రేపు పెళ్లి అనగా ఈ రోజు యాక్సిడెంట్ లో పద్మశాలి పేటకు చెందిన యువతి మృతి
చిలకలూరిపేట టౌన్ :- చిలకలూరిపేట పట్టణం లోని పద్మశాలి పేట కు చెందిన సాయి లక్ష్మి (30) అనే యువతి తన తల్లితో కలిసి స్కూటీ పై గుంటూరు వెళుతుండగా మార్గ మధ్యలో యడ్లపాడు సమీపంలో ఆగి ఉన్న వసంత నూనె మిల్లు కు సంబంధించిన బస్సును ఢీకొట్టడంతో యువతి అక్కడికక్కడే మరణించింది. వెనక ఉన్న తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు బస్సు డ్రైవర్ రోడ్డు పక్కన బస్సు ని ఆపి కాలకృత్యాలు తీసుకుంటుండగా సాయి లక్ష్మి ఆమె తల్లి తో పాటు స్కూటీపై వెళ్తుండగా రోడ్డుపై ఎవరో దిష్టి తీసిన కొబ్బరికాయ కొట్టి ఉండటంతో దాన్ని తప్పించబోయి వేగాన్ని ఆపలేక ఘటన జరిగినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న యడ్లపాడు పోలీసు వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి యువతి మృతదేహాన్ని చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పటల్ కు తీవ్రగాయాలైన తల్లిని గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు. విషాదకరమైన విషయం ఏమిటంటే యువతికి రేపు వివాహం అనగా ఈ రోజు ఆమె మృతి చెందటంతో పట్టణంలోని ఆమె నివాస గృహం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. మృతి చెందిన యువతి సాయి లక్ష్మి స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నందు ఆధార్ సెంటర్ లో పని చేస్తున్నట్లు సమాచారం.