చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు, పోలింగ్ బూత్ ల మార్పు అంశము ఫై వినతి పత్రం అందించిన తెలుగుదేశం పార్టీ నేతలు
చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి తెలుగుదేశం పార్టీ తరఫున, నాదెండ్ల మండలంలోని సాతులూరు, అమీన్ సాహెబ్ పాలెం, ఇర్లపాడు, అప్పాపురం, తూబాడు గ్రామాలు, చిలకలూరిపేట పట్టణంలోని పాత వార్డు లు 08, 22, 31 అసంబద్దంగా పోలింగ్ బూత్ మార్పుల ఫై వివరాలతో సహా వినతి పత్రం అందించడం జరిగింది. దీనిపై సదరు అధికారి ఉన్నత అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి తగు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతూ, గ్రామస్తులు ఫిర్యాదు చేయకుండా, ఎక్కడ ఏమి అభ్యంతరాలు లేకపోయినా ఏ రకంగా పోలింగ్ బూతులు మారుస్తారని, ఈ ఆలోచనను విరమించుకొని పక్షంలో న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్రా శ్రీనివాసరావు, నందిగం శివ కోటేశ్వరరావు, కొండ్రగుంట సురేష్, నాగ పూర్ణచంద్ర రావు, జి.రామాంజనేయలు, ఎం.భాస్కర్ రావు, కల్లి సాంబశివరావు, నెల్లూరి హరిబాబు, షేక్ మస్తాన్ వలి (అప్పాపురం), దగ్గుమల్లి కోటేశ్వరరావు, షేక్ యాసీన్,సిరిబోయిన కోటయ్య, నజీరున్నిసా బేగం, మురకొండమల్లిబాబు, షేక్ అజారుద్దీన్, షేక్ భారీ సైదా, షేక్ ముజఫర్, షేక్ రహీమ్, శివుడు తదితరులు పాల్గొన్నారు.