చిలకలూరిపేట - సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన MLC మర్రి రాజశేఖర్
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని పలువురు బాధితులకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆఫీసు నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన నాగండ్ల వెంకటేశ్వరరావుకు ముఖ్యమంత్రి సహయ నిధి నుంచి రూ.1,70,000/- చెక్కును మంజూరు చేసారు.ఈరోజు నాగండ్ల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ చెక్కును అందజేశారు.
చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామ వాస్తవ్యులు కనడం గౌతం రామ్ సాయి ఊరి నడిబొడ్డున కట్టలపాము కరవగా ఆ పురుగు విషం ఊపిరితిత్తులకి చేరి అనారోగ్యంతో హస్పిటల్ లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారి కుటుంబానికి అండగా శ్రీ మర్రి రాజశేఖర్ ముఖ్యమంత్రి సహయనిధి నుండి 70,000/-డెబ్భై వేల రూపాయలు మంజూరు చేయించారు.ఈరోజు వారి కుటుంబ సభ్యులకు చెక్కు అందించారు.
అలాగే గోవిందపురం వాస్తవ్యులు నీరుకొండ నాగరాజకుమారి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరు అయిన 80,000/-యెనభైవేలరూపాయలు చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందించారు. వారితో పాటుగా మండల యువజన విభాగ మాజీ అధ్యక్షులు వేజర్ల కోటేశ్వరరావు, తోట పుల్లారావు, ఆలా మస్తాన్, గాయాల కొండలు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి, శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ కి తమ ధన్యవాదాలు తెలియజేశారు.
చిలకలూరిపేట పట్టణంలోని వార్తలను త్వరగా పొందడం కోసం క్రింది వాట్స్అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి & ఆ లింకును మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.
https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g