చిలకలూరిపేట పట్టణంలోని 23వ వార్డు లోని ప్రజలు మునిసిపాలిటీ వాటర్ రాకపోవటంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు. వార్డులోని ప్రజలు మాట్లాడుతూ గత 10 రోజుల నుండి వార్డులో మంచినీటి సమస్య ఉన్నది అని, ప్రతి రోజు రాత్రి సమయాలలో నిద్రలేకుండా మంచినీటి కోసం మోటర్లు వేస్తు తెల్లవారు జామున వేచి ఉన్నకాని మునిసిపాలిటీ వాటర్ రావటం లేదుఅని, పొద్దుపొద్దున్నే లేచినప్పటి నుండి మధ్యాహ్నం వరకు కూడా మంచినీరు నిత్యావసరం అని,వార్డు ప్రజలువారి బాధను వ్యక్తం చేసారు. 23వ వార్డు లోని గౌడ పాలెం , సత్రం బజార్, దర్గ బజార్, మామిడోళ్ల బజార్లోని ప్రజలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. స్థానికి వార్డు కౌన్సిలర్ కంచర్ల కరుణ గారు అధికారులతో మాట్లాడి వాటర్ ట్యాంకులతో మంచి నీటిని అందించారు. గతంలో 10 రోజుల క్రితం కూడా వార్డు ఇంచార్జి శ్రీరాం శివ పార్వతి గారు కూడా ఇలాగే వాటర్ ట్యాంకులని తెపించి మంచి నీటిని అందించారు. అయితే వార్డు ప్రజలు మాత్రం వాటర్ ట్యాంకులతో కాకుండా మంచినీటిని పైపుల ద్వారా అందించటానికి, వాటి సంబందించిన అధికారులతో మాట్లాడి మరమ్మతులు త్వరగా పూర్తి చేయించి నీటి సమస్యని పరిష్కరించాలి అని కోరారు.
Home »
గుంటూరు జిల్లా
,
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేట - పట్టణంలోని 23 వార్డులో మంచినీటి కోసం అవస్థలు
చిలకలూరిపేట - పట్టణంలోని 23 వార్డులో మంచినీటి కోసం అవస్థలు
చిలకలూరిపేట - పట్టణంలోని 23 వార్డులో మంచినీటి కోసం అవస్థలు
No comments:
Post a Comment