగా.. వెంటనే తమకు కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని చర్చించుకోవాలి అని 15 రోజులు అయినా సమావేశాలు నిర్వహించాలని అచ్చెన్నాయుడు బదులిచ్చారు. వెనువెంటనే సీఎం జగన్ కలుగజేసుకుని పెద్దాయన అచ్చన్న అడిగినందుకు అయినా ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బదులిచ్చారు. అయితే సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని - అంతటితో ఆగకుండా చంద్రబాబు అసెంబ్లీ సమావేశం హాజరుకావాలని, ఆయన మొహం ఒకసారైనా చూడాలని ఉందని సీఎం జగన్ అచ్చన్నను కోరారు. చంద్రబాబు గారు అసెంబ్లీ సమావేశాలకు వస్తారని అచ్చెన్నాయుడు బదులిచ్చారు. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా "ఉమెన్ ఎంపవర్ మెంట్" టాపిక్ పైన చర్చించారు.