వైసీపీ నుండి ఎమ్మెల్యే గా మల్లెల రాజేష్ నాయుడు పోటీ చేస్తారు - విజయసాయిరెడ్డి
చిలకలూరిపేట:- గత కొన్ని రోజులుగా చిలకలూరిపేట వైసిపి అభ్యర్థి టికెట్ పై పలు సందేహాలు తలెత్తాయి. ప్రముఖ మీడియా ఛానల్లో కూడా దీనిపై చర్చ జరగడంతో పార్టీ క్యాడర్ ఒకింత అయోమయానికి గురైనది. ఇలాంటి సందేహాలు అన్నిటికీ తెరదించుతూ విజయసాయిరెడ్డి అభ్యర్థిని ప్రకటించారు. ఈరోజు చిలకలూరిపేటలో సామాజిక సాధికారక యాత్రలో భాగంగా పాల్గొన్న విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చిలకలూరిపేట వైసిపి అభ్యర్థిగా మల్లెల రాజేష్ నాయుడు ని ఖరారు చేస్తున్నట్లు టికెట్ పై ఎటువంటి సందేహ పడొద్దు అని ఆయన ప్రకటించారు. కొన్ని రోజులుగా విడుదల రజిని తిరిగి పేటలో పోటీ చేస్తారని లేదా జాన్ సైదా కు టికెట్ మారుస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాటన్నిటికీ తెరదించుతూ విజయ్ సాయి రెడ్డి, మల్లెల రాజేష్ నాయుడుకి టికెట్ ఖరారు చేశారు. పార్టీలు వర్గాలుగా ఉండకుండా అందరూ ఒక తాటి మీదకు వచ్చి పార్టీని గెలిపించాల్సిందిగా విజయ్ సాయి రెడ్డి దిశా నిర్దేశం చేశారు.