చితక్కొట్టిన భారత్ - కానీ!!!
ప్రపంచ కప్ టీ20ల్లో మొదటి రెండు మ్యాచుల్లో భారత్ తడబడింది కోహ్లీ సేన న్యూజిలాండ్ పాకిస్తాన్ లతో జరిగిన పోరులో భారత్ చిత్తుచిత్తుగా ఓడిపోయి విమర్శల పాలయింది. గడిచిన రెండు మ్యాచ్ లలో టాప్ ఆర్డర్స్ విఫలమవటంతో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈరోజు జరిగిన ఆప్ఘనిస్తాన్ భారత్ మ్యాచ్ లో భారత్ వీర విజృంభించింది. కేఎల్ రాహుల్ 48 బంతులకు 69 రన్స్ చేయగా, హిట్ మాన్ రోహిత్ శర్మ 47 బంతులకు 74 పరుగులు చేశారు. తరువాత వచ్చిన పంత్ 13 బంతులకు 27 పరుగులు, హార్దిక్ పాండ్యా 13 బంతులకు 35 పరుగులు చేశాడు. మొత్తంగా చూసుకుంటే 20 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 210 భారీ స్కోరు ఆఫ్ఘనిస్తాన్కు టార్గెట్ గా ఇచ్చారు అందులో 10 సిక్స్ లు 19 ఫోర్స్ బాదారు.
తరువాత బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 20 వరకు 7 వికెట్ల కష్టానికి 144 పరుగులు చేసింది. కానీ టీమ్ ఇండియా సెమీస్కు చేరుకోవటం కష్టం. నవంబర్ 5న స్కాట్లాండ్ తో నవంబర్ 8న నమీబియా తో టీమిండియా ఆడనుంది.