చెలరేగిన పాకిస్తాన్ - తడబడిన కోహ్లీ సేన
భారత్ పై పాకిస్తాన్ భారీ విజయం. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో తడబడింది. రోహిత్ శర్మ డెకౌట్ అవగా వెంటనే కేఎల్ రాహుల్ (3) తో వెనుదిరిగాడు. వెంటనే సూర్యకుమార్ యాదవ్(11) అవుటయ్యాడు. కోహ్లీ(57) పంత్ కొంచెం సేపు మెరిపించినా భారత్ 20 ఓవర్లకు గాను 151-7 వికెట్లు నష్టంతో మొదటి ఇన్నింగ్స్ పూర్తి చేసుకుంది.
తర్వాత బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ బాబర్ ఆజం(68) రిజ్వాన్(79) చెలరేగిపోయారు. పాకిస్తాన్ ఆట ముందు భారత్ బౌలర్లు తేలిపోయారు. షమ్మీ, బూమ్రా, భువనేశ్వర్ కుమార్, జడేజా, వరుణ్ చక్రవర్తి ఎవరిని వదలకుండా వీర బాదుడు బాధి పారేశారు పాకిస్తాన్ బ్యాట్స్మన్స్. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 13 బాల్స్ మిగిలి ఉండగానే భారత్ పై పాకిస్తాన్ విజయం సాధించింది.