చిలకలూరిపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
చిలకలూరిపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు లేదా నేరుగా కలవొచ్చు --- MLA రజని
ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు లేదా నేరుగా కలవొచ్చు --- MLA రజని
చిలకలూరిపేట మున్సిపల్ తొలి సమావేశంలో చాలా సమస్యలపైనా చర్చించారు. అలాగే రోడ్లు , నీటి సమస్యల పైనా చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి అధ్యక్షలుగా రఫాని గారు, ఎక్స్ అఫీషియా సభ్యురాలి హోదా లో MLA రజని గారు పాల్గొన్నారు. రఫాని గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కౌన్సిలర్ తమ వార్డు పైన పూర్తి అవగాహనా కలిగి ఉండాలి అని, వార్డు లో ఏ సమస్య వచ్చిన తన దృష్టికి తెలుసుకురావాలి అని, పార్టీలకు అతీతంగా కలసి చిలకలూరిపేట పట్టణాన్ని అభివృద్ధి పధంలో తెలుసుకు వెళ్లాలి అని అన్నారు. ఇప్పటికే మానుకొండవారిపాలెం కి 75 లక్షలు , పసుమర్రు కి 2 కోట్లు, గణపవరంకి 5 కోట్లు తో పరిశుద్ధ,త్రాగునీరు సమస్యల పరిష్కారానికి అంచనా వేసి ప్రభుత్వానికి పంపటం జరిగింది అని చెప్పారు. పార్టీ ఏది అయినా ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉండాలి అని, చౌకబారు మాటలతో దిగజారుడు తనగా ఉండకూడదు అని, ప్రజలలో మంచి పేరు తెచ్చుకొని ముందుకు సాగాలి అని అన్నారు.
MLA రజని మాట్లాడుతూ వార్డు సమస్యలు ఏవైనా చైర్మెన్ గారికి లేదు అంటే తన దృష్టికి తెలుసుకురావాలి అని, ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు అని, ప్రజలు తమ సమస్యలని తీరుస్తారు అని మిమ్మల్ని ఎన్నుకున్నారు అని, ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి అని, పాత బకాయిగా ఉన్న 82 కోట్ల రూపాయలని సిఎం జగన్ గారితో మాట్లాడటం జరిగింది అని ఆ భారం మన మున్సిపాల్టీ పైన పడకుండా తగు చర్యలు తీసుకుంటాం అని, కౌన్సిలర్లలో చాలా వరకు కొత్త వారు కనుక ఒక రోజు సభ్యుల హక్కులు, విధులు, సమస్యలని ఎలా ప్రస్తావించాలి, అనే అంశాల పైనా శిక్షణ ఇస్తారు అన్నారు.
అలాగే సభ్యులు తమ తమ వార్డులలో సమస్యలను చైర్మెన్ దృష్టికి తీసుకువచ్చారు.
చిలకలూరిపేట 52 ఎకరాలలో 6500 ఇల్లు శిధిలం చేసిన అసమర్ధ నాయకురాలివి -- టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలలో టీడీపీ నాయకులు
చిలకలూరిపేట 52 ఎకరాలలో 6500 ఇల్లు శిధిలం చేసిన అసమర్ధ నాయకురాలివి -- టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలలో టీడీపీ నాయకులు
చిలకలూరిపేట పట్టణంలో టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులూ , అభిమానుల మధ్య టీడీపీ పట్టాన అధ్యక్షులు పఠాన్ సమ్మద్ ఖాన్ పార్టీ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులూ మాట్లాడుతూ 4000 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఒక్క మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుగారికి మాత్రమే సాధ్యం అన్నారు. అలాగే 52 ఎకరాలలో ఎర్పాటు చేసిన 6500 ఇళ్ల నిర్మాణం 90% పూర్తి అయినా మిగిలిన 10 % నిర్మాణాలని పూర్తిచేయకుండా శిధిలా లుగా మిగిల్చిన ఘనత ఒక్క రజనికి మాత్రమే సాధ్యం అని అన్నారు . అలాగే పట్టణంలో త్రాగు నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో ఎన్టీఆర్ సృజల పధకం ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసారు సదరు ప్లాంట్ సామాగ్రిని తూకం వెయ్యటానికి కూడా పనికిరాకుండా చేసారు అని అన్నారు. ప్రత్తిపాటి హయాం లో వచ్చిన కేంద్రీయ విశ్వ విద్యాలయం, గురుకుల పాఠశాల, మైనారిటీ విద్యార్థుల వసతి నివాసం, ఎస్సి సాంఘిక సంక్షేమ విద్యాలయం, పురపాలక సంఘం అనుమతు పొందిన రోడ్ల్ , డ్రైనేజీలు రాబోవు మూడు సంవత్సరాలలో పూర్తిచేసి MLA గా మీ కనీస ధర్మం పాటించాలి అని అన్నారు. ప్రత్తిపాటి ని విమర్శిస్తే మీ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది అని అనుకుంటే అది మీ భ్రమే అని, ఇక MLA భర్త కుమారస్వామి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు తట్టుకోలేక ఏమి మాట్లాడుతున్నాడో తనకే అర్ధం కావటం లేదు అని, మైనారిటీ వర్గానికి పురపాలక మున్సిపల్ ఛైర్మెన్ సీటు MLA రజని ఇవ్వలేదు అని , కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇవ్వవలసి వచ్చింది అని, 30 సీట్ల మెజారిటీ ఇచ్చిన పురప్రజలకి న్యాయం చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యూత్ నాయకులూ, సీనియర్ నాయకులూ, అభిమానులు పాల్గొని ర్యాలీ గా నర్సరావుపేట సెంటర్ నందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసారు.
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో MLA రజనిని , చైర్పర్సన్ రఫ్ఫాని ని సత్కరించిన TDP కౌన్సిలర్లు
చిలకలూరిపేటలో నేడు తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - పట్టణంలోని పలు అభివృద్ధి , మరమత్తుల కార్యక్రమాలకి కాంట్రాక్టు టెండర్లు పైన చర్చలు
చిలకలూరిపేటలో నేడు తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - పట్టణంలోని పలు అభివృద్ధి , మరమత్తుల కార్యక్రమాలకి కాంట్రాక్టు టెండర్లు పైన చర్చలు
చిలకలూరిపేట తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు అంశాల పైనా చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా పట్టణంలో మంచినీటి పైపుల లీకేజీలు , రోడ్ల మరమ్మతులు, పట్టణాన్ని పరిశుబ్రముగా ఉంచటం, పొట్టి శ్రీరాముల,YS రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాట్లు, మంచినీళ్ల పైపు లైన్ లేని వార్డులకు ఆయా పైపు లైన్ ఏర్పాటు. పలు అభివృద్ధి కార్యకర్మల పైనా చర్చలు. కాంట్రాక్టు టెండర్ల పైన చర్చలు జరిగే అవకాశం ఉంది