చిలకలూరిపేట నియోజకవర్గంలో పట్టణ,మండలం & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 01-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో పట్టణ,మండలం & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 01-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోకవర్గంలో 01-07-2021,గురువారం నాడు మొత్తం 22 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 7 కేసులు నమోదు అయ్యాయి.
పసుమర్రు గ్రామంలో - 1
గోవిందపురం గ్రామంలో - 1
వేలూరు గ్రామంలో - 1
గొట్టిపాడు గ్రామంలో - 3
పోతవరం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో 1 కేసు నమోదు అయింది.
వడ్డెరపాలెం లో - 1 గా నమోదు అయింది.
నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 11 కేసులు నమోదు అయ్యాయి.
ఎండుగుంపాలెం గ్రామంలో - 2
సంక్రాంతిపాడు గ్రామంలో - 6
గణపవరం గ్రామంలో - 1
నాదెండ్ల గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండల గ్రామాలలో మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి.
ఉప్పరపాలెం గ్రామంలో - 2
బోయపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట - లారీ ఢీ - యువకుడు మృతి
చిలకలూరిపేట - లారీ ఢీ - యువకుడు మృతి
చిలకలూరిపేట - మండల పరిధిలోని నరసరావుపేట - చిలకలూరిపేట రోడ్డు మార్గంలో కోమటినేనివారిపాలెం గ్రామం వద్ద లారీ ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికి అక్కడే మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే యద్దనపూడి మండలం పెద్ద జాగర్లమూడి గ్రామానికి చెందిన తమ్ములూరి థామస్(40) ద్విచక్ర వాహనం పైన వెళ్తుండగా కోమటినేనివారిపాలెం వద్ద లారీ ఢీ కొనటంతో తలకు తీవ్ర గాయం అవ్వటంతో రక్తస్రావం అయింది. ఇంతలో స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన 108 వాహన సిబ్బంది పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. రురల్ పోలీస్ అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసారు.
చిలకలూరిపేట - లారీ తలపై నుండి వెళ్లటంతో అక్కడికి అక్కడే మృతి చెందిన మహిళా
చిలకలూరిపేట - లారీ తలపై నుండి వెళ్లటంతో అక్కడికి అక్కడే మృతి చెందిన మహిళా
చిలకలూరిపేట - లారీ పైనుండి వెళ్లటంతో అక్కడికి అక్కడే మృతిచెందిన ఘటన చిలకలూరిపేట మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామం నందు జరిగింది. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్న మేడిద ప్రేమే రాజు అతని భార్య స్వరూపంతో కలిసి మురికిపూడినందు ఫంక్షన్ కి ద్విచక్ర వాహనము పైన వెళ్లి వస్తుండగా రామచంద్రాపురం రోడ్డు పైన PS రెస్టారెంట్ సమీపంలో లారీ ఢీకొని స్వరూప క్రింద పడింది. అది గమనించని లారీ డ్రైవర్ లారీని ముందుకు తీసుకువెళ్లగా స్వరూప తలపై నుండి వెళ్లటంతో అక్కడికి అక్కడే మృతి చెందినది.విషయం తెలుసుకున్న రురల్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చిలకలూరిపేట - పసుమర్రులో జగనన్న కాలనీ 500 ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన
చిలకలూరిపేట - పసుమర్రులో జగనన్న కాలనీ 500 ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన
చిలకలూరిపేట - ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జగనన్న కాలనీ వసతి గృహాల నిర్మాణానికి పసుమర్రులో గురువారం నాడు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మొత్తం 500 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ గారు ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ తో పాటుగా మునిసిపల్ కమిషనర్ రవీంద్ర , డీ.ఈ రహీమ్ మరియు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.