చిలకలూరిపేట:- లారీ బోల్తా - ఇద్దరికి తీవ్రగాయాలు
చిలకలూరిపేట:- చిలకలూరిపేట మండలం పరిధిలోని లింగంగుంట్ల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం - ఇద్దరికి గాయాలయ్యాయ.
వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి గుంటూరు ప్రత్తి లోడుతో లారీ వస్తోంది. లారీ డ్రైవర్ విశ్రాంతి తీసుకోవడంతో.... ఆ సమయంలో క్లీనర్ డ్రైవ్ చేస్తూ ఉండగా అదుపుతప్పి బోల్తా పడింది. లారీ డ్రైవర్ నాగిరెడ్డి తలకుతీవ్ర గాయాలు అయ్యాయి. ఇతనిది కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్ద పాసపుల్ల గ్రామం. లారీ క్లీనర్ జమాల్ బాషాకు స్వల్పగాయాలయ్యాయి. ఇతనిది కడప జిల్లా జమ్మలమడుగు. తెల్లవారు జాము 4 గంటల 30 నిమిషాల సమయంలో ఈ సంఘటన జరిగింది.. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం లారీ డ్రైవర్ నాగిరెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు.