చిలకలూరిపేటలో 33 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ - భారీగా దొరికిన నగదు
చిలకలూరిపేటలో 33 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ - భారీగా దొరికిన నగదు
చిలకలూరిపేట పండరీపురంలోని ఒక అపార్టుమెంట్లో పేకాట ఆడుతున్న 33 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 13,50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తం లో డబ్బులు , ఒకే అపార్టుమెంట్లో 33 మందిని ఒకేసారి అరెస్ట్ చెయ్యటం తో ఆ ప్రాంతం అంత ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది. కుటుంబాలు నివసించే ప్రదేశాలలో ఇలాంటి కార్యాకలాపాలు చేసే వారిని కఠినంగా శిక్షించాలి అని స్థానికులు చెపుతున్నారు.అరెస్ట్ చేసిన వారిని కోర్టుకు హాజరుపరుస్తాం అని తెలిపారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది గుంటూరు, మంగళగిరి, విజయవాడ, తెనాలి, పట్టణంలోని వ్యక్తులుగా గుర్తించారు.
చిలకలూరిపేటలో ఆనందయ్య మందు లాంటి మందు పంపిణి కి సిద్ధం చేస్తున్న డాక్టర్ నుండి మందును సీజ్ చేసి మందుని పోలీస్టేషన్ కు తరలింపు
CHILAKALURI PET SPEED NEWSSunday, June 06, 2021ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
చిలకలూరిపేటలో ఆనందయ్య మందు లాంటి మందు పంపిణి కి సిద్ధం చేస్తున్న డాక్టర్ నుండి మందును సీజ్ చేసి మందుని పోలీస్టేషన్ కు తరలింపు
చిలకలూరిపేట పట్టణంలోని అమ్మ పాలిక్లినిక్ నందు కరోనా సోకినా వారికీ,కరోనా సోకకుండా ఉండేందుకు ఆనందయ్య లాంటి మందుని పంపిణి చేస్తున్నట్లు డాక్టర్ హనీఫ్ తెలిపారు. అయితే విషయం తెలుసుకున్న చిలకలూరిపేట టౌన్ SI అనిల్ బాబు, శానిటరీ ఇన్స్పక్టర్ శ్రీనివాసరావు, మునిసిపల్ రెవెన్యూ అధికారి ఫణి కుమార్ అమ్మ పాలిక్లినిక్ కి చేరుకొని పంపిణీకి సిద్ధంగా ఉంచిన మందుని పరిశీలించి మందు పంపిణీ చెయ్యటానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని తెలిపారు. అలాగే పంపిణీకి సిద్ధం గా ఉన్న మందును సీజ్ చేసి పోలీస్టేషన్ కి తరలించారు.
చిలకలూరిపేట 06-06-2021,ఆదివారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు
CHILAKALURI PET SPEED NEWSSunday, June 06, 2021కరోనా న్యూస్, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
చిలకలూరిపేట 06-06-2021,ఆదివారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల పరిధిలో ఆదివారం నాడు మొత్తం 28 కేసులు నమోదు అయ్యాయి. అందులో
చిలకలూరిపేట పట్టణం లో 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
సుధా వారిపాలెం లో - 1
సుగాలి కాలనీ లో - 1
రజక వీధి లో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 25 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
మురికిపూడి గ్రామంలో - 4
యడవల్లి గ్రామంలో - 1
బొప్పూడి గ్రామంలో - 1
గోవిందపురం గ్రామంలో - 2
కావూరు గ్రామంలో - 9
లింగంగుంట్ల గ్రామంలో - 4
గొట్టిపాడు గ్రామంలో - 1
వేలూరు గ్రామంలో - 2
నాగబైరువారిపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి
సోమవారం నుండి మందు పంపిణి షురూ చేసిన ఆనందయ్య
సోమవారం నుండి మందు పంపిణి షురూ చేసిన ఆనందయ్య
చాల రోజుల నుండి ఎదురు చూస్తున్న ఆనందయ్య మందు పంపిణి పైన క్లారిటీ ఇచ్చారు. ఆదివారం ఎర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆనందయ్య మాట్లాడుతూ ప్రజలు మందు కోసం వేచి చూస్తున్నారు అని అందువలన సోమవారం నుండి మందు పంపిణి జరుగుతుంది అని తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోని సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్య సోదరుడు, శిష్యబృందం మందుని అందజేస్తారు అని. క్యూ లైన్ లో ఉన్న వారికి త్వరగా మందు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే అన్ని ప్రాంతాల వారికీ త్వరలో మందు పంపిణి చేస్తాం అని తెలిపారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సతీమణి మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సతీమణి మృతి
ఆంధ్రప్రదేశ్ - గుంటూరు జిల్లా నరసరావుపేట నుండి ముఖ్యమంత్రి మరియు కేంద్ర హోమ్ శాఖా మంత్రిగా చేసిన కాసు బ్రహ్మనందరెడ్డి సతీమణి అయిన కాసు రాఘవమ్మ (96) గారు ఆదివారం హైద్రాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె స్వస్థలం చిలకలూరిపేట నియోజవర్గం అయిన నాదెండ్ల మండలం. ఆమె మరణ వార్త తెలుసుకున్న మండల ప్రజలు ఆమెకు సంతాపం తెలిపారు. అలాగే రాజకీయ నాయకులూ, ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలిపారు
గుంటూరు జిల్లా - కంచె చేను మేసినట్లుంది - అక్రమ మద్యం - మామూళ్లు వసూళ్లు చేస్తున్న SI లపైన వేటు
గుంటూరు జిల్లా - కంచె చేను మేసినట్లుంది - అక్రమ మద్యం - మామూళ్లు వసూళ్లు చేస్తున్న SI లపైన వేటు
కంచె చేనుని మేసినట్లు - గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం కట్టడి చెయ్యాల్సిన పోలీస్ వారే ప్రోత్సహించారు. జిల్లాలోని పలనాడు ప్రాంతం మపాళ్ళ, దుర్గి SI లు ఈ ఘటనకు పాల్పడారు. ముప్పాళ్ల SI నాగేశ్వరరావు , దుర్గి SI రామాంజనేయులు పైనా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీస్ ఉన్నత అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో ఇరువురు SI లు ఇతర రాష్ట్రాల నుండి మద్యం తీసుకువచ్చి అమ్మే వారి దగ్గిర నుండి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు నిర్ధారణ అయినది. వెంటనే పోలీసు ఉన్నత అధికారులు ఇరువురి SI ల పైన వేటు వేశారు
చిలకలూరిపేట - పట్టణంలోని 23 వార్డులో మంచినీటి కోసం అవస్థలు
చిలకలూరిపేట - పట్టణంలోని 23 వార్డులో మంచినీటి కోసం అవస్థలు
చిలకలూరిపేట పట్టణంలోని 23వ వార్డు లోని ప్రజలు మునిసిపాలిటీ వాటర్ రాకపోవటంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు. వార్డులోని ప్రజలు మాట్లాడుతూ గత 10 రోజుల నుండి వార్డులో మంచినీటి సమస్య ఉన్నది అని, ప్రతి రోజు రాత్రి సమయాలలో నిద్రలేకుండా మంచినీటి కోసం మోటర్లు వేస్తు తెల్లవారు జామున వేచి ఉన్నకాని మునిసిపాలిటీ వాటర్ రావటం లేదుఅని, పొద్దుపొద్దున్నే లేచినప్పటి నుండి మధ్యాహ్నం వరకు కూడా మంచినీరు నిత్యావసరం అని,వార్డు ప్రజలువారి బాధను వ్యక్తం చేసారు. 23వ వార్డు లోని గౌడ పాలెం , సత్రం బజార్, దర్గ బజార్, మామిడోళ్ల బజార్లోని ప్రజలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. స్థానికి వార్డు కౌన్సిలర్ కంచర్ల కరుణ గారు అధికారులతో మాట్లాడి వాటర్ ట్యాంకులతో మంచి నీటిని అందించారు. గతంలో 10 రోజుల క్రితం కూడా వార్డు ఇంచార్జి శ్రీరాం శివ పార్వతి గారు కూడా ఇలాగే వాటర్ ట్యాంకులని తెపించి మంచి నీటిని అందించారు. అయితే వార్డు ప్రజలు మాత్రం వాటర్ ట్యాంకులతో కాకుండా మంచినీటిని పైపుల ద్వారా అందించటానికి, వాటి సంబందించిన అధికారులతో మాట్లాడి మరమ్మతులు త్వరగా పూర్తి చేయించి నీటి సమస్యని పరిష్కరించాలి అని కోరారు.